Thursday 7 May 2020

దేవుని ప్రసాదములు రకాలు

దేవుని ప్రసాదములు రకాలు

మనం చేసే పూజలు రెండు రకాలుగా చేసుకుంటాం.
ఇంట్లో దేవునికి పూజ దేవాలయాల్లోనూ పూజలు చేస్తూ ఉంటాం.
ఇంట్లో చేసే పూజలు దేవతా కార్యాలు కిందకు వస్తాయి.
ఇంటి యజమాని పెద్దల సహకారంతో ఇక్కడ పూజలు చేస్తాం.
దేవాలయాలలో పూజల విషయానికి వస్తే కుటుంబ సభ్యులు మిత్రులు బంధువులతో వెళ్లి దేవుని పూజ చేస్తాము.
పూజలు చేసిన తర్వాత దేవాలయ అర్చకులు భక్తులకు ప్రసాదాలు అందజేస్తారు.
దైవ ప్రసాదం పేరుతో తీర్థాలు, భక్ష్య ప్రసాదాలు , పుష్ప ప్రసాదాలు, ఫల, అన్న, రక్ష ,లేపన, మృత్తిక ,ఇన్ని రకాల రూపాలలో ప్రసాదాలు ఇస్తారు..
ఫల ,అన్న, భక్ష ప్రసాదాలను వెంటనే అక్కడి తినొచ్చు..
కుంకుమ అయితే ప్రతిరోజు నుదుటిన ధరించవచ్చు అయితే శివుని గుడి లో ఇచ్చే బిల్వ పత్ర ప్రసాదాన్ని ప్రతిరోజూ ఉపయోగించలేము.
ధరించడం పై నిషేధం ఉంది..

ఇటువంటి సందర్భాల్లో ఏం చేయాలి? ప్రసాదాలు లో ఎన్ని రకాలు ఉంటాయి? ఈ ప్రసాదాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలి ?ఈ ప్రసాదాలతో ఎటువంటి ఫలితం లభిస్తుంది? ప్రసాదాలు స్వీకరించే విషయంలో చేయవలసిన అంశాలు కొన్ని

ప్రసాదాలలో రెండు రకాల ప్రసాదాలు

1. భక్ష్య ప్రసాదం
2. తీర్థ ప్రసాదం

తీర్థప్రసాదాలలో నాలుగు రకాలు ఉంటాయి..

1. జల తీర్ధం.
2. కాషాయ తీర్థం.
3. పంచామృత అభిషేక తీర్థం.
4. పానక తీర్థం.

జల తీర్ధం

ఈ తీర్థం సేవించడం ద్వారా అకాల మృత్యువు సర్వరోగాలు నివారించబడతాయి అన్ని కష్టాలు దుఖాలు తొలగిపోతాయి.. బుద్ధి అధర్మం వైపు పయనించకుండా అడ్డు పడుతుంది..

కషాయ తీర్థం

ఈ తీర్థాన్ని కొల్హాపురం లోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం, కొల్లూరు మూకాంబిక దేవాలయం, హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాల మాలిని దేవాలయం, అస్సాంలోని కామాఖ్య దేవాలయములో ఇస్తారు రాత్రి పూజ తర్వాత తీర్థాన్ని కషాయం రూపంలో పంచుతారు ..
వీటిని సేవించడం ద్వారా కనిపించే కనిపించని రోగాలు త్వరగా నయం అవుతాయి

పంచామృత అభిషేక తీర్థం

పంచామృత అభిషేకం ని స్వీకరించడం ద్వారా చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి కావడం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది..

పానక తీర్థం

శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి అహోబిలం నరసింహస్వామి దేవునికి పానకం నైవేద్యంగా పెట్టడం తో పానకాల స్వామి పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినార్జించారు..కారణం స్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్థంగా పంచుతారు..
పానక తీర్థాన్ని సేవిస్తే
దేహంలో ఉత్సాహం ఎక్కువవుతుంది కొత్త చైతన్యం వస్తుంది..
దేహంలో ఉండే ఉష్ణం సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది.
రక్తపోటు ఉన్న వారికి తల తిరగడం నోరు ఎండిపోయినట్లు ఉండటం జరగదు
ఎముకలకు సంబంధించిన వ్యాధులు నయం అవుతాయి..
నీరసం దరిచేరదు ఆకలి బాగా వేస్తుంది ..
హార్మోన్లు వృద్ధి చెందుతాయి..
జీవితంలో శత్రువుల బాధ కలుగదు..
బుద్ధి చురుకుగా పనిచేస్తుంది ..
జ్ఞాపక శక్తి పెరుగుతుంది..

భక్ష్య ప్రసాదం

దేవునికి భక్తులు ప్రసాదం రూపంలో భక్ష్యాలను అందిస్తారు .
వీటిలో లడ్డు , వడల హారం, దోసెల నైవేద్యం ,బెల్లం దోస నైవేద్యం ,చేగోడీ ల నైవేద్యం, జంతికల నైవేద్యం ,బొబ్బట్లు నైవేద్యం ,అరిసెల నైవేద్యం, రవ్వ లడ్డు నైవేద్యం మొదలైన నైవేద్యాలు ఉన్నాయి.‌

వీటిని నైవేద్యంగా దేవుడికి ఇవ్వడం ద్వారా ఎటువంటి శుభాలు కలుగుతాయి అంటే

దేవునికి
1. లడ్డులను నైవేద్యంగా ఉంచితే ఇంట్లో శుభకార్యాలు జరిగి అంతా శుభమే జరుగుతుంది..
2. వడల హారాన్ని లేదా గారెలను నైవేద్యంగా పెడితే ఇంట్లో అన్ని రకాల కలహాలు నివారణ అవుతాయి. మనసు కూడా స్థిరంగా ఉంటుంది..
3. దోసెను నైవేద్యంగా పెడితే ఇంట్లో
శాంతి ఉంటుంది.
శాంతియుత వాతావరణం నెలకొంటుంది .
ఇంట్లో ఎవరికైనా నిద్ర రాకుంటే చక్కగా నిద్రపడుతుంది..
4. బెల్లం దోసెను నైవేద్యంగా ఉంచడం
ద్వారా చక్కెర వ్యాధి ఉన్నవారు త్వరగా కోలుకుంటారు. చదువుకునే వారికి విద్య చక్కగా అబ్బుతుంది. మంచి జ్ఞాపకశక్తి వస్తుంది..
5. శనగపిండి లడ్డు నైవేద్యంగా ఉంచితే మరుపు దరిచేరదు..
6. జంతికలను నైవేద్యంగా పెట్టడం ద్వారా బరువైన లోహాలు ఇనుప వ్యాపారం చేసేవారికి వ్యాపారం వృద్ధి చెందుతుంది..
7. చేగోడీలు నైవేద్యంగా ఉంచితే ఇంట్లో చాలా రోజులుగా నిలిచి ఉన్న పనులు వేగంగా జరుగుతాయి..
8. దేవునికి బొబ్బట్లు నైవేద్యంగా ఉంచితే ఇంట్లో కుజ దోషాలు నివారణ కలిగి త్వరగా వివాహాలు జరుగుతాయి..
9. అప్పాలు లేదా అరిసెలను నైవేద్యంగా ఉంచితే పెద్దలు పాపాలు తొలగిపోతాయి..
10. రవ్వలడ్డు నైవేద్యంగా ఉంచితే ఆలోచనల వల్ల కలిగే తలనొప్పి,కంటికి సంబంధించిన నొప్పి, అధిక రక్తపోటు సాధారణ స్థితికి వస్తాయి..

సేకరణ....