Friday 17 June 2016

శ్రీకృష్ణ భగవానుని మందిరం///ఉడిపి


   
                                                   శ్రీకృష్ణ భగవానుని మందిరం///ఉడిపి

 ఇక్కడ   13వ శతాబ్దం నాటి
మధ్వాచార్యుల వారిచే ప్రతిష్టించబడిన
బహు సుందర రూపమైన
బాలకృష్ణ స్వామి విగ్రహము కలదు.
స్వామి భక్తసులభుడై కనకదాసు
అను భక్తుని కరుణించటానికి
తూర్పు ముఖంగా ఉండే స్వామి
పశ్చిమాభిముఖుడైనాడని ఒక భక్తుని కధ.
స్వామిని కనకదాసు ఎక్కడ నుండి చూచాడో
అక్కడ మండపం కట్టించి దానికి
కనకదాస మండపం అని పేరు పెట్టారుట.
స్వామిని అర్చించటానికి ఆచార్యులవారు
8 మఠములు ఏర్పరిచారని
అందులో ఉండే యతీశ్వరులే
రెండు సంవత్సరాల కొకరుగా
వంతుల వారీగా అర్చన చేయటానికి
నియోగించబడినట్లుగా చెప్తారు.
మారేటప్పుడు పర్యాయోత్సవమని చేస్తారు.

దర్శనీయ స్థలాలు

పవిత్ర వాదిరాజ స్వామివారి సోదెమఠము,
శ్రీకృష్ణ మఠము -
విమానగిరి దుర్గాలయం -
 కోటిలింగాలు గల కోటీశ్వర క్షేత్రం.

మూకాంబికా క్షేత్రం

ఉడిపికి ఈశాన్యంగా 80 కి.మీ. దూరంలో ఉన్న పుణ్యక్షేత్రం. మూకాంబికా దుర్గాదేవి అవతార విశేషమే స్వయంగా ఉద్భవించిన శివలింగము  ఉడిపి వెనుక మహతేజస్సుతో విరజిల్లే దుర్గాదేవిని శ్రీశంకరాచార్యుల వారు స్వయంగా ప్రతిష్టించినది. నవరాత్రుల్లో మహాసంరంభమైన ఉత్సవాలు జరుగుతాయి.