Sunday 27 November 2016

పనస ఆకు బుట్టలు


పనస ఆకు బుట్టలు

కావలిసిన  పదార్థాలు
1. పొట్టు మినపప్పు  1 గ్లాసు
2. వుప్పుడునూక  2  గ్లాసులు
3. ఉప్పు  రుచికి సరిపడా
4. పనస. ఆకులు

తయారీ  విధానం
 ముందుగా మినపప్పు  ను   , వుప్పుడునూకను ,
 వేటికవి  వేరు  వేరు. గిన్నెలలో  నీళ్లు  పోసి  ,
6. గంటల  సేపు  నానబెట్టుకోవాలి .
నానిన  మినపపప్పును పొట్టు   తీసి
శుభ్రంగా కడుగు కోవాలి.
తగినంత  ఉప్పును  వేసి మెత్తగా  గ్రైండ్  చేసుకోవాలి.
 అలాగే  వుప్పుడునూకను  కూడా  శుభ్రం  గా  కడిగి
గ్రైండ్  చేసుకున్న  మినపపిండిలో  వేసి
బాగా  కలిపి   2 గంటలసేపు   అలా  వదిలెయ్యాలి .
పనస  ఆకులు  తీసుకుని  శుభ్రంగా  కడుగుకోవాలి ,
చిన్న  గ్లాసు లు కానీ  , కప్పులుగాని , తీసుకుని
లోపల నెయ్యి  రాసి  ,
కడిగిన ఈ  ఆకులను వాటిలో  పెట్టి
రుబ్బుకున్న   పిండి ని  వేసి  ,
కుక్కరులో  పెట్టి
ఇడ్లీ  మాదిరిగా ఆవిరి  మీద  ఉడికించుకోవాలి .
చల్లారిన  తరువాత , ఇడ్లి  తీసుకున్నట్లే
స్పూన్ తో  తీస్తే  పనస  ఆకు  బుట్టలు  రెడీ.

వీటిని నెయ్యి వేసుకుని  కారప్పొడి,  కొబ్బరి  పచ్చడి , తో గాని  అల్లం పచ్చడి తో  ,
గాని తింటే  బాగుంటాయి .

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.