Saturday 9 January 2016

ధనియాల చారు


                                                                ధనియాల  చారు

కావలిసిన  పదార్ధాలు :

1. కంది  పప్పు  3 స్పూన్స్,
2. ధనియాలు 1 స్పూన్,
3. ఎండు  మిరప కాయలు 2,
4. మిరియాలు 4,
5.  టమాటో  1
6.  పచ్చి మిరపకాయ 1.
7 . చింతపండు ,
,8. ఉప్పు ,
9. బెల్లము,
10.  పసుపు

తయారీ విధానము :
ముందుగా  కంది  పప్పు , ధనియాలు , ఎండు  మిరప కాయలు , మిరియాలు
ఒక గంట సేపు నానబెట్టు కోవాలి.
నానిన తరువాత  , మెత్తగా  గ్రైండ్ చేసుకోవాలి.
ఆ మిశ్రమాన్ని ఒక గిన్నె లోకి తీసుకుని ,
చింతపండు పులుసు ,( చింత పండు నీళ్ళలో పిండి గుజ్జు తీసేయాలి )
ఉప్పు , బెల్లము, పసుపు  ,టమాటో ముక్కలు, పచ్చిమిరపకాయ వేసుకుని ,
స్టవ్ మీద పెట్టి, బాగా మరిగించాలి .
ఇది మరిగేటప్పుడు స్టవ్ మంటచిన్నది  గా  ఉండేలా చూసుకోవాలి. ,
పేన్  లో కొంచెము నూని  వేసి ,ఆవాలు,మెంతులు  జీలకర్ర, కొద్దిగా ఇంగువ ,
ఎండుమిరపకాయ ముక్కలు  , కరివేపాకు వేసి , పోపు పెట్టుకుని
అందులో కలపాలి.
ఆ తరువాత బాగా మరిగించాలి.
బాగా మరిగిన తరువాత
దించే ముందు  ,
కొత్తిమీర వేసి  మూత పెట్టుకోవాలి.
రుచికరమైన ఘుమఘుమలాడే ధనియాల చారు రెడీ.

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi





.