పెసరపప్పు పచ్చి పచ్చడి తో దోశె
కావలిసిన పదార్థాలు
1. పెసరపప్పు 2 కప్పులు
2. ఎండుమిరపకాయలు 4
3. జీలకర్ర కొద్దిగా
4. ఇంగువ కొద్దిగా
5. పసుపు కొద్దిగా
6. ఉప్పు రుచికి సరిపడా
7. ఆయిల్ ఒక కప్పు
8. ఉల్లిపాయ 1
9. పచ్చిమిర్చి 2
10. కొత్తిమీర కొద్దిగా
తయారీ విధానం
ముందుగా పెసరపప్పు ను శుభ్రం గా కడిగి
నానేలా నీళ్లు పోసుకుని 3 గంటలసేపు నానబెట్టుకోవాలి .
నానిన పెసరపప్పును నీళ్లు ఒంపి చిల్లుల పళ్లెం లో వేసుకోవాలి.
పెసరపప్పు , ఉప్పు , పసుపు ,జీలకర్ర ,
ఇంగువ , ఎండుమిరపకాయలు , వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని
మెత్త గా గ్రైండ్ చేసుకోవాలి .
దీనిని ఒక గిన్నెలోకి తీసుకుని గరిట జారుగా ఉండేలా చేసుకోవాలి.
ఉల్లిపాయలు , పచ్చిమిర్చి, కొత్తిమీర ను ,
సన్నగా తరుగుకోవాలి.
స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కాక
ఒక స్పూన్ ఆయిల్ వేసి పెనం అంతా పామి
ముందుగా రుబ్బి పెట్టుకున్న పెసరపప్పు పచ్చడి మిశ్రమాన్ని వేసి
మినప దోశ మాదిరిగా మధ్యలోనుండిగుండ్రంగా తిప్పుకుని పైన
తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ ,పచ్చిమిరపకాయముక్కలు ,
కొత్తిమీర ను వేసి కొద్దిగా ఆయిల్ ని కూడా వేసి వేగనిచ్చి
అట్లకాడతో తిరగ వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి
దోరగా వేపుకుంటే ,ఘుమ ఘుమ లాడే
పెసరపప్పు పచ్చి పచ్చడి దోశె రెడీ.
దీనిని వేడి అన్నం లో బాగుంటుంది .
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi