Tuesday, 5 May 2020

తిధి , అధిపతి దేవత ...వ్రత ఫలం

ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతిగా వుండటం జరుగుతుంది.

అదే విధంగా, పాడ్యమ్యాది తిధుల యందు వాటికి సంబంధించిన వ్రతాన్ని పన్నెండు మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితములు లభిస్తాయి అని చెపుతారు

తిథి అధిపతి మరియు వ్రత ఫలము గురుంచి క్లుప్తముగా క్రింద చెప్పబడినది.

పాడ్యమి : అధిదేవత - అగ్ని.
వ్రత ఫలం - సత్ఫల ప్రాప్తి.
విదియ : అధిదేవత - అశ్విని దేవతలు.
వ్రత ఫలం - ఆరోగ్య వృద్ది.
తదియ : అధిదేవత - గౌరీ దేవి.
వ్రత ఫలం - సుమంగళీ అనుగ్రహం.
చవితి: అధిదేవత - వినాయకుడు.
వ్రత ఫలం - కష్టములు తొలగిపోవుట.
పంచమి: అధిదేవత - నాగ దేవత.
వ్రత ఫలం - వివాహము, వంశ వృద్ది.
షష్టి : అధిదేవత - సుబ్రహ్మణ్య స్వామి.
వ్రత ఫలం - పుత్ర ప్రాప్తి.
సప్తమి: అధిదేవత - సూర్య భగవానుడు. వ్రత ఫలం - ఆయురారోగ్య వృద్ది.
అష్టమి: అధిదేవత - అష్టమాత్రుకలు.
వ్రత ఫలం - దుర్గతి నాశనము.
నవమి: అధిదేవత - దుర్గాదేవి.
వ్రత ఫలం - సంపద ప్రాప్తిస్తుంది.
దశమి: అధిదేవత - ఇంద్రాది దశ దిక్పాలకులు.
వ్రత ఫలం - పాపాలు నశిస్తాయి.
ఏకాదశి: అధిదేవత - కుబేరుడు.
వ్రత ఫలం - ఐశ్వర్యము ప్రాప్తించును.
ద్వాదశి: అధిదేవత - విష్ణువు.
వ్రత ఫలం - పుణ్య ఫల ప్రాప్తించును.
త్రయోదశి: అధిదేవత - ధర్ముడు.
వ్రత ఫలం - మనస్సులో అనుకున్న కార్యం ఫలిస్తుంది.
చతుర్దశి: అధిదేవత - రుద్ర.
వ్రత ఫలం - మ్రుత్యున్జయము, శుభప్రదం.
అమావాస్య: అధిదేవతలు - పితృదేవతలు. వ్రత ఫలం - సంతాన సౌఖ్యం.
పౌర్ణమి: అధిదేవత - చంద్రుడు.
వ్రత ఫలం - ధనధాన్య, ఆయురారోగ్య, భోగభాగ్య ప్రాప్తి.

సేకరణ

Monday, 4 May 2020

గోమాత దర్శనము చేయునప్పుడు చదివే శ్లోకాలు:–


గోమాత దర్శనము చేయునప్పుడు చదివే శ్లోకాలు:–

నమో గోభ్యః శ్రీమతీభ్యః సౌరభేయాభ్య ఏవచ l
నమో బ్రహ్మనుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమోనమః ll

భావం:-శ్రీమంతంబులై కామధేను సంతతులైన బ్రహ్మాదులచే స్తుతించబడిన పవిత్రములైన గోవులకు నా నమస్కారము….

గావో మమాగ్రతః నను గావో మే సంతు పృష్టతః l
గావో మే హృదయం నిత్యం గవాం మధ్యే వసామ్యాహం ll

భావం:–గోవులు నాముందు-వెనుకలందు యుండుగాక. గోవులే నా హృదయము. గోవుల మధ్యయందు నేను నివసించుచున్నాను…..

సర్వ దేవమయే దేవి సర్వ దేవైరలం కృతే l
మమాభిలషితంకర్మ సఫలం కురు నందిని ll

భావం:–ఓ గోమాతా ! సర్వదేవతాస్వరూపిణి, సర్వదేవతలచే అలంకరింపబడినదానా ! నా కోర్కెలను సఫలం చేయుము….

మహాలక్ష్మి ధ్యాన శ్లోకం


మహాలక్ష్మి ధ్యాన శ్లోకం

పద్మనాభ ప్రియాం
దేవీం పద్మాక్ష్మీం పద్మవాసినీం
పద్మవక్త్రాం పద్మహస్తాం
వందే పద్మామ హర్నిశమ్
పూర్ణేందు బింబవదనాం
రత్నాభరణ భూషితాం
వరదాభయ హస్తాడ్యాం
ధ్యాయే చ్చంద్ర సహొదరీమ్
ఇచ్చా రూపాం
భగవత స్సచ్చిదానంద రూపిణీం
సర్వజ్ఞాం సర్వజననీ,
విష్ణువక్ష స్త్ఫాలాలయామ్
దయాళుమనిశం
ధ్యాయేత్ సుఖసిద్ధ స్వరూపిణీమ్

పద్మముల వంటి నేత్రములు కలిగినది పద్మనాభునికి ప్రియమైనది
పద్మమునందు కూర్చున్నది
పద్మమువలె వికసించినటువంటి సుందర వదనం కలిగినది
పద్మముల వంటి చేతులు కలిగినది
నిండుగా ఉదయించిన చంద్రుని వంటి వదనంతో ఉన్నది
శిరస్సు మొదలుకొని పాదముల వరకు అన్ని రకాల రత్నాభరణములను అలంకరించుకున్నది
క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు
చంద్రునితో పాటు పుట్టింది.
భగవానుడైన నారాయణుని యొక్క ఇచ్ఛా శక్తి స్వరూపిణి సచ్చిదానంద రూపిణి అయిన తల్లి.
అన్నీ తెలిసిన తల్లి
సర్వ జగత్తుకూ తల్లి
నారాయణుని వక్ష స్థలంలో ఉన్నది
దయ గలిగిన తల్లి
ఎల్లవేళలా ధ్యానిస్తున్నాను.
ఆనందము, సిద్ధి(కార్య సిద్ధి, మోక్షము)
ఈ రెండింటి యొక్క రూపమే మహాలక్ష్మి.

భాస్కర భగవానుడు అనుగ్రహించిన అక్షరౌషధము

"ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్" అని శాస్త్రవచనం.
వేదంలో సౌర, అరుణమంత్రాలు శక్తివంతమైన ప్రభావం కలిగినవి.
వాటిలోని భావాలను, శబ్దశక్తులను మిళితం చేసిన దివ్యస్తోత్రమిది.
శ్రీకృష్ణుని పుత్రుడైన సాంబుడు ఒకసారి మహావ్యాధిగ్రస్తుడై, కృష్ణోపదేశంతో సూర్యోపాసన దీక్షను వహించాడు. సముద్ర తీరంలో దీక్షాబద్ధుడైన సాంబునకు ఆకాశమార్గం నుండి ఒక దివ్యపత్రం ఎగిరవచ్చి చేరింది. ఆ పత్రంలోనివి ఈ శ్లోకాలు. వీటిని నియమంగా రోజూ పారాయణ చేస్తే సంపూర్ణారోగ్యం చేకూరుతుంది.
వ్యాధులన్నిటినీ నివారింపజేసే ఈ స్తోత్రంలో వైదికమంత్ర స్ఫురణ నిబద్ధమై ఉంది. సాక్షాత్తు భాస్కర భగవానుడు అనుగ్రహించిన అక్షరౌషధమిది.

౧. ఉద్యన్నద్య వివస్వా-
నారోహన్నుత్తరాం దివం దేవః!
హృద్రోగం మమ సూర్యో
హరిమాణం చాశు నాశయేదఖిలమ్!!
౨. నిమిషార్ధేనైకేన
ద్వేచ శతే ద్వే సహస్రే ద్వే!
క్రమమాణ యోజనానాం
నమోస్తుతే నళిననాథాయ!!
౩. కర్మజ్ఞానఖదశకం
మనశ్చ జీవ ఇతి విశ్వసర్గాయ
ద్వాదశథా యో విచరతి
స ద్వాదశమూర్తి రస్తు మోదాయ!!
౪. త్వం హి యజూ ఋక్సామ
త్వమాగమస్త్వం వషట్కారః!
త్వం విశ్వం త్వం హంస -
స్త్వం భానో! పరమహంసశ్చ!!
౫. శివరూపాద్ జ్ఞానమహం
త్వత్తో ముక్తిం జనార్దనాకారాత్!
శిఖిరూపాదైశ్వర్యం
త్వత్త స్సంప్రాప్తుమిచ్ఛామి!!
౬. త్వచి దోషా దృశి దోషా
హృది దోషా యేఖిలేంద్రియజదోషాః!
తాన్పూషా హతదోషః
కించిద్రోషాగ్నినా దహతు!!
౭. ధర్మార్థ కామ మోక్ష -
ప్రతిరోధిన ఉగ్రతాపవేగకరాన్
బందీకృతేంద్రియగణాన్
గదాన్విఖండయతు చండాంశుః!!
౮. యేన వినేదం తిమిరం
జగదేతద్ గ్రసతి చరమచర మఖిలం
తం నళినీ భర్తారం
హర్తారం చాపదామీడే!!
౯. యస్య సహస్రాభీశో -
రభీశులేశో హిమాంశుబింబగతః
భాసయతి నక్తమఖిలం
భేదయతు విపద్గణానరుణః
౧౦. తిమిరమివ నేత్రతిమిరం
పటలమివాశేషరోగపటలం నః
కాశమివాధినికాయం
కాలపితా రోగశూన్యతాం కురుతాత్!!
౧౧. వాతాశ్మరీగదార్శస్
త్వగ్దోషమహోదరప్రమేహాన్
గ్రహణీభగందరాఖ్యా
మహారుజోప్యేష మే హన్తి!!
౧౨. త్వం మాతా త్వం శరణం
త్వం దాతా త్వం ధనం త్వమాచార్యః
త్వం త్రాతా త్వం హర్తా
విపదామర్క ప్రసీద మమ భానో!!
౧౩. ఇత్యార్యాద్వాదశకం
సాంబస్య పురో నభస్స్థ లాత్పతితం
పఠతాం భాగ్యసమృద్ధి -
స్సమస్తరోగప్రశాంతిశ్చ స్యాత్!!
ఇతి ద్వాదశార్యా స్తుతిః
సేకరణ...

నవగ్రహాలు విష్ణుమూర్తి అవతారాలు


నవగ్రహాలు విష్ణుమూర్తి అవతారాలు

శ్లో|| రామో೭వతార స్సూర్యస్య చంద్రస్యయదునాయకః|
నృసింహో భూమి పుత్రస్య బుద్ధ స్సోమసుతస్య చ|
వామనో విబుధేజ్యస్య భార్గవో భార్గవస్య చ|
కచ్ఛప సూర్య పుత్రస్య సైరిహకే యస్య సూకరః||
కేతోర్మీనావ తారస్య|| ఇతి పరాశ రేణోక్తం||

"పరి శేషాత్కాల రూపస్య మాందేః కల్కీ" ఇతి సూచ్యతే. అత ఏవోక్తం శ్రీమచ్ఛంకర భగవత్పూజ్య పాదైశ్చ స్రగ్ధరావృత్తం-

శ్లో|| మత్స్యః కూర్మో వరాహో నరహరిణపతి ర్వామనో జామదగ్న్యః|
కాకుత్థ్సః కంసఘాతీ మనసిజ విజయీ యశ్చకల్కీ భవిష్యన్‌||
విష్ణోరం శావతారా భువనహితకరా ధర్మ సంస్థాపనార్ధాః|
పాయాసుర్మాంత ఏ తేగురుతర కరుణా భార భిన్నాశయాయే||

కావున శ్రీ పరాశర మహర్షియు. పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీ మచ్ఛంకర దేశికులును మాందితో గూడిన దశ సంఖ్యాక గ్రహములను శ్రీ మహావిష్ణుని దశ సంఖ్యాకమగు అంశావతారములని వచించి యుండిరి.

1. సూర్యుని అంశావతారము సూర్యుని వంశమున జనించిన దశరధ మహారాజపుత్రుడగు శ్రీ రాముడు
2. చంద్రుని అంశావతారము యుదు వంశోద్భవుడగు బలరాముడు (శ్రీ కృష్ణుడు)
3. కుజుని అంశావతారము ఆగ్ని స్వరూపుడగు నృసింహమూర్తి
4. బుధుని అంశావతారము బుద్థదేవుడు
5. బృహస్పతి అంశావతారము వామనమూర్తి
6. శుక్రుని అంశావతారము పరశురామమూర్తి
7. శని యొక్క అంశావతారము కూర్మమూర్తి
8. రాహుని అంశావతారము వరాహమూర్తి
9. కేతుని అంశా వతారము మన్మథుని కేతనం అగు మీనమూర్తి
10. పరిశేష న్యాయముచే మాందీ గ్రహాంశావతారము కాలమూర్తియగు కల్కిమూర్తిగను వర్ణింపబడియెను. ఇట్లు వరామిహహిరా చార్య కృతహోరా--శాస్త్ర మనియెడి జ్యోతిష గ్రంథరాజమున చెడ్పబడెను.

ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అవతార అధిదేవత ఉన్నారు. ఆయా గ్రహ అధిదేవతను ఉపాసిస్తే ఆ గ్రహ తీవ్రత తగ్గుతుంది. రవి కి రామావతారాన్ని, చంద్రుడికి కృష్ణావతారాన్ని, కుజుడికి నరసింహ అవతారాన్ని, బుధుడికి బుద్ధావతారాన్ని, గురువుకి వామనావతారాన్ని, శుక్రుడికి పరశురామావతారాన్ని, శనికి కూర్మావతారాన్ని, రాహువుకి వరాహావతారాన్ని, కేతువు కి మీనావతారాన్ని పూజించాలి.
నవగ్రహాలలో ఏ గ్రహం యొక్క తీవ్రత అధికంగా ఉందో తెలుసుకొని శ్రీమన్నారాయణ అవతార ధ్యానం చేస్తే ఆ గ్రహ తీవ్రత తగ్గుతుంది.
ఇది ఒక విధమైన శాంతి.
సేకరణ

Saturday, 2 May 2020

ఏ వారం.. ఏ పూజ...ఏ ఫలితం

ఏ వారం.. ఏ పూజ...ఏ ఫలితం

శివమహా పురాణం విద్యేశ్వర సంహిత పద్నాలుగో అధ్యాయంలో
దేవతల ప్రీతి కోసం అయిదు విధాలైన పూజ ఏర్పడింది.
మంత్రాలతో జపం, హోమం, దానం,
తపస్సు, సమారాధనలు అనేవే అయిదు విధాలు.
సమారాధనం అంటే దేవుడి ప్రతిమ నుంచే వేదిక. ప్రతిమ, అగ్ని, లేక బ్రాహ్మణుడిని షోడశోపచారాలతో పూజించటం ఈ నాలుగు రకాలలో ఒక దానికంటే ఒకటి ఉత్తమమైనది.
పూజలు మనకున్న ఏడు వారాలలో
ఒక్కొక్క వారం ఒక్కొక్క దేవతకు
చెయ్యాల్సి ఉంటుంది.

ఆదివారం:
ఆదివారం ఆదిత్యుడిని, ఇతర దేవతలను, వేద పండితులను పూజించాలి. ఆదిత్య పూజ వల్ల నేత్ర సమస్యలు, శిరోరోగం, కుష్ఠురోగం తగ్గుతాయి. ఆదిత్యుడిని పూజించి వేద పండితులకు భోజనం పెట్టాలి. ఇలా ఒక రోజు నుంచి ఒక మాసం, ఒక సంవత్సరం లేక మూడు సంవత్సరాల పాటు రోగ తీవ్రతననుసరించి పూజ చేయాలి. దీనివల్ల సూర్యానుగ్రహప్రాప్తి కలుగుతుంది.

సోమవారం: సోమవారం సంపద కోరుకోనేవారు లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఆ రోజున పూజ తర్వాత వేద పండిత దంపతులకు నెయ్యితో భోజనం పెట్టాలి.

మంగళవారం: రోగాలు తగ్గటం కోసం మంగళవారం కాళీదేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో వేద పండితులకు భోజనం పెట్టాలి.

బుధవారం: బుధవారం పెరుగు అన్నాన్ని విష్ణువుకు నివేదించాలి. ఈ పూజ, నివేదనల వల్ల పూజ చేసిన వారి కుమారులు, మిత్రులు, భార్య తదితరులకు చక్కటి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.

గురువారం: గురువారం ఆయుష్షును, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవం ఎవరైతే వారికి పాలతో, నెయ్యితో చేసిన పదార్థాలను నివేదించాలి. వస్త్రాలను కూడా నివేదించి అర్చన చేయడం మేలు.

శుక్రవారం: శుక్రవారం కూడా ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధించి భోగాలను పొందవచ్చు. ఆ రోజున పూజానంతరం వేదపండితుల తృప్తి కోసం షడ్రుచులతో కూడిన భోజనాన్ని పెట్టాలి. స్త్రీల సంతృప్తి కోసం మంచి మంచి వస్త్రాలను బహూకరించాలి.

శనివారం: శనివారం రుద్రాది దేవతల ఆరాధన మంచిది. అపమృత్యువు నుంచి తప్పించుకోవాలనుకునేవారు ఆనాడు నువ్వులతో హోమం చేసి, నువ్వులను దానం ఇచ్చి, నువ్వులు కలిపిన అన్నంతో... పండితులకు భోజనం పెట్టాలి. ఇలా చేయటం వల్ల పూజ చేసిన వ్యక్తికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది.

ఇలా ఏడు రోజులలో... ఏ దేవతకు పూజ చేసినా.... ముందుగా సంతోషపడేది శివుడేనని శివపురాణం వివరిస్తోంది.
ఆ వారాలకు సంబంధించిన దేవతల ఆనందమే, తన ఆనందంగా శివుడు భావించుకొంటాడు. ఆ పూజాఫలాన్ని ఆ దేవతలుకాక, శివుడే స్వయంగా ఆ భక్తులకు ప్రసాదిస్తాడు. సృష్టి ప్రారంభంలో ముల్లోకాల అభివృద్ధి కోసం పాప,పుణ్యాలు రెండిటినీ శివుడు కల్పించాడు.
పాపం చేయటం లేదా? పుణ్యం చేయటమనేది మానవుల పూర్వజన్మ కర్మఫలాన్ని అనుసరించి ఉంటుంది. చేస్తున్నది పాపమని పెద్దలు లేదా గురువుల నుంచి తెలుసుకొని ఆ పాపకార్యాలను విడిచిపెట్టి, పుణ్య సంపాదన కోసం మనిషి ప్రయత్నం చేయాలి.
ఈ క్రమంలోనే కర్మఫలాన్ని అనుసరించి వచ్చిన కొన్ని రోగాలను, కష్టాలను తప్పించుకోవడం కోసం పూజలు రూపొందాయి. ఈ విషయాన్ని గ్రహించి, ఎవరు ఏ ఫలితం కావాలనుకుంటే.. ఆ రోజున,ఆ పూజ చేసుకోవచ్చన్నది శివపురాణం ఇస్తున్న సూచన.

సేకరణ.

Friday, 1 May 2020

ఏ ఏ సమయాలలో ఏ నామం జపించాలి

ఏ ఏ సమయాలలో ఏ నామం జపించాలి

ఔషధే చింతయేత్ విష్ణుం ,
భొజనే చ జనార్దనం
శయనే పద్మనాభం చ
వివాహే చ ప్రజాపతిం
యుద్ధే చక్రధరం దేవం
ప్రవాసే చ త్రివిక్రమం
నారాయణం తనుత్యాగే
శ్రీధరం ప్రియసంగమే
దుస్స్వప్నే స్మరగోవిందం
సంకటే మధుసూదనం
కాననే నారసింహం చ
పావకే జలశాయినం
జలమధ్యే వరాహం చ
పర్వతే రఘునందనం
గమనే వామనం చైవ
సర్వకాలేషు మాధవం
షోడశైతాని నామాని
ప్రాతరుత్థాయ యః పఠేత్
సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకే మహీయతే.

స్త్రీల సౌభాగ్యాన్ని కాపాడే స్తోత్రం

 స్త్రీల సౌభాగ్యాన్ని కాపాడే స్తోత్రం

1నమః కాంతాయ భర్త్రేచ శిరశ్చంద్ర స్వరూపిణే
నమశ్శాంతాయ దాంతాయ సర్వదేవాశ్రయాయచ

2::నమో బ్రహ్మస్వరూపాయ సతీప్రాణపరాయ చ
నమస్యాయచ పూజ్యాయ హృదాధారాయతే నమః

3::పంచప్రాణాధిదేవాయ చక్షుషస్తారకాయ చ
జ్ఞానాధారాయ పత్నీనాం పరమానంద రూపిణే

4::పతిర్బ్రహ్మా పతిర్విష్ణుః పతిరేవమహేశ్వరః
పతిశ్చనిర్గుణాధారో బ్రహ్మరూప..నమోస్తుతే

5::క్షమస్వ భగవాన్..దోషం జ్ఞానాజ్ఞానామృతం చయత్
పత్నిబంధో..దయాసింధో..దాసీదోషం క్షమస్వమే

6::ఇతిస్తోత్రం మహాపుణ్యం సృష్టాదౌ పద్మయాకృతం
సరస్వత్యాచ ధరయా గంగయా చ పురావ్రజ

7::సావిత్ర్యా చ కృతం పూర్వం బ్రహ్మణే చాపి నిత్యశః
పార్వత్యా చ కృతం భక్త్యాకైలాసౌ శంకరాయచ

బ్రహ్మవైవర్త పురాణంలోని ఈ స్తోత్రాన్నిలక్ష్మీ, సరస్వతి, గంగ, భూదేవి, సావిత్రి, పార్వతి మున్నగు దేవతా మూర్తులు పఠించారు

మానసా దేవి స్తోత్రమ్

మానసా దేవి స్తోత్రమ్

అత్యంత మహిమాన్వితమైన, మరియు కోరిన కోర్కెలు తీర్చి, సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదించు,
శ్రీ మానసా దేవి స్తోత్రం

ధ్యానం..
చారుచమ్పకవర్ణాభాం సర్వాఙ్గసుమనోహరామ్ ।
నాగేన్ద్రవాహినీం దేవీం సర్వవిద్యావిశారదామ్ ॥

శ్రీనారాయణ ఉవాచ..
నమః సిద్ధిస్వరుపాయై వరదాయై నమో నమః ।
నమః కశ్యపకన్యాయై శంకరాయై నమో నమః ॥ ౧॥

బాలానాం రక్షణకర్త్ర్యై నాగదేవ్యై నమో నమః ।
నమ ఆస్తీకమాత్రే తే జరత్కార్వ్యై నమో నమః ॥ ౨॥

తపస్విన్యై చ యోగిన్యై నాగస్వస్రే నమో నమః ।
సాధ్వ్యై తపస్యారుపాయై శమ్భుశిష్యే చ తే నమః ॥ ౩॥

॥ ఫలశ్రుతిః ॥

ఇతి తే కథితం లక్ష్మి మనసాయా స్తవం మహత్ ।
యః పఠతి నిత్యమిదం శ్రావయేద్వాపి భక్తితః ॥

న తస్య సర్పభీతిర్వై విషోఽప్యమృతం భవతి ।
వంశజానాం నాగభయం నాస్తి శ్రవణమాత్రతః ॥

॥ ఇతి శ్రీ మానసా దేవి స్తోత్రమ్ సంపూర్ణం ll

శ్రీసుబ్రహ్మణ్యదండకమ్


శ్రీసుబ్రహ్మణ్యదండకమ్

జయ వజ్రిసుతాకాన్త జయ శఙ్కరనన్దన
జయ మారశతాకార జయ వల్లీమనోహర

జయ భుజబలనిర్జితానేక విద్యాణ్డభీకారిసంగ్రామ కృత్తరకావాప్త గీర్వాణభీడ్వాన్త మార్తాణ్డ షడ్వక్త్ర గౌరీశ ఫాలాక్షి సమ్జాత తేజసముర్భూత దేవాపగా పత్మషణ్డోథిత స్వాకృతే, సూర్యకోటి ద్యుతే భూసురాణాంగతే,

శరవణభవ కృత్యకాస్తన్యపానాప్తషడ్వక్త్రపత్మాద్రిజాతాకరాంభోజ సంలాళనాతుష్ట కాళీసముత్పన్న వీరాగ్ర్యసంసేవితానేకబాలోచిత క్రీడితాకీర్ణవారాశిభూభృద్వనీసంహతే, దేవసేనరతే దేవతానాం వతే,

సురవరనుత దర్శితాత్మీయ దివ్యాస్వరూపామరస్తోమ సమ్పూజ్య కారాగృహావాప్తకజ్జాతస్తుత్యాశ్చర్యామాహాత్మ్య శక్త్యగ్రసంభిన్న శైలేన్ద్ర దైతేయ సంహార సన్తోషితామార్త్య సంకౢప్త దివ్యాభిషేకోన్నతే, తోషితశ్రీపతే,

సుమశరసమదేవరాజాత్మ భూదేవసేనాకర గ్రాహసమ్ప్రాప్త సంమోదవల్లీ మనోహారి లీలావిశేషేన్ద్రకోదణ్డభాస్వత్కలాపోచ్య బర్హీన్ద్ర వాహాధిరూఢాతిదీనం కృపాదృష్టిపాతేన
మాంరక్ష తుభ్యం నమో దేవ తుభ్యం నమః

శ్రీ సుబ్రహ్మణ్య దండకం సంపూర్ణమ్