Wednesday 26 October 2016

మసాలా దోశ

మసాలా దోశ
కావలిసిన పదార్థాలు
1. మినపప్పు ఒక గ్లాసు
2. బియ్యం రెండున్నర గ్లాసులు
3. మెంతలు కొద్దిగా
4. ఉప్పు రుచికి సరిపడా
5. పచ్చిమిర్చి 4

కూర తయారీ కి కావలిసిన పదార్థాలు
1. బంగాళాదుంపలు పావుకేజీ
2. ఉల్లి పాయలు 4
3. అల్లం చిన్న ముక్క
4. పచ్చిమిర్చి 3
5. పసుపు కొద్దిగా
6. ఉప్పు రుచికి సరిపడా
7. కొత్తిమీర

పోపు దినుసులు
సెనగపప్పు 1 స్పూన్,  మినపప్పు 1 స్పూన్ ,
ఆవాలు అర స్పూన్ , జీలకర్ర అర స్పూన్ ,
ఎండుమిరపకాయలు 2 , ఆయిల్ 2 స్పూన్స్  , కరివేపాకు

దోశ పిండి తయారీ విధానం
ముందుగా మినపప్పు , బియ్యము ,  శుభ్రం గా కడిగి ,మెంతులు వేసి
నీళ్లుపోసుకుని 4 గంటలసేపు నానబెట్టుకోవాలి .
నానిన వీటిని ఉప్పు పచ్చిమిర్చి వేసి మెత్తగా రుబ్బుకోవాలి
పిండు గరిట జారుగాఉండేలా చూసుకోవాలి
 పైన జీల కర్రను వేసుకోవాలి.

కూర తయారీ విధానం
ముందుగా బంగాళదుంపలను శుభ్రం గా కడిగి,
 కుక్కరులో పెట్టి ఉడికించుకుని చల్లార్చుకోవాలి.
 ఉల్లి పాయలను ,పచ్చిమిర్చిని , అల్లమును సన్నగా తరుగుకోవాలి .
 స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక 3 స్పూన్స్ ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపు దినుసులను వేసి అవి దోరగా వేగాక
తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ ,పచ్చిమిర్చి , అల్లము , కరివేపాకులను వేసి ,
ఇవి కూడా దోరగా వేగాక
ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలను వేసి
పసుపు ,సరిపడినంత ఉప్పులను ,వేసి,
 ముద్దా లాగ చేసుకుని
స్టవ్ ఆఫ్ చేసుకోవాలి . ఈ కూరను ఒక బౌల్ లో కి తీసుకుని
కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి .
స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కాక ఒక స్పూన్ ఆయిల్ వేసి
 పెనం అంతా ఆయిల్ పరుచుకునేలా చేసి , తరిగిన ఉల్లిపాయతో తుడిచి ,
ముందుగా రుబ్బి పెట్టుకున్న పిండి ని
పెనం మధ్యలో వేసి గుండ్రం గా తిప్పుతూ అంచులవరకు రావాలి .
ఒక స్పూన్ ఆయిల్ వేసి వేగనిచ్చి
 అట్లకాడతో తిరగేసి
ఒక స్పూన్ ఆయిల్ వేసి వేగిన తరువాత ,
మధ్యలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ,
బంగాళాదుంప కూరను పెట్టి,
సర్వ్ చేసుకుంటే
మసాలా దోశ రెడీ

ఈ దోశ  ను కొబ్బరిపచ్చడి తో గానకొత్తిమీర పచ్చడితో గాని తింటే రుచిగా ఉంటాయి

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi