Sunday 31 January 2016

రామాయణం- ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు


 రామాయణం- ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు

1. భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం -   గంగోత్రి, ఉత్తరాఖండ్
2. కపిల మహర్షి ఆశ్రమం, (శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000 మంది కాలి బూడిదైన స్థలం. గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికి పుణ్యలోకాలు ప్రసాదించి బంగాళాఖాతంలో కలుస్తుంది) - గంగాసాగర్, వెస్ట్ బెంగాల్
3. కాంభోజ రాజ్యం - ఇరాన్    (శ్రీరాముని ముత్తాత రఘు మహారాజు సామ్రాజ్యం ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది).
4. రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్ని పూజించి వరాలు పొందిన చోటు)- లాంగకో, టిబెట్, చైనా
5. పరమశివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చోటు - గోకర్ణ, కర్ణాటక
6. సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి, బీహార్
7. మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) - జనక్ పూర్, నేపాల్.
8. కోసలదేశం - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకు ఉన్న ప్రదేశం.
9. దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం - ఫైజాబాద్, ఉత్తర్ ప్రదేశ్.
10. సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) - ఘాఘర నది.
11. అయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం, బంగారు సీతతో అశ్వమేధ యాగం చేసిన స్థలం, సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) - అయోధ్య, ఉత్తర్ ప్రదేశ్.
12. తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్, బీహార్
13. అహల్య శాపవిమోచన స్థలం - అహిరౌలి, బీహార్
14. కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) - సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్
15. గుహుడు సీతారామ లక్ష్మణులను కలిసిన చోటు - శృంగబేరిపురం, అలహాబాద్ దగ్గర
16. దండకారణ్యం - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్ లలోని కొన్ని ప్రాంతాలు.
17. చిత్రకూటం (సీతారామ లక్ష్మణులు వనవాసం చేసిన చోటు) - సాత్న జిల్లా, మధ్యప్రదేశ్.
18. పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) - నాసిక్, మహరాష్ట్ర.
19. కబంధాశ్రమం - కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక.
20. శబరి ఆశ్రమం - సర్బన్, బెల్గావి, కర్ణాటక.
21. హనుమంతుడు రామ లక్ష్మణులను మొదటిసారిగా కలసిన ప్రదేశం - హనుమాన్ హళ్ళి, కొప్పాళ, కర్ణాటక.
22. ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం), కిష్కింద (సుగ్రీవుని రాజ్యం), ఋష్యమూక పర్వతం -తుంగభద్ర నదీతీర ప్రాంతం, హంపి దగ్గర, కర్ణాటక.
23. విభీషణుడు రాముణ్ణి శరణు కోరిన స్థలం - ధనుష్కోటి, తమిళనాడు.
24. శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించిన చోటు- రామేశ్వరం, తమిళనాడు
25. రత్నద్వీపం / సింహళం / లంక - శ్రీలంక.
26. అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) - కాండీ దారిలోని సీత ఏళియ, శ్రీలంక.
27. శ్రీరాముడు రావణుని వధించిన చోటు - దునువిల్ల, శ్రీలంక.
28. సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం - దివిరుంపోల, శ్రీలంక.
29. వాల్మీకి ఆశ్రమం/ కుశ లవుల జన్మ స్థలం / సీతాదేవి భూదేవిలో ఐక్యమైన స్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30 మైళ్ళ దూరంలోని బితూర్.
30. కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్, పాకిస్తాన్.
31. లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్, పాకిస్తాన్
32. తక్షశిల (శ్రీరాముని తమ్ముడు భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) - తక్షశిల, పాకిస్తాన్
33. పుష్కలావతి/ పురుష పురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్.

ఆదిత్యహృదయం


   ADITYA HRUDAYAM / ఆదిత్యహృదయం

తతో యుద్ధపరిశ్రాంతం సమరే చింతయా స్థితమ్ |
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ || ౧ ||
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ |
ఉపాగమ్యాబ్రవీద్రామమగస్త్యో భగవానృషిః || ౨ ||
రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ |
యేన సర్వానరీన్వత్స సమరే విజయిష్యసి || ౩ ||
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనమ్ |
జయావహం జపేన్నిత్యమక్షయం పరమం శివమ్ || ౪ ||
సర్వమంగళ మాంగళ్యం సర్వపాపప్రణాశనమ్ |
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ || ౫ ||
రశ్మిమంతం సముద్యంతం దేవాసురనమస్కృతమ్ |
పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ || ౬ ||సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః |
ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః || ౭ ||
ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః |
మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః || ౮ ||
పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః |
వాయుర్వహ్నిః ప్రజాప్రాణ ఋతుకర్తా ప్రభాకరః || ౯ ||
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ |
సువర్ణసదృశో భానుర్హిరణ్యరేతా దివాకరః || ౧౦ ||
హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్ |
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తాండ అంశుమాన్ || ౧౧ ||
హిరణ్యగర్భః శిశిరస్తపనో భాస్కరో రవిః |
అగ్నిగర్భోఽదితేః పుత్రః శంఖః శిశిరనాశనః || ౧౨ ||
వ్యోమనాథస్తమోభేదీ ఋగ్యజుఃసామపారగః |
ఘనవృష్టిరపాం మిత్రో వింధ్యవీథీ ప్లవంగమః || ౧౩ ||
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః |
కవిర్విశ్వో మహాతేజాః రక్తః సర్వభవోద్భవః || ౧౪ ||
నక్షత్రగ్రహతారాణామధిపో విశ్వభావనః |
తేజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోఽస్తు తే || ౧౫ ||
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయే నమః |
జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః || ౧౬ ||
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః |
నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః || ౧౭ ||
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః |
నమః పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమః || ౧౮ ||
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే |
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః || ౧౯ ||
తమోఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయామితాత్మనే |
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః || ౨౦ ||
తప్తచామీకరాభాయ వహ్నయే విశ్వకర్మణే |
నమస్తమోఽభినిఘ్నాయ రుచయే లోకసాక్షిణే || ౨౧ ||
నాశయత్యేష వై భూతం తదేవ సృజతి ప్రభుః |
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః || ౨౨ ||
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః |
ఏష ఏవాగ్నిహోత్రం చ ఫలం చైవాగ్నిహోత్రిణామ్ || ౨౩ ||
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ |
యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః || ౨౪ ||
ఏనమాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ |
కీర్తయన్ పురుషః కశ్చిన్నావసీదతి రాఘవ || ౨౫ ||
పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిమ్ |
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి || ౨౬ ||
అస్మింక్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి |
ఏవముక్త్వా తదాఽగస్త్యో జగామ చ యథాగతమ్ || ౨౭ ||
ఏతచ్ఛ్రుత్వా మహాతేజా నష్టశోకోఽభవత్తదా |
ధారయామాస సుప్రీతో రాఘవః ప్రయతాత్మవాన్ || ౨౮ ||
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్ |
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ || ౨౯ ||
రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ |
సర్వ యత్నేన మహతా వధే తస్య ధృతోఽభవత్ || ౩౦ ||
అథ రవిరవదన్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహృష్యమాణః |
నిశిచరపతిసంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి || ౩౧ ||

Saturday 30 January 2016

శ్రీ లక్ష్మీనారాయణి “స్వర్ణ దేవాలయం"


                                              శ్రీ లక్ష్మీనారాయణి “స్వర్ణ దేవాలయం"

శ్రీ లక్ష్మీ నారాయణి “స్వర్ణ దేవాలయం” తమిళనాడు రాష్ట్రంలో
వేలూరు “మలైకుడి” అనే ప్రాంతానికి దగ్గర్లో కొండల దిగువున
దాదాపు 100 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినది.
 చెన్నై నుంచి సుమారు 180 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

దీని నిర్మాణసారధి “నారాయణి అమ్మ” అనే స్వామి.
 ఆయనను “శక్తి సిద్ధ” అనే పేరుతో కూడా పిలుస్తారు.
 ఈ స్వర్ణ దేవాలయం 55,000 చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించబడింది.
దీని “గర్భ గుడి” సుమారు
1.5 మెట్రిక్ టన్నుల అసలు సిసలైన “బంగారం”తో చేసిన
మందపాటి రేకులతో కప్పబడి ఉండటం వలన
దీనికి “స్వర్ణ దేవాలయం”అని పేరు వచ్చింది.
ఆలయ ఆవరణం “నక్షత్రం” ఆకారంలో ఉంటుంది.
గుడిలోకి ప్రవేశించే దారి పొడవునా
భగవద్గీత, ఖురాన్, బైబిల్, గురుగ్రంథ్ సాహిబ్ నుండి సేకరించిన
శ్లోకాలతో పొందుపరచ బడి ఉంటాయి.

ప్రతి శుక్రవారం ఇక్కడికి వచ్చే భక్తుల దర్శనాన్ని పర్యవేక్షించడానికి
 సుమారు 700 మంది పోలీసులను ప్రభుత్వం నియమించింది.
ఇక్కడ “ఆగమ శాస్త్రాల ప్రకారం పూజలు చెయ్యరు”.
కాని “శ్రీ విద్య” అనే ప్రాచీనమైన, అరుదైన “శక్తి పూజా” విధానాన్ని అనుసరిస్తారు.

నారాయణి అమ్మ స్వామి ఏర్పాటు చేసిన సంస్థకు
సుమారు ఆరు దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి.
 ఆలయ నిర్మాణానికి అవసరమైన నిధులు
దీని ద్వారానే లభించాయని ఆయన తెలియజేశారు.
 ఆయన అంతకు మునుపే పేదరిక నిర్మూలనకూ,
వికలాంగులకూ సహాయం చేశారు.
మూడు కోట్ల రూపాయలతో చుట్టుపక్కల ఉన్న దాదాపు
600 దేవాలయాలను “జీర్ణోద్ధరణ” కూడా కావించారు.

ఇక్కడ విశేషమేమంటే, ఈ దేవాలయములో గర్భగుడికి “మూడు వైపులా” నీరు, ఒకవైపు ద్వారం వుంటుంది. ఇక్కడకు వచ్చే భక్తులు ఆ నీటిని పవిత్రమైనదిగా భావిస్తారు

శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి


శ్రీ వేంకటేశ్వర ప్రపత్తి

ఈశానాం జగతోఽస్య వేంకటపతేః విష్ణోః పరాం ప్రేయసీం
తద్వక్షస్స్థల నిత్య వాసరసికాం తత్‍క్షాంతి సంవర్ధినీం |
పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాదిగుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరం || ౧ ||
శ్రీమన్ కృపాజలనిధే కృతసర్వలోక-
సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ |
స్వామిన్ సుశీలసులభాశ్రితపారిజాత
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || ౨ ||
ఆనూపురార్పితసుజాతసుగంధిపుష్ప-
సౌరభ్యసౌరభకరౌ సమసన్నివేశౌ |
సౌమ్యౌ సదాఽనుభవనేఽపి నవానుభావ్యౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || ౩ ||
సద్యోవికాసిసముదిత్వరసాంద్రరాగ
సౌరభ్యనిర్భరసరోరుహసామ్యవార్తాం |
సమ్యక్షు సాహసపదేషు విలేఖయంతౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || ౪ ||
రేఖామయధ్వజసుధాకలశాతపత్ర
వజ్రాంకుశాంబురుహకల్పకశంఖచక్రైః |
భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నైః
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || ౫ ||
తామ్రోదరద్యుతిపరాజితపద్మరాగౌ
బాహ్యైర్మహోభిరభిభూతమహేంద్రనీలౌ |
ఉద్యన్నఖాంశుభిరుదస్తశశాంకభాసౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || ౬ ||
సప్రేమభీతి కమలాకరపల్లవాభ్యాం
సంవాహనేఽపి సపది క్లమమాదధానౌ |
కాంతావవాంగ్మనసగోచరసౌకుమార్యౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || ౭ ||
లక్ష్మీమహీతదనురూపనిజానుభావ
నీలాదిదివ్యమహిషీకరపల్లవానాం |
ఆరుణ్యసంక్రమణతః కిల సాంద్రరాగౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || ౮ ||
నిత్యాన్నమద్విధిశివాదికిరీటకోటి
ప్రత్యుప్త దీప్త నవరత్న మహఃప్రరోహైః |
నీరాజనా విధిముదారముపాదధానౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || ౯ ||
విష్ణోః పదే పరమ ఇత్యుతిదప్రశంసౌ
యౌ మధ్వ ఉత్స ఇతి భోగ్యతయాఽప్యపాత్తౌ |
భూయస్తథేతి తవ పాణితలప్రదిష్టౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || ౧౦ ||
పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ
యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి |
భూయోఽపి మహ్యమిహతౌ కరదర్శితౌ తే
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || ౧౧ ||
మన్మూర్ధ్ని కాలియఫణే వికటాటవీషు
శ్రీ వేంకటాద్రిశిఖరే శిరసి శ్రుతీనాం |
చిత్తేఽప్యనన్యమనసాం సమమాహితౌతే
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || ౧౨ ||
అమ్లానహృష్యదవనీతలకీర్ణపుష్పౌ
శ్రీవేంకటాద్రి శిఖరాభరణాయమానౌ |
ఆనందితాఖిల మనో నయనౌ తవైతౌ
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || ౧౩ ||
ప్రాయః ప్రపన్న జనతా ప్రథమావగాహ్యౌ
మాతుస్స్తనావివ శిశోరమృతాయమానౌ |
ప్రాప్తౌపరస్పరతులామతులాంతరౌ తే
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || ౧౪ ||
సత్వోత్తరైస్సతత సేవ్యపదాంబుజేన
సంసారతారకదయార్ద్ర దృగంచలేన |
సౌమ్యోపయంతృమునినా మమ దర్శితౌ తే
శ్రీవేంకటేశచరణౌ శరణం ప్రపద్యే || ౧౫ ||
శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయభావే
ప్రాప్యే త్వయి స్వయముపేయతయాస్ఫురంత్యా |
నిత్యాశ్రితాయ నిరవద్యగుణాయ తుభ్యం
స్యాం కింకరో వృషగిరీశ న జాతు మహ్యమ్ || ౧౬ ||

Friday 29 January 2016

సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం


సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం

క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే|
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే||

ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే|
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్||

సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ|
రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః||

కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా|
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే||

వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ|
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః||

కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్|
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే||

కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే|
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ||

పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే|
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే||

కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ|
రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే||

ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా|
రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః||

ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్|
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్||

అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్|
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్||

పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్|
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్||

పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్|
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్||

హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్|
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్||

సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్|
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్||

|| ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణమ్ ||

Thursday 28 January 2016

రాధాయ నమః


                                                                " రాధాయ నమః "

అనే ఆరు అక్షరాల (షడక్షరీ) మహా మంత్రం నాలుగువిధాలుగా(చతుర్విధ) ఫలప్రదాయిని అని
భక్తులు విశ్వసిస్తారు. 'రాధ' మంత్రాన్ని శ్రీకృష్ణుడు ఆ దేవి నుంచి రాస మండలంలో ఉపదేశ
రూపంలోపరిగ్రహించాడని,

అదే మంత్రాన్ని గురు పరంపర నుంచి నారదుడు గ్రహించాడని 'పద్మ పురాణం' చెబుతున్నది.

రాధాకృష్ణులు- ద్వంద్వ సమాసం. ఆ మాట వినగానే అద్వైత ప్రణయం గోచరిస్తుంది.
అప్రాకృతమైన జగత్తులో- ముక్త ధామం, వైకుంఠం, గోలోకం అనే మూడు ప్రధాన
లోకాలు ఉన్నాయని నారాయణోపనిషత్తు వర్ణిస్తుంది.

 గోలోకాన్ని మహారాస మండలి అంటారు. నిత్య బృందావనం, శ్వేత మండలి అని కూడా వ్యవహరిస్తారు. అది ఒక మహా రస జగత్తు. ఆ జగత్తుకు ప్రభువు గోపాలుడు. ఆయనే రాధామాధవుడు. ఆ రస సమ్రాట్‌ శక్తినే రాసేశ్వరిగా భావిస్తారు. 'రాసము' అంటే గోకులంలోని ఒక క్రీడావిశేషం, సల్లాపం అని అర్థాలున్నాయి. ధావనం అంటే పరుగు. శ్రీకృష్ణుణ్ని ప్రాణాధారంగా చేసుకొన్న రాధ ఆయన వామ పార్శ్వం నుంచి పుట్టిందని చెబుతారు. ఆమె పుట్టగానే రాస మండలంలో కృష్ణుడి సేవకోసం ధావనం (పరుగు) సాగించడం వల్ల రాధగా మారిందని బ్రహ్మవైవర్త పురాణం వివరిస్తోంది.

శ్రీకృష్ణుడికి రాధ ప్రాణాధికురాలైన ప్రియురాలు. మహా ప్రకాశవంతమైన గోలోక రాస మండలంలో రాధాకృష్ణులే ఆది దంపతులు. నాలుక కొన నుంచి పుట్టిన కన్య 'రాధ' కాలాంతరంలో రెండు రూపాలు ధరించిందని పురాణ కథనం. అందులో ఒకటి లక్ష్మి రూపమని, రెండోది రాధ ప్రతిరూపమని భావిస్తారు.

రాధ జన్మ వృత్తాంతం గురించి భిన్నగాథలు వ్యాప్తిలో ఉన్నాయి. ఆమె కేదారుడు అనే రాజుకు యజ్ఞకుండంలో పుట్టిన కుమార్తె అని చెబుతారు. పేరు బృంద అని, కృష్ణుణ్ని భర్తగా పొందాలని
కోరి తపం ఆచరిస్తే ఆయన ప్రత్యక్షమయ్యాడని విశ్వసిస్తారు. ద్వాపర యుగంలో రాధ తనను సేవించడం వల్ల ఆ ప్రదేశం 'బృందావనం'గా మారుతుందని వరమిచ్చాడనీ ఆ గాథ సారాంశం.వృషభానుడు,
కళావతి దంపతులకు పుట్టిన తనయకు గర్గ మహాముని 'రాధ' అని నామకరణం చేశాడు. బ్రహ్మవైవర్తం ప్రకారం, దూర్వాస ముని 'రసరశ్మి' అని పేరు పెట్టాడు.  శ్రీకృష్ణుణ్ని రాధాదేవి తన మనసులో లయం చేసి విజయం సాధించిన రోజు- భాద్రపద శుద్ధ అష్టమి. అందుకే 'రాధాష్టమి'గా వ్యవహరిస్తారు.
పవిత్ర ప్రేమకు చిహ్నంగా భావించి రాధాకృష్ణులను పూజిస్తారు.

రాధాకృష్ణులను ఆరాధించడం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగం పెరుగుతుందని విశ్వాసం.
రాధాకృష్ణులు ఏకైక రూపులు. వారిది రాధ పేరులో ఉండే 'ర'కార ఉచ్చారణ వల్ల మానవులకు
శ్రీకృష్ణుడి చరణ కమలాలపై నిశ్చల భక్తి కుదురుతుంది. 'ధ' నామస్మరణ వల్ల
సాయుజ్యం కలుగుతుందని, రాధ నామస్మరణతో రోగ, మృత్యు భయాల నుంచి
నివృత్తి కలుగుతుందనీ భావన.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:





Wednesday 27 January 2016

స్నాన విధి


                                                                         స్నాన విధి

గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతి / 
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు //
లేదా

యో సౌ సర్వగతో విష్ణు: చిత్ స్వరూపీ నిరంజనః / 
స ఏవ ద్రవరూపేణ గంగాంభో నాత్ర సంశయః //

(భాహ్యాభ్యంతరభేదేన శౌచం తు ద్వివిధం స్మృతమ్ / మృజ్జలాభ్యాం బహిశుద్ధి ర్భావశుద్ధి స్తదాన్తరమ్ //
బాహ్యాభ్యంతర భేదములచే శౌచం రెండువిధములుగా వుండును. జలముచే కలిగెడుశుద్ధి బాహ్యశుద్ది, నిర్మలభావము(భావశుద్ధి) చే కలిగెడుశుద్ధి అంతర శుద్ధి).

హిందూ పురాణాలలో వివిధ రకాలైన స్నానాల గురించి ప్రస్తావించారు. అవి

నిత్య స్నానం :

ప్రతీరోజూ చేసే స్నానం నిత్య స్నానం.

నైమిత్తిక స్నానం : 
ఒక నిమిత్తాన్ని పురస్కరించుకొని చేసేది నైమిత్తికం.

కామ్య స్నానం : 
ఒక కోరికతో చేసేది కామ్య స్నానం.
ఉదా : తీర్థాదులలో, పుష్కరాలలో, రధసప్తమికి, కార్తీక మాసంలో, మాఘఫాల్గుణాలలో విశేష ఫలాలనుద్దేశించి చేసేదానికి, తన జన్మనక్షత్రం, వ్యతీపాత, వైదృతియను యోగాలు కలిసే రోజుల్లోగాని, పర్వతిథులలో చేసేది కామ్య స్నానం.

స్నానానికి ఉపయోగించే పదార్ధాన్ని బట్టి స్నానాలు రెండు విధములు.

ముఖ్య స్నానం : 
ఇది నీటిని ఉపయోగించి చేసేది ఇది మళ్ళీ రెండు రకాలు.

మంత్రం లేదా బ్రాహ్మ్యం : 
వేదములలో చెప్పబడిన నమక, చమక, పురుష సూక్తములను, మార్జన మంత్రాలను ఉచ్ఛరిస్తూ చేసేది "మంత్ర స్నానం". మంత్రించిన నీళ్ళని నెత్తిమీద చల్లుకోవడమే బ్రాహ్మ్య స్నానం.

ఓం ఆపోహిష్టామ యోభువః
తాన ఊర్జే దధాతన మహేరణాయచక్షసే
యోవశ్శివతమోరసః
తస్య భాజయతేహనః
ఉశతీరివ మాతరః
తస్మారంగా మామవో
యస్యక్షయాయ చ తనః
ఆపో జన యధాచనః "
అనే మంత్రముతో పైన నీటిని చల్లుకుంటారు.

వారుణం : 
ఇది మామూలు నీళ్ళతో చేసేది. మనమందరం ఎక్కువగా చేసేది ఇదే. 
పుణ్య నదులలో స్నానం ఆచరించడాన్ని కూడా వారుణ స్నానం అంటారు.

అముఖ్యం లేదా గౌణ స్నానం : 
నీరు లేకుండా చేసే స్నానాన్ని గౌణ స్నానం అంటారు. ఇది అయిదు రకాలు

ఆగ్నేయస్నానం : 
హోమ భస్మాన్ని లేపనంగా పూసుకోడాన్ని ఆగ్నేయ స్నానం లేదా విభూది స్నానం అంటారు. అంటే ఒంటి నిండా విభూతి పూసుకుంటే దానిని విభూతి స్నానం అంటారు.

భౌమస్నానం : 
పుణ్య నదులలో దొరికే మన్ను లేక పుట్ట మన్ను మొదలైన పవిత్ర మృత్తికను ఒంటి నిండా అలముకొని మృత్తికా మంత్రములతో చేసేది "భౌమ స్నానం".

వాయవ్యస్నానం : 
ముప్పయి మూడు కోట్ల దేవతులు నివశించియున్న గోవులు నడుస్తుండగా వాటి కాళ్ళ నుండి రేగే మట్టి మన మీద పడేలా నడవడం. విభూతిని పెట్టుకోవడం, గోధూళిలో విహరించడం అనేవి పవిత్రమైన అంశాలుగా పద్మ పురాణం చెప్తోంది.

దివ్యస్నానం : 
లోక భాంధవుడు, జగత్ చక్షువు, కర్మ సాక్షి అయినటువంటి సూర్య భగవానుడు ఆకాశంలో ఉండి సూర్య కిరణాలను వెలువరిస్తున్నపుడు వర్షం నీటిలో తడవడాన్నే దివ్య స్నానం అంటారు.

మానసిక స్నానం : 
అంటే మానసికంగా చేస్తాం తప్ప నిజంగా చేసే స్నానం కాదు. నిత్యం నారాయణ నామ స్మరణతో కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య అహంకార ఢంభ దర్పదైన్యాది మాలిన్యాలను మనస్సులో చేరనీక పోవడం

"మానస స్నానం". 
ఇది మహత్తర స్నానం. మహా ఋషుల చేత ఆచరింప బడుతుంది.

అభ్యంగన స్నానం : 
ఇక మిగతా రకాల స్నానాల గురించి చెప్పుకోవాలంటే అభ్యంగన స్నానం ఒకటి.

నఖ శిఖ పర్యంతము తలస్నానము చేయుట .

సముద్ర స్నానము:
మానవుడు సముద్రములో మునుగగానే, అన్ని తీర్థములలోను పుణ్యనదులలోను స్నానము చేసిన పుణ్యము లభించును.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/




Monday 25 January 2016

శ్రీ ఆంజనేయ స్తోత్రం


శ్రీ ఆంజనేయ స్తోత్రం 


ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే

నమస్తే రామదూతాయ కామ రూపాయ శ్రీమతే

మోహశోక వినాశాయ సీతాశోక వినాశినే

భగ్నాశోక వనాయాస్తు దగ్థలంకాయ వాగ్మినే

గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయచ

వనౌకసాం వరిస్ఠాయ వశినే వనవాసినే

తత్త్వజ్ఞాన సుధాసిందు నిమగ్నాయ మహీయసే

ఆంజనేయాయ శారాయ సుగ్రీవ సచివాయచ

జన్మమృత్యు భయఘ్నాయ సర్వక్లేశ హరాయచ

నేదిష్ఠాయ మహాభూతప్రేత భీత్యాది హరిణే

యాతనా నాశనాయాస్తు నమో మర్కటరూపిణే

యక్ష రాక్షస శార్దూల సర్వవృశ్చిక భీహ్నతే

మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్థృతే

హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే

బలినా మగ్రగణ్యాయ నమః పాపహరాయతే

లాభ దోసిత్వమేవాసు హనుమాన్ రాక్షసాంతక

యశో జయంచ మే దేహి శత్రూన్ నాశయ నాశయ

స్వాశ్రితానామ భయదం య ఏవం స్తౌతి మారుతిం

హానిమేతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్.

Sunday 24 January 2016

శివపంచాక్షరీస్తోత్రం /. ద్వాదశ జ్యోతిర్లింగములు


శివపంచాక్షరీస్తోత్రం

నాగేంద్రహారాయ త్రిలోచనాయ.   భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్థాయ దిగంబరాయ.   తస్మైన కారాయ నమశ్శివాయ
మందాకినీ సలిలచందన చర్చితాయ. నందీశ్వర ప్రమధనాథ మహేశ్వరాయ
మందారపుష్ప బహుపుష్పసుపూజితాయ.  తస్మై మ కారాయ నమశ్శివాయ
శివాయ గౌరీ వదనాబ్జబృం గ.  సూర్యాయ దక్షాధ్వర నాశకాయ
శ్రీ నీలకంఠాయ  వృషధ్వజాయ.  తస్మై  శి  కారాయ నమశ్శివాయ
వశిష్టకుంభోద్భవ గౌతమార్య.     మునీంద్ర దేవార్చిత శేఖరాయ
తస్మై వ కారాయ నమశ్శివాయ.   యక్ష స్వరూపాయ జటాధరాయ
పినాక హస్తాయ సనాతననాయ.  దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై య  కారాయ నమశ్శివాయ.  పంచాక్షర మిదంపుణ్యం య :పఠేతే
శివ సన్నిధౌ శివలోక మవాప్నోతి   శివేన సహ మోదతే.

ద్వాదశ జ్యోతిర్లింగములు

సౌరాష్ట్రే సోమనాధంచ ,  శ్రీశైలే మల్లికార్జున మ్
ఉజ్జయిన్యాం మహాకాళ , మోంకారే పరమేశ్వరమ్
కేదారం హిమవత్ప్సెషే , ఢాకిన్యాం భీమశకరం
వారణస్యాం చ విశ్యేశం , త్ర్యంబకం గౌతమీతటె
వైద్యనాధం చితా భూమౌ , నాగేశం దారుకావనే
సేటుబంధె చ రామేశం , ఝృశ్మేశం చ గుహాలయే

పుణ్యక్షేత్రాలు , పుణ్యతీర్ధలు గల భారత దేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అనే పన్నెండు
జ్యోతిర్లింగాలు స్వయం ప్రతిష్టితాలు. అనగా వాటికవే ఆవిర్భవించిన మహిమాన్విత
లింగాలు. అనంతమైన తేజస్సుతో, వేదకాలమునాటికి పూర్వంనుండి భక్తజనాన్ని తరింప చేస్తున్న లింగాలే ఈ "ద్వాదశ జ్యోతిర్లింగాలు".

1.   సౌరాష్ర (గుజరాత్) దేశంలో సొమేశ్వరుడు.
2.   ఆంధ్రప్రదేశములోని శ్రీ  శైలంలో మల్లికార్జునుడు.
3.   ఉజ్జయినిలో(మద్య ప్రదేశ్) శిప్రా నది తీరాన మహా కాలేశ్వరుదు.
4.   మాలవ్యదేశంలొ(మద్య ప్రదేశ్) నర్మదానది తీరాన ఓంకారేశ్వరుడు.
5.   హిమాలయాల్లో(ఉత్తరాంచల్) మందాకినీ శిఖరాన కేదారేశ్వరుడు.
6.   ఢాకిని నగరాన(మహా రాష్ట్రం) భీమశంకరుడు.
7.   కాశీ క్షేత్రంలో(ఉత్తర ప్రదేశ్) గంగానది తీరాన విశ్వేశ్వరుడు.
8.   సహ్యగిరి శిఖరాలలొ(మహా రాష్ట్రం) నాసికామండలంలో బ్రహ్మగిరిపై గోదావరీ బ్రహ్మ స్థలాన త్రయంబకేశ్వరుడు.
9.   ఉత్తర భారతదేశంలో(బీహారు రాష్ట్రం) చితభూమియందు వైద్యనాధుడు.
10.   దారుకావనము సమీపంలో(గుజరాత్) గోమతీ నది వద్ద నాగేశ్వరుడు.
11.   సేతుబంధము(తమిళనాడు) వద్ద రామేశ్వరుడు.
12.   ఎల్లోరా గుహలవద్ద(మహా రాష్ట్రం) ఘృశ్శేశ్వరుదు.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/

తులసి ఒక ఔషధి"





                                                              "తులసి ఒక ఔషధి"



తులసి చెట్టు ఉంటే ఎటువంటి వ్యాధులు మనదరి చేరవు, పవిత్ర మైనటువంటి  తులసి , ఔషధి గా కుడా పనిచేస్తుంది .
 కొన్ని వివరాలు ....

1. ప్రతి రోజు  తులసి  తీర్థము తీసుకుంటే  58 రకాల  రోగాలు నివారించబడతాయి .
2. తులసి… రసం తీసుకుని ప్రతీరోజు 2 చెమ్చాలు పుచ్చుకుంటే రక్తపుష్టి కలిగి, శరీరమునకు కాంతి వస్తుంది.
3. తులసి రసం 2 చెమ్చాలు, తేనె 1 చెమ్చా కలిపి ప్రతీరోజు పుచ్చుకుంటే—-గుండెల్లో ఉన్న (శ్లేష్మం) కఫం, దానికి సంభందించిన వ్యాధులు దూరమవుతాయి.
4. ఒక గుప్పెడు తులసి ఆకులను—రెండు చేతులతో బలంగా నలిపి, రసం పిండి,
      ఆ రసాన్ని—తేలు, తేనెటీగ, కందిరీగ మొదలైనవి కుట్టినప్పుడు—ఆ
     ప్రాంతంలో రాస్తే నొప్పి తగ్గి, విషప్రభావం తగ్గుతుంది.
5. ప్రతీరోజు క్రమం తప్పకుండా 10 లేక 15 తులసి ఆకులను నమిలి, తింటూ ఉంటే, శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
6. తులసిరసం వల్ల దగ్గు, ఆయాసం, గొంతునుండి పిల్లికూతలు రావటం వంటి వ్యాధులను తగ్గించుకోవచ్చును.
7. తులసిరసం కంటికింద రాసుకుంటే—–నల్లని వలయాలు, ఉబ్బులు తగ్గుతాయి.
8. తులసిరసం, నిమ్మరసం కలిపి పైపూతగా పూస్తే—గజ్జి, తామర వంటి చర్మరోగాలు నశిస్తాయి.
9. తులసిరాసాన్ని పంచదారతో కలిపి ప్రతీరోజు పడుకునే ముందు తీసుకుంటే, బాగా నిద్రపడుతుంది, నిద్రలేమితో బాధపడేవారికి ఇది మంచి ఔషధము.
10. తులసిరసంని ప్రతీరోజు క్రమంతప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్ని & రక్తపోటుని నిరోధిస్తుంది.
11. తులసి ఆకుల కషాయాన్ని పరగడుపునే త్రాగితే, కీళ్ళనొప్పులు, నడుంనొప్పి, వెన్నెముక నొప్పి, పొత్తికడుపు మంట వంటి వాటిని నివారించవచ్చును.
12. తులసిఆకులు ఎండపెట్టి, పోడిచేసుకుని, కొద్దిగా వేడినీటిలో కలిపి, పేస్టు లాగా చేసి ముఖానికి పట్టిస్తే, చర్మ సౌందర్యం పెరిగి శరీరము కాంతివంతంగా, సున్నితంగా తయారగును.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/

Saturday 23 January 2016

‘సుందరకాండ’ (నిత్య పారాయణ )

 ‘

సుందరకాండ’ (నిత్య పారాయణ)

అశోక వనములో సీతను చూచిన హనుమంతుడుహనుమంతుని కార్య దీక్ష,
సాఫల్యతలు సుందరకాండ లో పొందుపరచబడినాయి.
సుందరకాండ పారాయణ చేస్తే విఘ్నములు తొలగి కార్యములు చక్కబడతాయని, విజయాలు చేకూరుతాయనీ విశ్వాసం.
సుందరకాండ లో అనేక శ్లోకాలు ప్రార్ధనా శ్లోకాలుగా వాడుతారు.

" ధృత్యా సాగర  లంఘనం హనుమతో,
లంకామదోత్సారణం
తత్రా శోకవనే చ మార్గణ, మథ
శ్రీ జానకీ దర్శనమ్,
రామక్షేమ నివేదనం, వనతరుం
ప్రద్వంసనం, సంయుగే
రక్ష స్సంహననం, పురీ ప్రదహనం,
రామాయణే సుందరమ్.
ఓం తత్సత్."

భావము:

ఆంజనేయుడు సముద్రము దాటుట, లంకానగర వీరుల గర్వమును
అణచుట, అశోకవనములో సీతకై వెదకుట, జానకీదేవిని దర్శించి,
శ్రీరాముని క్షేమమును ఆమెకు వినిపించుట, అశోకవనములోని
వృక్షాలను పాడుచేయుట, రాక్షసులను చంపి లంకను తగులబెట్టి
వచ్చుట, ఈ విషయములతో రామాయణములోని సుందరకాండ చాలా
ప్రసిద్ధి చెందినది. 
  



హనుమంతుడు సన్నద్ధుడై, దేవతలకు మ్రొక్కి, మహేంద్రగిరిపైనుండి లంఘించాడు. దారిలో మైనాకుని ఆతిథ్యాన్ని వినయంతో తిరస్కరించి, సురస అనే నాగమాతపరీక్షను దాటి, సింహిక అనే ఛాయాగ్రాహక రాక్షసిని సంహరించి, రామబాణములా లంకలో వ్రాలాడు. చీకటి పడిన తరువాత లంకిణిని దండించి, మయుని అపూర్వ సృష్టియైన లంకలో ప్రవేశించి, సీతను వెదుకసాగాడు.

చిన్నశరీరము ధరించి, హనుమంతుడు రావణుని మందిరములోనూ, పానశాలలోనూ, పుష్పక విమానములోనూ అన్నిచోట్లా సీతను వెదకినాడు. నిద్రించుచున్న స్త్రీలలో మండోదరిని చూచి సీత అని భ్రమించాడు. మరల తప్పు తెలుసుకొని అన్వేషణ కొనసాగించాడు. సీతమ్మ జాడ కానక చింతించాడు. ఏమిచేయాలో తోచలేదు. ఊరకే వెనుకకు మరలి అందరినీ నిరాశపరచడానికి సిద్ధంగాలేడు.
రామలక్ష్మణులకు, జానకికి, రుద్రునకు, ఇంద్రునకు, యమునకూ, వాయువునకూ, సూర్య చంద్రులకూ, మరుద్గణములకూ, బ్రహ్మకూ, అగ్నికీ, సకల దేవతలకూ నమస్కరించి అశోకవనం లో సీతను వెదకడానికి బయలుదేరాడు. అక్కడ శింశుపా వృక్షము క్రింద, రాక్షసకాంతలచే పీడింపబడుతూ, సింహముల మధ్యనున్న లేడివలే భీతయై కృశించిన సీతను చూచాడు. జాడలెరిగి ఈమె సీతయే అని నిర్ధారించుకొన్నాడు.

అక్కడికి కామాతురుడైన రావణుడు వచ్చి ఆమెను బెదరించి, తనకు వశముకావలెనని ఆదేశించాడు. శ్రీరాముని బాణాగ్నితో లంక భస్మము అగుట తథ్యమని సీత రావణునకు గట్టిగా చెప్పినది. రెండు నెలలు మాత్రము గడువు పెట్టి రావణుడు వెళ్ళిపోయాడు. రాక్షసకాంతలు సీతను నయానా, భయానా అంగీకరింపచేయాలి అని ప్రయత్నిస్తూ ఉండటం వల్ల ప్రాణత్యాగం చేయాలని సీత నిశ్చయించుకొన్నది.
వారిలో సహృదయయైన త్రిజట అనే రాక్షసకాంతకు ఒక కల వచ్చింది. తెల్లని ఏనుగునెక్కి వచ్చి రామ
లక్ష్మణులు సీతను తీసికొని పోయినట్లూ, లంక నాశనమైనట్లూ, రావణాదులంతా హతమైనట్లూ వచ్చిన ఆ కల విని రాక్షసకాంతలు భీతిల్లారు. సీతకు శుభ శకునములు కనిపించసాగాయి.

ఇంక ఆలస్యము చేయరాదని, హనుమంతుడు సీతకు కనిపించి మెల్లగా తన వృత్తాంతమునూ, రాముని దుఃఖమునూ వివరించి, రాముడిచ్చిన ఉంగరాన్ని ఆమెకు అందించాడు. సీత దుఃఖించి, అందరి క్షేమసమాచారములు అడిగి, ఆపై రాముని వర్ణించమని కోరింది.

హనుమంతుడు భక్తితో ఆజానుబాహుడు, అరవింద దళాయతాక్షుడు, శుభలక్షణములు గలవాడు, అనన్య సుందరుడు అయిన రాముని, అతని సోదరుడైన లక్ష్మణుని వర్ణించగా విని సీత ఊరడిల్లినది. హనుమంతుని ఆశీర్వదించి, తన చూడామణి ని ఆనవాలుగా ఇచ్చినది. రెండు నెలలలో రాముడు తనను కాపాడకున్న తాను బ్రతుకనని చెప్పినది.

ఇక హనుమంతుడు పనిలో పనిగా రావణునితో భాషింపవలెననీ, లంకను పరిశీలింపవలెననీ నిశ్చయించుకొన్నాడు. వెంటనే ఉగ్రాకారుడై వనమునూ, అడ్డువచ్చిన వేలాది రాక్షసులనూ, రావణుడు పంపిన మహా వీరులనూ హతముచేసి, కాలునివలె మకరతోరణాన్ని అధిష్ఠించి కూర్చున్నాడు. చివరకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి వివశుడైనట్లు నటించి రావణుని వద్దకు వెళ్ళాడు. సీతమ్మను అప్పజెప్పి రాముని శరణువేడి, లంకను కాపాడుకోమనీ, ప్రాణాలు దక్కించుకోమనీ హితవు చెప్పాడు. రావణుడు ఉగ్రుడై హనుమంతుని తోకకు నిప్పు పెట్టమని ఆదేశించాడు. కాలిన తోకతో హనుమంతుడు లంకను దహించి, లంక నుండి తిరిగి వస్తున్న హనుమంతుడు

మరొక్కమారు సీతను దర్శించి, మరల వెనుకకు ప్రయాణమై మహేంద్రగిరి పై వ్రాలాడు.

హనుమంతుడు. "చూచాను సీతను"  అని జరిగిన సంగతులన్నీ సహచరులకు వివరించాడు. ఆపై అంతా
కలసి సుగ్రీవుడు, రామలక్ష్మణులు ఉన్నచోటకు వచ్చి సీత జాడను, ఆమె సందేశమును వివరించారు. ఆపై చేయవలసినది ఆలోచించమని కోరారు.









Friday 22 January 2016

శ్రీ కనకధారా స్తోత్రం



శ్రీ కనకధారా స్తోత్రం


వందే వందారు మందార మందిరానంద కందలం
అమందానంద సందోహ బంధురం సింధురాననం

అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ
భృంగాగనేవ ముకుళాభరణం తమాలం
అంగీకృతాఖిల విభూతి రసాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని
మాలా దృశోర్మధుకరీవ మహోత్సలేయా
సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః

విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్ష
మానందహేతు రధికం మురవిద్విషోపి
ఈషన్నిషీదతు మయిక్షణ మీక్షణార్థ
మిందీవరోదర సహోదర మిందిరాయాః

ఆమీలితాక్ష మధిగమ్య ముదా ముకుంద
మానందకంద మనిమేష మనంగ తంత్రం
ఆకేరక స్థిత కనీనిక పద్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః

కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
ధారా ధరే స్ఫురతి యా తటిదంగ నేవ
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః

బాహ్వాంతరే మురజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరనీలమయీ విభాతి
కామప్రదా భగవతోపి కటాక్షమాలా
కల్యాణమావహతు మే కమలాలయాయాః

ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన
మయ్యాపతే త్తదిహ మంథర మీక్షణార్థం
మందాలసం చ మకరాలయ కన్యకాయాః

దద్యాయానుపవనో ద్రవిణాంబుధారా
మస్మిన్నకించన విహంగశిసౌ విషణ్ణే
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః

ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర
దృష్టా స్త్రివిష్టప పదం సులభం లభంతే
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః

గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి
సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై
తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యైః

శ్రుత్యైనమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై
శక్యైనమోస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై

నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై

నమోస్తు హేమాంబుజ పీఠికాయై
నమోస్తు భూమండల నాయికాయై
నమోస్తు దేవాది దయాపరాయై
నమోస్తు శార్గ్ఙయుధ వల్లభాయై

నమోస్తు దేవ్యై భృగునందనాయై
నమోస్తు విష్ణోరురసి స్థితాయై
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై

నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
నమోస్తు దేవాదిభి రర్చితాయై
నమోస్తు నందాత్మజ వల్లభాయై

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితా హరణోద్యతాని
మామేవ మాత రనిశం కలయంతు మాన్యే

యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలార్థ సంపదః
సంతనోతి వచనాంగ మానసైః
త్వాం మురారి హృదయేశ్వరీం భజే

సరసిజనయనే సరోజ హస్తే
ధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతి కరి ప్రసీద మహ్యం

దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాంగీం
ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష
లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధి పుత్రీం

కమలే కమలాక్ష వల్లబే త్వం
కరుణాపూర తరంగితై రపాంగైః
అవలోకయ మా మకించనానాం
ప్రథమం పాత్రమ కృత్రిమం దయాయాః

బిల్వాటవీమధ్యలసత్ సరోజే
సహస్రపత్రే సుఖసన్నివిష్టాం
అష్తాంపదాంభోరుహ పాణిపద్మాం
సువర్ణవర్ణాం ప్రణమామి లక్ష్మీం

కమలాసనపాణినా లలాటే
లిఖితామక్షర పంక్తిమస్య జంతోః
పరిమార్జయ మాతరంఘ్రిణాతే
ధనికద్వార నివాస దుఃఖదోగ్ర్ధీం

అంభోరుహం జన్మగృహం భవత్యాః
వక్షస్స్థలం భర్తృగృహం మురారేః
కారుణ్యతః కల్పయ పద్మవాసే
లీలాగృహం మే హృదాయారవిందం

స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమాం
గుణాధికా గురుతర భాగ్యభాజినో
భవంతి తే భువి బుధ భావితాశయాః

సువర్ణ ధారా స్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యఃపథేన్నిత్యం స కుబేరసమోభవేత్

ఇతి శ్రీ మచ్ఛంకర భగవత్పాదాచార్యకృతం కనకధారాస్తోత్రం

Thursday 21 January 2016

సద్గురుం సాయినాథం


                                                                  సద్గురుం సాయినాథం

సదా సత్స్వరూపం చిదానంద కందం
జగత్సంభవస్థాన సంహార హే తుం
స్వభక్తేచ్చయా మానుషం దర్శయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

భవధ్వాంతవిద్వంస మార్తాండమీడ్యం
మనోవాగతీతం మునిర్ధ్యానగమ్యం
జగత్వ్యాపకం నిర్మలం నిర్గుణం త్వాం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

భవాంబోధి మగ్నార్దితానం జనానం,
స్వపాద శ్రితానం స్వభక్తిప్రియాణం
సముద్ధారణార్ధం కలౌ సంభవంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

సదా నింబవృక్షస్య మూలాధివాసత్
సుధాస్రావిణం తిత్క మప్య ప్రియం తం
తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

సదా కల్పవృక్షస్య తస్యాధిమూలే
భవద్భావ బుధ్యా సపర్యాది సేవాం
నృణాం కుర్వతాం భుక్తిముక్తి ప్రదం తం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

అనేకాశ్రుతా తర్క్య లీలావిలాసై
సమవిష్కృతేసాన భాస్వత్ప్రభావం
అహంభావహీనం ప్రసన్నాత్మభావం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం

Wednesday 20 January 2016

శ్రీ లక్ష్మీనృసింహ స్వామి స్తోత్రం


శ్రీ లక్ష్మీనృసింహ  స్వామి స్తోత్రం 

శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే |
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 1 ||

బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత |
లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 2 ||

సంసారదావదహనాకరభీకరోరు-జ్వాలావళీభిరతిదగ్ధతనూరుహస్య |
త్వత్పాదపద్మసరసీరుహమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 3 ||

సంసారజాలపతితతస్య జగన్నివాస సర్వేంద్రియార్థ బడిశాగ్ర ఝషోపమస్య |
ప్రోత్కంపిత ప్రచురతాలుక మస్తకస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 4 ||

సంసారకూమపతిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య |
దీనస్య దేవ కృపయా పదమాగతస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 5 ||

సంసారభీకరకరీంద్రకరాభిఘాత నిష్పీడ్యమానవపుషః సకలార్తినాశ |
ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 6 ||

సంసారసర్పవిషదిగ్ధమహోగ్రతీవ్ర దంష్ట్రాగ్రకోటిపరిదష్టవినష్టమూర్తేః |
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 7 ||

సంసారవృక్షబీజమనంతకర్మ-శాఖాయుతం కరణపత్రమనంగపుష్పమ్ |
ఆరుహ్య దుఃఖఫలితః చకితః దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 8 ||

సంసారసాగరవిశాలకరాళకాళ నక్రగ్రహగ్రసితనిగ్రహవిగ్రహస్య |
వ్యగ్రస్య రాగనిచయోర్మినిపీడితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 9 ||

సంసారసాగరనిమజ్జనముహ్యమానం దీనం విలోకయ విభో కరుణానిధే మామ్ |
ప్రహ్లాదఖేదపరిహారపరావతార లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 10 ||


సంసారఘోరగహనే చరతో మురారే మారోగ్రభీకరమృగప్రచురార్దితస్య |
ఆర్తస్య మత్సరనిదాఘసుదుఃఖితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 11 ||

బద్ధ్వా గలే యమభటా బహు తర్జయంత కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మామ్ |
ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 12 ||

లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో యఙ్ఞేశ యఙ్ఞ మధుసూదన విశ్వరూప |
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 13 ||

ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ-మన్యేన సింధుతనయామవలంబ్య తిష్ఠన్ |
వామేతరేణ వరదాభయపద్మచిహ్నం లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 14 ||

అంధస్య మే హృతవివేకమహాధనస్య చోరైర్మహాబలిభిరింద్రియనామధేయైః |
మోహాంధకారకుహరే వినిపాతితస్య లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 15 ||

ప్రహ్లాదనారదపరాశరపుండరీక-వ్యాసాదిభాగవతపుంగవహృన్నివాస |
భక్తానురక్తపరిపాలనపారిజాత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్ || 16 ||

లక్ష్మీనృసింహచరణాబ్జమధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ |
యే తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తా-స్తే యాంతి తత్పదసరోజమఖండరూపమ్ || 17 ||


Tuesday 19 January 2016

హయగ్రీవ స్తోత్రం




                                                                  హయగ్రీవ స్తోత్రం

ॐ  జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం !
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే !!

జ్ఞానంతో వున్న కారణంగా నానందంగా కనిపించేవాడూ,
స్ఫటికంలా నిష్కల్మషుడూ, సర్వవిద్యల కాధారభూతుడైన,

 " హయగ్రీవుణ్ని" వుపాసిస్తున్నాను అని ఒక ప్రార్థనా శ్లోకభావం.

 చిన్ముద్ర, పుస్తకం, శంఖుచక్రాలు ధరించిన నాలుగు చేతులతో పద్మంమీద
ఆసీనుడై, ఆర్ద్రమైన అమృత కాంతులతో పావనం చేస్తున్న వాగధీశుడు
హయగ్రీవుడు నా మనసునందు ఆవిర్భవించుగాక అని మరొక ప్రార్థన ఉంది.

దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో 'హయగ్రీవ'
అవతారం ఒకటి. శ్రావణ పూర్ణిమనాడు హయగ్రీవోత్పత్తి జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి.

స్కంద పురాణం, దేవీభాగవతం, భాగవతాలు హయగ్రీవ జననం, ఉపాసనా విధానాలను వర్ణించాయి.విష్ణుమూర్తి దానవులతో యుద్ధంచేసి అలసిపోయి
వింటినారిని తలకింద పెట్టుకుని నిద్రపోయాడు. దేవతలు విష్ణువు కోసం
వెతుకుతూ వెళ్లి, నిద్రపోతున్న ఆయనను చూశారు. ఎవరికి వారు ఆయనను నిద్ర లేపడానికి వెనకాడుతున్నప్పుడు, శివుడు 'వింటినారిని తెంచితే విష్ణువు తల కదిలి మెలకువ వస్తుంది'అని సలహా ఇచ్చాడు. బ్రహ్మ ఈ పని కోసం 'వమ్రి' అనే కీటకాన్ని నియోగిస్తే అది ధనుస్సు నారిని కొరికివేసింది. ఎక్కుపెట్టిన ధనుస్సు వల్ల
విష్ణువు తల తెగి ఎగిరిపడింది. ఈ విషయంలో విష్ణువుకు లక్ష్మీదేవి శాపం కూడా
ఉంది. దుఃఖిస్తున్న దేవతలతో బ్రహ్మ 'దేవి'ని స్తుతించమన్నాడు. దేవతల ప్రార్థనకు ప్రసన్నురాలైన 'దేవి' హయం (గుర్రం) తల తెచ్చి విష్ణువు దేహానికి అతికించమని చెప్పింది. దేవతలు ఆ విధంగా చేయడం వల్ల హయగ్రీవుడు ఉదయించాడని దేవీ భాగవతం పేర్కొంటోంది.

బ్రహ్మ సృష్టిరచనకు ముందు వేదాలను సృజించాడు. వాటిని మధుకైటభులనే రాక్షసులు అపహరించి రసాతలంలో దాచారు. అప్పుడు విష్ణువు హయశిరం ధరించి రసాతలానికి వెళ్లి భూనభోంతరాళాలు దద్దరిల్లేలా ప్రణవరూపమైన నాదం చేశాడు. మధుకైటభులు ఆ నాదం వెలువడిన ప్రదేశాన్ని వెతుకుతున్న సమయంలో,
విష్ణువు వేరొక మార్గంలో వెళ్లి వేదాలను తీసుకువచ్చి బ్రహ్మకు అప్పగించాడు. ఆ తరవాత మధుకైటభులను సంహరించాడు. ఇది స్కందపురాణ గాథ.

హయగ్రీవుడనే రాక్షసుడు తనకు మృతి లేకుండా చేయమని దేవిని ప్రార్థిస్తే, ఆమె అది అసంభవమని చెప్పడంవల్ల తనవంటి ఆకారం గలవాడి చేతిలోనే మరణం సంభవించాలని కోరుకున్నాడు. ఈ రాక్షసుని సంహారం కోసమే హరి హయగ్రీవుడయ్యాడని మరొక గాథ చెబుతోంది.

వేదోద్ధరణ గావించిన హయగ్రీవుని సకల విద్యాప్రదాతగా భావిస్తారు. హయగ్రీవారాధన వల్ల లౌకిక విద్యలు మొదలు బ్రహ్మవిద్యల వరకు సకలమూ సిద్ధిస్తాయని నమ్మకం. వాక్‌శక్తిని, విద్యాశక్తిని, బుద్ధిని కలిగించేవాడిగా హయగ్రీవుణ్ని ఆరాధిస్తారు.

ఆదిశంకరులు, రామానుజులు హయగ్రీవుని పూజించి జ్ఞానసిద్ధి పొందారు. ఒకప్పుడు శ్రీపాద రాజతీర్థులు రాజాస్థానంలో పండితులతో జరిగిన వాదనలో గెలవడంతో వారు మంత్రాలతో ఆయనకు వాగ్బంధనం చేశారట. హయగ్రీవోపాసకుడైన ఆయన ఉపాసన
శక్తి వల్ల అందులో నుంచి విముక్తి పొందినట్లు కథ వ్యాప్తిలో ఉంది.

నారదుడు, సూర్యాది దేవతలు కూడా హయగ్రీవుని ఉపాసించినట్లు హయగ్రీవోపనిషత్తు చెబుతోంది. జగన్మాత లలితాదేవి వైభవాన్ని, ఉపాసన రహస్యాలను, లలితా సహస్రనామ, త్రిశతి మొదలైన విద్యలను హయగ్రీవుడే అగస్త్యమహర్షికి బోధించినట్లు బ్రహ్మపురాణం పేర్కొన్నది. మంత్రతంత్ర యంత్రాది విద్యలకు అధిదైవం హయగ్రీవుడు. శ్రీరంగం, కంచి క్షేత్రాల్లో హయగ్రీవాలయాలు ఉన్నాయి.

సోదరీసోదర అనుబంధానికి, స్నేహబంధానికి గుర్తుగా భావించే శ్రావణ పూర్ణిమ
 (రాఖీ పండుగ)నాడే స్వామిని ఆరాధిస్తారు.ఉడకబెట్టిన గుగ్గిళ్ళు, ఉలవలు నివేదిస్తారు. విద్యార్థులు స్వామిని పూజించడం వల్ల విద్యాభివృద్ధి జరుగుతుందని పండితులు చెబుతారు.

Monday 18 January 2016

శ్రీ లలితా ద్వాదశ నామ స్తోత్రం


శ్రీ లలితా ద్వాదశ నామ స్తోత్రం

ప్రధమం లలితా నామ ద్వితీయం షోడశాక్షరీం
తృతీయం విఘ్నహంత్రీ చ చతుర్ధం రోగనాశినీం
పంచమం భ్రామరీ నామ షష్టం శ్రీచక్రవాసినీం 
సప్తమం కాలరాత్రం చ అష్టమం భువనేశ్వరీం
నవమం బ్రహ్మవిద్యా నామ దశమం బంధమోచనీం
ఏకాదశీం యజ్ఞఫలదాం ద్వాదశం మార్గబాంధవీం
సర్వం శ్రీ మాతృ చరణారవిందార్పణమస్తు.

శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం
ఇంద్ర ఉవాచ –

నమస్తే‌உస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమో‌உస్తు తే || 1 ||
నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || 2 ||
సర్వఙ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || 3 ||
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని |
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || 4 ||
ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |
యోగఙ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమో‌உస్తు తే || 5 ||
స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || 6 ||
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమో‌உస్తు తే || 7 ||
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమో‌உస్తు తే || 8 ||
మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః |p
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ |
ద్వికాల్ం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ||
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ |
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ||
[ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణమ్]

శ్రీ సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం

ప్రధమం భారతీనామ ద్వితీయం జ్ఞానరూపిణీం
ద్వితీయం వేదపూజ్యంచ చతుర్ధం హంసవాహినీం
పంచమం సారస్వతప్రియంచ షష్టం వీణాపుస్తకధారిణీం
సప్తమం బ్రహ్మవల్లభంచ అష్టమం మంత్రరూపిణీం
నవమం నిగమాగమప్రవీణశ్చ దశమం శివానుజాం
ఏకాదశం శ్వేతాంబరధరంచ ద్వాదశం వినయాభిలాషిణీం || ||
సర్వం శ్రీ సరస్వతీ మాత చరణారవిందార్పణమస్తు.






Sunday 17 January 2016

ఆరోగ్య చిట్కాలు 3



ఆరోగ్య చిట్కాలు 3
1. పుచ్చకాయలో ఉండే లైకొపీన్.. గుండె, చర్మ సంబందిత వ్యాధుల నుంచి కాపాడుతుంది.

2. సపోటాపళ్ళు మలబద్దకాన్ని నివారిస్తాయి.

3. దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.

4. ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి.

5. చేపలు తింటే రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

6. కమలాఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.

7. క్యారెట్లు నరాల బలహీనత నుండి కాపాడతాయి.

8. యాపిల్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది.

9. వాము దంత వ్యాధులను తగ్గిస్తుంది.

10. పచ్చి జామకాయలో ఉండే టానిస్ మాలిక్, ఆక్సాలిన్ ఆమ్లాలు నోటి దుర్వాసనను పోగోడుతాయి.

DEVALAYAM...శ్రీముఖ లింగం


శ్రీముఖ లింగం

ముఖలింగం, శ్రీకాకుళం జిల్లా, జలుమూరు మండలానికి చెందిన గ్రామము. ఇది శ్రీకాకుళం నుండి 46 కి.మీ దూరంలో వుంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధినందిన ముఖలింగేశ్వరస్వామి, భీమేశ్వరస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలున్నాయి. వీటిలో ముఖ్యమైనది ముఖలింగేశ్వరస్వామి ఆలయం. దాన్నే మధుకేశ్వరాలయం అని కూడా అంటారు.

ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు. ఇప్ప చెట్టు మొదలను నరికి వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలుపై "ముఖం " కనిపిస్తుంది అని చెబుతారు. ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని చెబుతారు. ఇప్పచెట్టును సంస్కృతంలో మధుకం అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వరస్వామి ఆలయంగా పేరొచ్చిందని అంటారు.

ఈ ఆలయంలో గర్బాలయం కాక ఎనిమిది వైపుల ఎనిమిది లింగాలున్నాయి. సప్తమాతృకలలో ఒకరైన 'వారాహి' అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్న పార్వతీ అవతారం. మిగిలివారు బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, ఇంద్రాణి. వీరు పార్వతీదేవి అవతారాలు. ఇక్కడి శిల్పాలలో వరాహావతారం, వామనావతారం, సూర్య విగ్రహం వుండటం విశేషం.

భీమేశ్వరాలయం శిధిలావస్థలో వుంది. ఇక్కడ కుమారస్వామి, దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ, గణపతి విగ్రహాలున్నాయి.

సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది. ముఖమండపం లేదు. ఎత్తయిన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు. ఇది ఒకేరాయి. ఒకసారి పిడుగుపడి, ఆరాయి పగిలి అందులో ఒక ముక్క క్రింది పడింది. ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారంటే , మొత్తం రాయి ఎంత బరువో వూహించుకోవచ్చు.

ఇక్కడ ఏడు నాలికల అగ్ని విగ్రహం, వినాయకుడు, కాశీ అన్నపూర్ణ, నటరాజు, కుమారస్వామి, హరిహరదేవుల విగ్రహాలు ఎంత్తో అందంగా వున్నాయి. ఈ ఆలయం శిధిలావస్థలో వుంది.

మహా శివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది.

Saturday 16 January 2016

శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం



                                                        శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం


ఐదు ముఖాలు పదిచేతులు అందలి ఆయుధములు తూర్పున వానరము , దక్షిణమున నారసింహ ,పడమర గరుత్మాన్ , ఉత్తరాన వరాహం పై భాగాన హయగ్రీవ ముఖములు కల్గిఉండే మూర్తి.

శ్రీ పంచముఖ హనుమాన్ స్తోత్రం

వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్రాంచితం
నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం గదాం
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి గర్వాపహం

భావం:-

వానర ,నారసింహ ,గరుడ ,సూకర (వరాహం ),
అశ్వ అనే అయిదు ముఖాలతో ,అనేక అలంకారాలతో ,
దివ్య కాంతి తో,దేదీప్యమానమైన 15 నేత్రాలు, పద్మాలవంటి హస్తాలు, ఖడ్గం, డాలు, పుస్తకం, అమృత కలశం ,అంకుశం,పర్వతం ,నాగలి, మంచంకోడు (ఖత్వాంగం ),మణులు ,ధరించిన వాడు,సర్ప శత్రువు అయిన గరుత్మంతుని గర్వాన్ని హరించిన వాడు అయిన హనుమంతునికి నమస్కారం .

Thursday 14 January 2016

ఆరోగ్య చిట్కాలు 2


ఆరోగ్య చిట్కాలు  2

1. ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ది చెందుతుంది.

2.  అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. మలబద్దకాన్ని కూడా వదిలిస్తుంది.

3.  కీరదోసలో ఉండే సిలికాన్, సల్ఫర్ లు శిరోజాలకు మేలు చేస్తాయి.

4. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్ ని దరికి చేరనివ్వదు.

5.  ద్రాక్షలో అధికపాళ్ళలో ఉండే బోరాన్.. ఆస్టియో పొరాసిస్ రాకుండా కాపాడుతుంది.

6. బీట్ రూట్ రసం ‘లో బీపీ ‘ సమస్య నుంచి గట్టేక్కిస్తుంది.

7. క్యారెట్ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.•

8. మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషదం.

9. ఉల్లిపాయ శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.•

10. అనాసపళ్ళలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. వాపుల్ని తగ్గిస్తుంది.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/ 

శ్రీ సాయి కష్ట నివారణ స్తోత్రం



                                                      శ్రీ  సాయి  కష్ట  నివారణ  స్తోత్రం


ఓం
అవిఘ్నమస్తు
సాయినాథాయ  నమః


ప్రథమం  సాయినాథాయ  నమః   


ద్వితీయం ద్వారకా మాయినే 

తృతీయం  తీర్థ  రాజాయ  


చతుర్థం  భాక్తవత్సలే


పంచమం  పరమార్థాయ  


షష్టించ  షిర్డీ  వాసనే


సప్తమం  సద్గురు  నాధాయ  


అష్టమం  అనాథ  నాధనే


నవమం  నిరాడంబరాయ


దశమం  దత్తావతారమే

Wednesday 13 January 2016

నారాయణ జయ గోవింద హరే


నారాయణ జయ గోవింద హరే
(శంకరాచార్య )

నారాయణ నారాయణ జయ గోవింద హరే ||

నారాయణ నారాయణ జయ గోపాల హరే ||
కరుణాపారావార వరుణాలయగంభీర నారాయణ || ౧ ||

ఘననీరదసంకాశ కృతకలికల్మషనాశన నారాయణ || ౨ ||
యమునాతీరవిహార ధృతకౌస్తుభమణిహార నారాయణ || ౩ ||

పీతాంబరపరిధాన సురకళ్యాణనిధాన నారాయణ || ౪ ||
మంజులగుంజాభూష మాయామానుషవేష నారాయణ || ౫ ||

రాధాధరమధురసిక రజనీకరకులతిలక నారాయణ || ౬ ||
మురళీగానవినోద వేదస్తుతభూపాద నారాయణ || ౭ |
|
బర్హినిబర్హాపీడ నటనాటకఫణిక్రీడ నారాయణ || ౮ ||
వారిజభూషాభరణ రాజీవరుక్మిణీరమణ నారాయణ || ౯ ||

జలరుహదళనిభనేత్ర జగదారంభకసూత్ర నారాయణ || ౧౦ ||
పాతకరజనీసంహార కరుణాలయ మాముద్ధర నారాయణ || ౧౧ ||

అఘ బకహయకంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ || ౧౨ ||
హాటకనిభపీతాంబర అభయం కురు మే మావర నారాయణ || ౧౩ ||

దశరథరాజకుమార దానవమదసంహార నారాయణ || ౧౪ ||
గోవర్ధనగిరి రమణ గోపీమానసహరణ నారాయణ || ౧౫ ||

సరయుతీరవిహార సజ్జనఋషిమందార నారాయణ || ౧౬ ||
విశ్వామిత్రమఖత్ర వివిధవరానుచరిత్ర నారాయణ || ౧౭ ||

ధ్వజవజ్రాంకుశపాద ధరణీసుతసహమోద నారాయణ || ౧౮ ||
జనకసుతాప్రతిపాల జయ జయ సంస్మృతిలీల నారాయణ || ౧౯ ||

దశరథవాగ్ధృతిభార దండక వనసంచార నారాయణ || ౨౦ ||
ముష్టికచాణూరసంహార మునిమానసవిహార నారాయణ || ౨౧ ||

వాలివినిగ్రహశౌర్య వరసుగ్రీవహితార్య నారాయణ || ౨౨ ||
మాం మురళీకర ధీవర పాలయ పాలయ శ్రీధర నారాయణ || ౨౩ ||

జలనిధి బంధన ధీర రావణకంఠవిదార నారాయణ || ౨౪ ||
తాటకమర్దన రామ నటగుణవివిధ సురామ నారాయణ || ౨౫ ||

గౌతమపత్నీపూజన కరుణాఘనావలోకన నారాయణ || ౨౬ ||
సంభ్రమసీతాహార సాకేతపురవిహార నారాయణ || ౨౭ ||

అచలోద్ధృతచంచత్కర భక్తానుగ్రహతత్పర నారాయణ || ౨౮ ||
నైగమగానవినోద రక్షిత సుప్రహ్లాద నారాయణ || ౨౯ ||

భారత యతవరశంకర నామామృతమఖిలాంతర నారాయణ || ౩౦ ||

Tuesday 12 January 2016

ఆరోగ్య చిట్కాలు 1


ఆరోగ్య చిట్కాలు 

1. అల్లం తింటే ఎక్కిళ్ళు తగ్గుతాయి.• 

2. కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.•

 3. నేరేడు పండ్ల గింజల్లో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైట్, మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.• 

4. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.•

5.  అవకాడో ఫలాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి తరచుగా తింటే మలబద్దకం పోతుంది.•

 6. జామపళ్ళు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.• 

7. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది.•

8  సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే, పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.•

 9. మామిడిపండుకి మూత్రపిండాల్లోని రాళ్ళను కరిగించే శక్తి ఉంది.

10. బీట్ రూట్.. బీపీని క్రమబద్దీకరిస్తుంది.• 

11. మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.

12. దానిమ్మరసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది.

Sunday 10 January 2016

గోమాత సర్వ శుభ రూపిణి


  "సర్వతీర్ద మయీం దేవి వేదదేవాత్మికాం శివం
                                          సురబిం యజ్ఞా స్య జననీ మాతరం త్వానమామ్యాహం"-

                          శ్లోకాన్ని బట్టి సర్వ తీర్ధములు గోమాతలోనే ఉన్నాయని,
                  వేదములన్నీ గోమాతలోనే ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు.
                     గోమాత సర్వ శుభ రూపిణివి. యజ్ఞమునకు తల్లివంటి దానిదని,
                                     ముప్పదిమూడు కోట్ల దేవతలకు నిలయం
                                                         గోమాత.

హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో     సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు.

గోవులో వివిధ భాగాల్లో దాగివున్న వివిధ రకాల దేవదేవతుల వివరాలను ఓ సారి పరిశీలిస్తే.. గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే... త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాకుండా, శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ... బిళ్వ దళాలతో పూజిస్తే... సాక్ష్యాత్ కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెపుతుంటారు.

గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే... సంతాన నష్టం ఉండదని, ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారని వారు చెపుతారు. అందువల్ల చెవిని పూజిస్తే... సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట. ఆవు కన్నుల దగ్గర సూర్య, చంద్రులు ఉంటారనీ, వాటిని పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెపుతున్నారు.
అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే... విద్యాప్రాప్తి. ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారని ప్రఘాడ విశ్వాసం. కనుక వాటిని పూజిస్తే... యమబాధలుండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెపుతారు. ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలుంటారట. వాటిని పూజిస్తే... పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం.

 ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవాలు, సంతానం కలుగుతుందట. ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే... ధర్మార్థ, కామమోక్షాలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే... నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెపుతున్నారు. వాటితో పాటు.. భూమిపై నాగుపాముల భయం ఉండదట. ఆవు గిట్టల్లో గంధర్వులుంటారు. కనుక గిట్టలను పూజిస్తే... గంధర్వలోక ప్రాప్తి. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారు. ఆ భాగాన్ని పూజిస్తే... సఖ్యత, సౌందర్యం లభిస్తుందట. అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు.

గోమాత సర్వదేవతలు కొలువై వుంటారు. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.  యజ్ఞయాగాలను నిర్వహించే ప్రదేశాలను గోమయంతోనే శుద్ధి చేస్తుంటారు. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్లు గోవుతో కలిసే గృహప్రవేశం చేయడం జరుగుతూ వుంటుంది. గోవు ప్రవేశిస్తే లక్ష్మీదేవి అడుగుపెట్టినట్టుగా భావిస్తుంటారు.

 గోవును పూజకు కొన్ని విశేషమైన పుణ్యతిథులున్నాయి. ఈ తిథుల్లో పూజించడం వల్ల విశేష ఫలితం దక్కుతుంది. అలాంటి పుణ్యతిథుల్లో ఒకటిగా 'ఆశ్వయుజ బహుళ ద్వాదశి' కనిపిస్తుంది. దీనినే 'గోవత్స ద్వాదశి' అని కూడా అంటారు. ఈ రోజున దూడతో కూడిన గోవుని పూజించాలని పండితులు అంటున్నారు. ఈ రోజున ఆవు దూడలను పసుపు కుంకుమలతో, పూల దండలతో అలంకరించి, భక్తి శ్రద్ధలతో ఆరాధించవలసి వుంటుంది. ఆవు పాలు, పెరుగు, నెయ్యితో చేసిన వంటకాలను ఈ రోజున స్వీకరించరాదనే నియమం ఉంది.

 దూడతో కూడిన ఆవును పూజించిన వాళ్లు ఆ రోజున బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నేలపై పడుకోవలసి వుంటుంది. ఈ నియమాలను పాటిస్తూ గోపూజ చేయడం వలన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని పురోహితులు చెబుతున్నారు

గోమాతను దానం చేస్తే.. కోటి పుణ్య ఫలం దక్కుతుందని పురోహితులు చెబుతున్నారు. గోమాత లక్ష్మీదేవి స్వరూపం. ఆవు పాలు ఎంతో శ్రేయస్కరం. గోమాతను దానం చేయడం ద్వారా వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. పశువులకు మేతను దానం చేస్తే పాపాలను హరిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

 ఇంకా గోమాతను శుక్రవారం పూజిస్తే మీ ఇంట్లో సిరిసంపదలు వెల్లివెరుస్తాయి. ఇంట్లో గోపూజ చేయడం కుదరని పక్షంలో ఆలయాల్లోని గోశాలల్లో నిర్వహించే పూజల్లో పాల్గొనడం ద్వారా శుభఫలితాలుంటాయి. శుభ ముహూర్త కాలంలో గోపూజ చేయించడం, గోమాతను ఆలయాలను దానంగా ఇవ్వడం వంటివి చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు అంటున్నారు.
మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని గోమాత వహించింది. గోమాత మనల్ని పోషిస్తున్నాయి. పూర్వం బ్రహ్మన అచేతనాలైన నదులు, పర్వతాలు మొదలైనవాటిని సృష్టించి, జీవాత్మతో కూడిన చేతనమగు వస్తుజాతకమును అగ్నినుండి ఉత్పన్నం కావాలని సంకల్పించుకొని, అగ్నియందు ఉత్పత్తికి సాధకమగ హోమాన్ని చేశాడు. శరీరం కొరరకు వాయువు, చక్షువు కొరకు ఆదిత్యుడు హోమం చేశారు. వారి హోమం వల్ల గోవు ఒక్కటే అందునుంచి ఆవిర్భవించింది.
 గోవుకు వేద ప్రమాణమయిన విశిష్టత ఉంది. అగ్ని సంబంధమైన హోమం వల్ల, గోవు జన్మించడంవల్ల గోవు అగ్నిహోత్ర సమానమైంది. కవ్వంచేత గో క్షీరాన్ని మధిస్తే వచ్చేటువంచి వెన్న, నెయ్యి దేవతలకు ప్రియమైనవి. గోదాన, హిరణ్య దానాలను యజ్ఞయాగాది క్రతువుల్లోనూ, పితృకర్మల్లోనూ చేయాలని మన శృతి బోధిస్తోంది.

 గోవులున్న ఇల్లు, గ్రామం, రాష్ట్రం, దేశం సకల సౌభాగ్యాలతో విలసిల్లుతూ ఉంటుంది. పుణ్యఫలం లభిస్తుంది. ఆవుకు గో గ్రాసం సమర్పణ చేస్తే చక్కని సత్ఫలితాలు లభిస్తాయి. ఆవుపాలును శ్రేష్ఠమైందని అంటున్నారు.

పూజాకార్యక్రమాలు, వ్రతాలు, యజ్ఞాల్లో  ఆవుపాలును శ్రేష్ఠమైందని అంటున్నారు.గోవు సమస్త సృష్టిలోకి పవిత్రమైంది. సకల దేవతలకి గోమాత నివాస స్థలం.
ఆవుపాలంటే సమస్త దేవతలనూ మన శుభకార్యానికి ఆహ్వానించినట్లవుతుంది. అందుకే మన ఇళ్ళల్లో జరిగే ప్రతి శుభకార్యానికి, వేడుకలు, యజ్ఞాలకు దేవతలను ఆహ్వానించే రీతిలో ఆవుపాలను వాడుతారని చెబుతున్నారు.
       గంగి గోవు పాలు గరిటడైనను చాలు  ....అని వేమన  గారు  శతకములో  ప్రస్తుతించారు.
                  గోమాతను ....రక్షిద్దాము......పూజిద్దాము ...  సకల శుభాలను  పొందుదాము



. " శక్తినిచ్చే ‘ ఖర్జూరం’ "




                                                           "" శక్తినిచ్చే ‘ ఖర్జూరం’"

1. పొటాషియం ఎక్కువగా లభించే ఖర్జూరాలు తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు అదుపులో ఉంటాయి. అలాగే ఇవి గుండెకు సంబంధించిన అనేక సమస్యల నుంచి విముక్తి కలిగిస్తాయి.

2. ఖర్జూరం పండ్లలో శరీరానికి కావాల్సిన మినరల్స్, విటమిన్స్, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాల ఎదుగుదలకు చాలా అవసరం.

3. ఖర్జూరాల్లో కొలెస్ట్రాల్, క్యాలరీలు తక్కువగా.. ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి తింటే బరువు పెరుగుతామన్న భయం ఉండదు.

4. ఖర్జూరం పండ్లలో యాంటీఆక్సిడెంట్ల రూపంలో ఉండే విటమిన్ ‘ఎ’ కంటికి చాలా మంచిది. ఈ పండు వల్ల రేచీకటి వంటి కంటి సమస్యలు కూడా దూరమవుతాయి.

5. క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్.. వంటి మినరల్స్ ఈ పండులో అధికంగా లభిస్తాయి. క్యాల్షియం ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచడానికి.. కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి.. మాంగనీస్ ఎముకల పెరుగుదలకు ఉపయోగపడతాయి.

6. ఖర్జూరాలు కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాదు..
     బాగా సన్నగా ఉండి ఆరోగ్యకరంగా బరువు పెరగాలనుకునే వారికి కూడా
      మంచి ఫలితాన్నిస్తాయి.

7. ఖర్జూరం పండు శరీరానికి తక్షణ శక్తినిస్తుంది.

8. అలాగే ఇది త్వరగా జీర్ణమవుతుంది.

9. మలబద్ధకంతో బాధపడే వారు కొన్ని ఖర్జూరాల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున
వాటిని తిని, ఆ నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

10. ఖర్జూరంలో బి-కాంప్లెక్స్‌తో పాటు విటమిన్ ‘కె’ కూడా ఉంటుంది. ఇందులోని నియాసిన్, రైబోఫ్లేవిన్, పాంటోథెనికామ్లం, పైరిడాక్సిన్.. మొదలైన విటమిన్లు శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తాయి.

11. ఖర్జూరాలు తింటే రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయని చాలామంది వాటిని తినడానికి భయపడుతుంటారు. వీటిలో ఉండే సహజసిద్ధమైన చక్కెరల వల్ల రక్తంలో చక్కెర స్థాయులు మరీ గణనీయంగా పెరగవని ఓ పరిశోధనలో వెల్లడైంది.

***కానీ డయాబెటిస్‌తో బాధపడే వారు మాత్రం డాక్టర్ సలహా మేరకే వీటిని ఆహారంలో
            భాగం     చేసుకోవడం మంచిది.

12. ఖర్జూరాల్లో ఉండే విటమిన్ బి6 వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

13. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ ఖర్జూరాలు తమవంతు పాత్ర పోషిస్తాయి.

14. మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లు కరగాలంటే ఖర్జూరాల్ని తరచూ తినాలి. అలాగే కొంతమందికి మూత్రం
     సరిగ్గా రాకపోవడం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు.. తదితర సమస్యలుంటాయి. ఇవన్నీ ఖర్జూరం తినడం
     వల్ల   తగ్గే అవకాశం ఉంది.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/


Saturday 9 January 2016

ధనియాల చారు


                                                                ధనియాల  చారు

కావలిసిన  పదార్ధాలు :

1. కంది  పప్పు  3 స్పూన్స్,
2. ధనియాలు 1 స్పూన్,
3. ఎండు  మిరప కాయలు 2,
4. మిరియాలు 4,
5.  టమాటో  1
6.  పచ్చి మిరపకాయ 1.
7 . చింతపండు ,
,8. ఉప్పు ,
9. బెల్లము,
10.  పసుపు

తయారీ విధానము :
ముందుగా  కంది  పప్పు , ధనియాలు , ఎండు  మిరప కాయలు , మిరియాలు
ఒక గంట సేపు నానబెట్టు కోవాలి.
నానిన తరువాత  , మెత్తగా  గ్రైండ్ చేసుకోవాలి.
ఆ మిశ్రమాన్ని ఒక గిన్నె లోకి తీసుకుని ,
చింతపండు పులుసు ,( చింత పండు నీళ్ళలో పిండి గుజ్జు తీసేయాలి )
ఉప్పు , బెల్లము, పసుపు  ,టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ వేసుకుని ,
స్టవ్ మీద పెట్టి, బాగా మరిగించాలి .
ఇది మరిగేటప్పుడు స్టవ్ మంటచిన్నది  గా  ఉండేలా చూసుకోవాలి. ,
పేన్  లో కొంచెము నూని  వేసి ,ఆవాలు,మెంతులు  జీలకర్ర, కొద్దిగా ఇంగువ ,
ఎండుమిరపకాయ ముక్కలు  , కరివేపాకు వేసి , పోపు పెట్టుకుని
అందులో కలపాలి.
ఆ తరువాత బాగా మరిగించాలి.
బాగా మరిగిన తరువాత
దించే ముందు  ,
కొత్తిమీర వేసి  మూత పెట్టుకోవాలి.
రుచికరమైన ఘుమఘుమలాడే ధనియాల చారు రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi





.

Friday 8 January 2016

శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం


శ్రీ లక్ష్మీ అష్టోత్తర పారాయణం :

ధ్యానమ్  :
వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం
హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితామ్ |
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం
పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభిః యుక్తాం సదా శక్తిభిః ||
సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే |
భగవతి హరివల్లభే మనోఙ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్ ||
ఓం ప్రకృతిం, వికృతిం, విద్యాం, సర్వభూత హితప్రదామ్ |
శ్రద్ధాం, విభూతిం, సురభిం, నమామి పరమాత్మికామ్ || 1 ||
వాచం, పద్మాలయాం, పద్మాం, శుచిం, స్వాహాం, స్వధాం, సుధామ్ |
ధన్యాం, హిరణ్యయీం, లక్ష్మీం, నిత్యపుష్టాం, విభావరీమ్ || 2 ||
అదితిం చ, దితిం, దీప్తాం, వసుధాం, వసుధారిణీమ్ |
నమామి కమలాం, కాంతాం, క్షమాం, క్షీరోద సంభవామ్ || 3 ||
అనుగ్రహపరాం, బుద్ధిం, అనఘాం, హరివల్లభామ్ |
అశోకా,మమృతాం దీప్తాం, లోకశోక వినాశినీమ్ || 4 ||
నమామి ధర్మనిలయాం, కరుణాం, లోకమాతరమ్ |
పద్మప్రియాం, పద్మహస్తాం, పద్మాక్షీం, పద్మసుందరీమ్ || 5 ||
పద్మోద్భవాం, పద్మముఖీం, పద్మనాభప్రియాం, రమామ్ |
పద్మమాలాధరాం, దేవీం, పద్మినీం, పద్మగంధినీమ్ || 6 ||
పుణ్యగంధాం, సుప్రసన్నాం, ప్రసాదాభిముఖీం, ప్రభామ్ |
నమామి చంద్రవదనాం, చంద్రాం, చంద్రసహోదరీమ్ || 7 ||
చతుర్భుజాం, చంద్రరూపాం, ఇందిరా,మిందుశీతలామ్ |
ఆహ్లాద జననీం, పుష్టిం, శివాం, శివకరీం, సతీమ్ || 8 ||
విమలాం, విశ్వజననీం, తుష్టిం, దారిద్ర్య నాశినీమ్ |
ప్రీతి పుష్కరిణీం, శాంతాం, శుక్లమాల్యాంబరాం, శ్రియమ్ || 9 ||
భాస్కరీం, బిల్వనిలయాం, వరారోహాం, యశస్వినీమ్ |
వసుంధరా, ముదారాంగాం, హరిణీం, హేమమాలినీమ్ || 10 ||
ధనధాన్యకరీం, సిద్ధిం, స్రైణసౌమ్యాం, శుభప్రదామ్ |
నృపవేశ్మ గతానందాం, వరలక్ష్మీం, వసుప్రదామ్ || 11 ||
శుభాం, హిరణ్యప్రాకారాం, సముద్రతనయాం, జయామ్ |
నమామి మంగళాం దేవీం, విష్ణు వక్షఃస్థల స్థితామ్ || 12 ||
విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం, నారాయణ సమాశ్రితామ్ |
దారిద్ర్య ధ్వంసినీం, దేవీం, సర్వోపద్రవ వారిణీమ్ || 13 ||
నవదుర్గాం, మహాకాళీం, బ్రహ్మ విష్ణు శివాత్మికామ్ |
త్రికాలఙ్ఞాన సంపన్నాం, నమామి భువనేశ్వరీమ్ || 14 ||
లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీమ్ |
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ||
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరామ్ |
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ || 15 ||
మాతర్నమామి! కమలే! కమలాయతాక్షి!
శ్రీ విష్ణు హృత్-కమలవాసిని! విశ్వమాతః!
క్షీరోదజే కమల కోమల గర్భగౌరి!
లక్ష్మీ! ప్రసీద సతతం సమతాం శరణ్యే || 16 ||
త్రికాలం యో జపేత్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః |
దారిద్ర్య ధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్-యయత్నతః |
దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతమ్ |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 17 ||
భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకమ్ |
అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే ||
దారిద్ర్య మోచనం నామ స్తోత్రమంబాపరం శతమ్ |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 18 ||
భుక్త్వాతు విపులాన్ భోగాన్ అంతే సాయుజ్యమాప్నుయాత్ |
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వ దుఃఖోప శాంతయే |
పఠంతు చింతయేద్దేవీం సర్వాభరణ భూషితామ్ || 19 ||

ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణమ్

Thursday 7 January 2016

తెలుగు సాహిత్యము వికట కవిత్వము


                                                    తెలుగు సాహిత్యము  వికట కవిత్వము

ఎందరో మహా కవులు.సాహిత్యములో వారు చేసిన , చేస్తున్న కృషి ఎనలేనిది.సాహిత్యము లోచెప్పుకోదగ్గ ముఖ్యమైన వాటిలో వికట కవిత్వము ఒకటి. మనకు తెలిసిన ప్రముఖ కవి తెనాలి రామకృష్ణ.ఆయన హాస్య చతురుడు,
వికట కవిత్వములో ఆయన ప్రతిభ అమోఘము.ఆయనే కాదు ఇంకా చాలామంది
కవులు ఈ విధానములో తమ ప్రతిభను చూపించారు.

వికట అంటే హాస్యము అని అర్థము ఉన్నా ,అసలు వికట అంటే ఏ వైపు నుంచి చదివినా ఒకే లా వస్తుంది .అంతే కాదు వేరే అర్థాలు కూడా ఉంటాయి .ఉదాహరణకు  ఈ పద్యము చూద్దాము.

వాసుదేవ. వాసుదేవ. వాసుదేవ.
"తం భూసుతా ముక్తిముదార హాసం
వందే యతో భవ్యభవం దయాశ్రీః|
శ్రీ యాదవం భవ్య భతోయ దేవం
సంహారదా ముక్తి ముతా సుభూతం||"
వాసుదేవ.

ఈ శ్లోకం 'శ్రీ రామకృష్ణ విలోమ కావ్యం' లోనిది. కవి పేరు పండిత దైవజ్ఞ సూర్య సూరి. 14వ శతాబ్దపు, దివిసీమ తాలూకా కవి.
  ఈ శ్లోక విశేషమేమిటంటే మొదటినుంచి చివరకు చదివినా, చివరనుంచి వెనుకకు చదివినా ఒకేలాగ ఉంటుంది, అంటే వికటకవి లాగా అన్నమాట. ఇంగ్లీషులో దీనిని ప్యాలిన్డ్రోమ్ అంటారు. అర్థభేదం మాత్రం ఉంటుంది.

 ఎడమనుండి కుడికి చదివినప్పుడు శ్రీరామ పరంగానూ, కుడినుండి ఎడమకు చదివినప్పుడు శ్రీకృష్ణ పరంగానూ ఉంటుంది. చూడండి,  ఎడమనుండి చదివినప్పుడు 'ఎవరైతే సీతను రక్షించారో, ఎవరి చిరునవ్వు మనోమోహకంగా ఉంటుందో, ఎవరి అవతార విశేషం పరమ అద్భుతమో, ఎవరినుండైతే దయ, అద్భుతమూ అన్నిచోట్లా వర్షిస్తుందో అట్టి శ్రీరామునికి నమస్కరిస్తున్నాను,' అనే అర్థం వస్తుంది.

 అదే కుడినుండి ఎడమకు చదివినప్పుడు 'శ్రీ యాదవ కులంలో ఆవిర్భవించిన, సూర్యచంద్రులకు ప్రాణాధారమైన, పూతనను సంహరించిన, సకల సృష్టికి ఆత్మయైనట్టి శ్రీకృష్ణునికి నమస్కరిస్తున్నాను,' అని అర్థం వస్తుంది.

Tuesday 5 January 2016

VEERA SAINIKA VANDANAM



వీర సైనికా వందనం

   సౌర్య కీర్తి  ---  జాతి స్ఫూర్తి  

మీ బుల్లెట్ల  వర్షం  తొలకరి  జల్లు లా ప్రారంభమై , 
పెను తుఫాను లా మారి , 
ప్రళయ  మారుతము  గా 
సరిహద్దు  శత్రువులను 
చుట్టు ముట్టి,
తరిమి కొట్టి,
భారతీయులపై  కురిపించాయి  
విజయ మల్లెల  వర్షం
పెల్లుబికింది  మీ పట్ల అంతటా  హర్షం . 
వర్షం వెలిసిన తరువాత  వీచే 
ఈదురు  గాలులలో ఎగురుతోంది  
ఎగురుతోంది మువన్నెల  జెండా
అనంతమైన  ఎత్తులో  
అశేష  హిమాలయా పర్వతాల మీద 
మ్రోగిస్తూ  విజయ దుందుభి
 శిఖరాగ్రము ఫై  తల ఎత్తి సగర్వం గా
మిలమిలా  మెరుస్తూ  ,
అందరు  యోధుల  విజయానికి  సంకేతము లా ,
మరెందరో  యోధుల  త్యాగానికి ఫలితం లా ,
దేశ మంతటా విజయోత్సావాలు  వెల్లి విరుస్తుంటే  ,
తల్లీ భారతి 
ఏమిటమ్మా నీ కళ్ళలో  నీళ్ళకు అర్థం మన వీర సైనికుల సౌర్యము  అనిర్వచనియము. ,
పరాక్రమము  అత్యద్భుతం  ,
త్యాగం  చిర స్మరణియమ్  ,
శత్రువులను తరిమి కొట్టి మన జాతి  గౌరవాన్ని  ,
మన దేశ ప్రతిష్టను కాపాడిన   
ఇలాంటి  వీరులను కన్నందుకు  
కళ్లలొ కలిగిన  ఆనంద భాష్పాలా,
లేక  
వీర పరాక్రమము  తో యుద్ధము లో 
దేశ రక్షణ  కై  ,  
అశువులు బాసిన  
వీర యోధుల త్యాగానికి అశ్రు తర్పణమా  ......

మన దేశ రక్షణ కై పోరాడే ప్రతీ వీరునికి 
వినమ్రము గా  వందనము  చేస్తూ  
 కవితను  అంకితమిస్తున్నా