Wednesday 23 November 2016

దీపరాధన


దీపరాధన

ఆవునెయ్యితో దీపాలువెలిగించడం ఉత్తమం.

కార్తీక మాసం పర్వదినాలలో దీపారాధన చేసే భక్తులు ,
శివాలయంలో గాని , వైష్ణవాలయంలోగాని దీపాలు వెలిగించాలి.
అలయ గోపురద్వారం వద్ద గాని, దేవుడి సన్నిదిలో గాని, ఆలయప్రాంగణంలో గాని
దీపాలను వెలిగించాలనీ,అలా వెలిగించిన వారి జన్మజన్మల పాపాలుహరింపబడి
ఇహంలో సౌఖ్యం , పరంలో మోక్షం సిద్ధిస్తుందని శాస్త్రవచనం.

నదులలో  దీపాలను వదిలిపెట్టాలని , అలా చేయుటచే పుణ్య ప్రాప్తి అని పెద్దలు అంటారు.

అరటి దొప్పలోగానీ, అకుమీద గానీ దీపం వుంచి ,
నదులలో వదలడం కూడా పుణ్య ప్రదమే.
ఉసిరికాయ పైన ఆవు నెయ్యితో తడిపిన వత్తులను వుంచి
దీపమును వెలిగించడం అత్యంత శ్రేష్ఠం.

వెండి కుందులు, పంచ లోహ కుందులు,ఇత్తడి కుందులు మంచివి.
మట్టి కుందులు కూడా ఉపయోగించవచ్చు.

కుందుని ఒక పళ్ళెం లో కాని తమలపాకు మీద కాని పెట్టాలి.
కింద ఆధారం లేకుండా పెట్టకూడదు.

దీపారాధన చేసేటప్పుడు ముందుగా నునె పొసి ,తర్వాత వత్తులు వేయాలి.

దీపారాధన చేయగానే దీపానికి మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి.
దీప పీఠభాగము బ్రహ్మాతో సమానం. స్ధంబము విష్ణురూపము, ప్రమిద పరమేశ్వరుడు,
 దీపతైలం నాదం, వత్తి అగ్ని, వెలుగుశక్తి స్వరూపం.

అమ్మవారిముందు బియ్యంపోసి దానిమాద వెండి కుందిలో దీపారాధన చేసి,
తెల్లకలువ పూలతో దీపాన్ని అలంకరించి, పూజ చేస్తే తెలివి తేటలు, మేధస్సుపెరిగి,
సాత్విక మార్గంలో సంపాదన పెరుగుతుంది.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/