Tuesday 5 December 2017

తెలుగు వర్ణమాల ప్రాశస్త్యం దేవతాస్వరూపాలు వాగ్దేవతలు

తెలుగు వర్ణమాల ప్రాశస్త్యం దేవతాస్వరూపాలు
                 వాగ్దేవతలు

తెలుగు భాషలో  వాగ్దేవతల యొక్క వర్ణమాల దాని అంతర్నిర్మాణం :

*"అ నుండి అః"*
వరకు ఉన్న
 16 అక్షరాల విభాగాన్ని
 *"చంద్ర ఖండం"* అంటారు.

ఈ చంద్రఖండంలోని అచ్చులైన 16 వర్ణాలకు  అధిదేవత *"వశిని"*
 అంటే వశపరచుకొనే శక్తి కలది అర్ధం.

*"క"* నుండి *"భ"* వరకు ఉన్న
 24 అక్షరాల విభాగాన్ని
*" సౌర ఖండం"* అంటారు.

.*"మ"* నుండి  *"క్ష"* వరకు ఉన్న
 10 వర్ణాల విభాగాన్ని  *"అగ్ని ఖండం"* అంటారు.
ఈ బీజ శబ్దాలన్నీ
జన్యు నిర్మాణాన్ని క్రోమౌజోములను ప్రభావితం చేయగలుగుతాయి.

సౌర ఖండంలోని
*"క"* నుండి  *"ఙ"*
 వరకు  గల ఐదు అక్షరాల అధిదేవత కామేశ్వరి.

అంటే కోర్కెలను మేలుకొలిపేది అని అర్ధం.

.*"చ"* నుండి  *"ఞ"* వరకు గల ఐదు వర్ణాలకు అధిదేవత *"మోదిని"* అంటే సంతోషాన్ని వ్యక్తం చేసేది.

.*"ట"*నుండి *"ణ"*వరకు గల ఐదు అక్షరాల  అధిదేవతా శక్తి *"విమల"* అంటే మలినాలను తొలగించే దేవత.

*"త"* నుండి *"న"* వరకు గల ఐదు అక్షరాలకు అధిదేవత *"అరుణ"*  కరుణను మేలుకొలిపేదే అరుణ.

*"ప"*  నుండి *"మ"* అనే ఐదు అక్షరాలకు అధిదేవత *"జయని"* జయమును కలుగ చేయునది.

అలాగే అగ్ని ఖండంలోని
*" య, ర,ల, వ*
అనే అక్షరాలకు అధిష్టాన దేవత *"సర్వేశ్వరి"*. శాశించే శక్తి కలది సర్వేశ్వరి.

.ఆఖురులోని
 ఐదు అక్షరాలైన
*"శ, ష, స, హ, క్ష లకు* అధిదేవత *"కౌలిని"*

ఈ అధిదేవతలనందరినీ *"వాగ్దేవతలు"* అంటారు.

.అయితే ఈ ఏడుగురే కాకుండా అన్ని వర్ణాలకు ప్రకృతిలో ఒక రూపం,
ఒక దేవతాశక్తి ఉంది.

ఎందుకంటే శబ్దం బ్రహ్మ నుండి అద్భవించింది.
అంటే బ్రహ్మమే శబ్దము.
*ఆ బ్రహ్మమే నాదము.*

మనం నిత్యజీవితంలో  సంభాషించేటప్పుడు వెలువడే శబ్దాలు మనపై, ప్రకృతి పై ప్రభావం చూపుతాయి.

*అదే మంత్రాలు,*
*వేదం అయితే*
*ఇంకా లోతుగా*
*ప్రభావం చూపుతుంది*

భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఈ శబ్దాల్ని ఉచ్ఛరించి అమ్మవార్లును అర్చిస్తున్నాయి.

కాబట్టి మనం స్తోత్రం చదువుతున్నా,
వేద మంత్రాలు, సూక్తులు వింటున్నా మనం
ఈ విషయం స్ఫురణలో ఉంచుకుంటే అద్భుతాలను చూడవచ్చు.

మనం చదివే స్తోత్రం
ఎక్కడో వున్న
దేవుడిని/దేవతను  ఉద్దేశించి కాదు,
మనం చదివే స్తోత్రమే
ఆ దేవత.

*మనం చేసే శబ్దమే*
*ఆ దేవత*

మన అంతఃచ్ఛేతనలో ఉండి పలికిస్తున్న శక్తియే మన ఉపాస్య దేవత.

ఆ శబ్దం వలన పుట్టిన నాదం దేవత.