Friday 30 October 2020

ప్రకృతి యొక్క వాస్తవాలైన మూడు నియమాలు

 ప్రకృతి యొక్క వాస్తవాలైన మూడు నియమాలు


ప్రకృతి యొక్క మొదటి నియమం

ఒకవేళ పొలంలో విత్తనం వేయకపోతే ప్రకృతి దానిని గడ్డీగాదంతో నింపేస్తుంది

అదేవిధంగా మనసును మంచి ఆలోచనలతో నింపకపోతే ఆ మనసులో చెడుఆలోచనలు చేరుకుంటాయి.

ప్రకృతి యొక్క రెండవ నియమం

ఎవరివద్ద ఏమిఉంటుందో వారు దానినే పంచుకోగలరు.

సుఖం కలిగిన వారు సుఖాన్నే పంచగలరు. దుఃఖం కలిగిన వారు దుఃఖాన్నే పంచగలరు.
జ్ఞానులు జ్ఞానాన్నే పంచగలరు.
భ్రమలలో ఉన్నవారు భ్రమలనే పంచగలరు.
భయస్తులు భయాన్నే పంచగలరు.

ప్రకృతి యొక్క మూడవనియమం

మీకు మీజీవితంలో ఏది లభించినా దానిని జీర్ణం చేసుకోవడం నేర్చుకోండి.

ఎందుకంటే భోజనం అరగకపోతే రోగాలు పెరుగుతాయి.
ధనం అరగకపోతే బడాయి పెరుగుతుంది.
మాటలు అరగకపోతే చాడీలు పెరుగుతాయి.
ప్రశంస అరగకపోతే అహంకారం పెరుగుతుంది.
నిందలు అరగకపోతే దుర్మార్గం పెరుగుతుంది.
అధికారం అరగకపోతే ప్రమాదం పెరుగుతుంది.
దుఃఖం అరగకపోతే నిరాశ పెరుగుతుంది.
సుఖం అరగకపోతే పాపం పెరుగుతుంది.