Friday 24 June 2016

చింతపండు ఆవ పులిహోర



                                                           " చింతపండు ఆవ పులిహోర "

కావలసిన పదార్థాలు

1. బియ్యం 4గ్లాసులు
2. చింతపండు నిమ్మకాయంత
3.   పచ్చిమిరపకాయలు 5
4. అల్లం చిన్న ముక్క
5. కరివేపాకు కొద్దిగా
6. ఆవముద్ద 2 స్పూన్స్

పోపు దినుసులు

సెనగపప్పు 2 స్పూన్స్ ,
మినపప్పు 2 స్పూన్స్ ,
ఆవాలు 1 స్పూన్
ఎండుమిరపకాయలు 3
పల్లీలు 3స్పూన్స్ ,
ఇంగువ కొద్దిగా
పసుపు  అర స్పూన్
ఉప్పు రుచికి సరిపడ
ఆయిల్ 5 స్పూన్స్

తయారీ విధానం

ముందుగా చింత పండును కొద్దిగా నీళ్లు పోసి
ఒక గిన్నె లోనాన బెట్టుకోవాలి

బియ్యాన్ని శుభ్రం గా కడిగి ఒక గ్లాసు బియ్యానికి
 రెండు గ్లాసుల నీళ్లు పోసుకుని

 ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని కుక్కరు లో పెట్టి ఉడికించుకోవాలి
 అన్నం ఉడికిన తరువాత
 ఒక బేసిను లోకి తీసుకుని చల్లార నివ్వాలి

పచ్చి మిర్చిని చీలికలుగాను ,
అల్లాన్ని చిన్న ముక్కలు గాను తరుగుకోవాలి .
నానబెట్టుకున్న చింతపండును
 పిప్పులు లేకుండా మెత్తని గుజ్జు లా తీసుకుని
ఉడికించుకోవాలి .

స్టవ్ మీద బాణలి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసి
ముందుగా పల్లీలను వేసి అవి వేగాక
 పైన చెప్పిన పోపుదినుసులను వేసి
అవి దోరగా వేగాక ,
తరిగిపెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలు ,
అల్లం ముక్కలు , కరివేపాకులను  వేసి దోరగా వేగనివ్వాలి

ఇప్పుడు చల్లారిన అన్నం మీద పసుపు ,
ఆయిల్  , ఉప్పు వేసి బాగా కలపాలి
తరువాత పోపుమిశ్రమాన్ని
ఉడికించి పెట్టుకున్న చింత పండు మిశ్రమాన్నివేసి
 బాగా కలిసేలా కలుపు  కోవాలి

చివరగా ముందే నూరి పెట్టుకున్న ఆవ ముద్దను
కొద్దిగా ఆయిల్ ను వేసి
అంత కలిసేలా కలుపుకుంటె
ఘుమ ఘుమ లాడే
చింత పండు ఆవ పులిహోర రెడీ

Subha's Kitchen