పెసర పుణుకుల మజ్జిగ పులుసు
కావలిసిన పదార్థాలు
1. మజ్జిగ అర లీటరు
2. ఆనపకాయ ముక్కలు 1 కప్పు
3. వంకాయలు 2
4. బెండకాయలు 2
5. టమాటో 1
6. పచ్చిమిర్చి 2
7. సెనగపిండి 3స్పూన్స్
8. పసుపు కొంచెము ,
9. ధనియాల పొడి 1 స్పూన్
10. కొబ్బరి కోరు 4స్పూన్స్
11. ఉప్పు
12. కొత్తిమీర
13. కరివేపాకు.
పెసర పుణుకులకి :::
1. పెసర పప్పు 2 కప్పులు
2. ఉప్పు
3. నూని
తయారీ విధానము.
ముందుగా పెసర పప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి .
గంట సేపు నానితే సరిపోతుంది .
మెత్తగా రుబ్బుకోవాలి . తరువాత తగినంత ఉప్పు కలుపుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి లో ఆయిల్ పోసుకుని ,కాగాక
రుబ్బుకున్న ఈ పిండిని చిన్న చిన్న పునుకులలాగా వేసుకోవాలి.
కూరముక్కలను ఒక గిన్నె లో వేసుకుని ముక్కలకు సరిపడే నీళ్ళూ పోసి
స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి
ముక్కలు ఉడికిన తరువాత బాగాచల్లారనివ్వాలి .
ఒక గిన్నెలోకి మజ్జిగ తీసుకుని అందులో
పసుపు , ధనియాల పొడి
( శనగపప్పు 2స్పూన్స్ ,మినప పప్పు 2 స్పూన్స్ ,ధనియాలు 2 స్పూన్స్
మిరియాలు 2, , ఎండు మిరపకాయ ఒకటి , వే ఇంచి గ్రైండ్ చేసిన పొడి ),
కొబ్బరి కోరు , సెనగపిండి , ఉప్పు వేసి
ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి .
దీంట్లో చల్లారిన కూరముక్కలను వేసి బాగా కలిపి
స్టవ్ మీద పెట్టి ఉడికించాలి
మంట సిం లో ఉండేలా చూసుకోవాలి మధ్య మధ్య లో కలుపుతూ వుండాలి
ఆవాలు జీలకర్ర మెంతులు, ఎండు మిరపకాయ , పచ్చి మిరపకాయ ,ఇంగువ కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి
వేగిన పునుకులను పులుసులో వేసి ,
కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి
ఘుమఘుమ లాడే మజ్జిగ పులుసు రెడీ.
---Subha's Kitchen