Sunday, 10 May 2020

శ్రీ దక్షిణామూర్తి అష్టకం- తాత్పర్యము

శ్రీ దక్షిణామూర్తి అష్టకం- తాత్పర్యము

శ్రీ ఆది శంకరుల విరచితం


1. విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం
నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం
యధానిద్రయా
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే
వాద్వయం
తస్మై శ్రీగురు మూర్తయే
నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!

ఈ విశ్వము అద్దములో కనిపించే ప్రతిబింబము వంటిది.
నిజమే బ్రహ్మము.
బ్రహ్మమునకు రెండవది లేదు.
మనస్సు, ఇంద్రియములు, బుద్ధి కేవలం
ఆత్మ యొక్క ప్రతిబింబమును మాత్రమే
గ్రహించ గలుగుతున్నవి.
స్వయం ప్రకాశము (సాక్షాత్కారము) పొందిన పిమ్మటే ఆత్మ, బ్రహ్మ యొక్క గోచరమగును.
ఈ సాక్షాత్కారమునకై శ్రీ గురు స్వరూపుడైన దక్షిణామూర్తికి నా నమస్కారములు.

2. బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం
పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం
మాయావీవ విజృంభ త్యపి మయా యోగేవయః
స్వేచ్ఛయా
తస్మై శ్రీగురు మూర్తయే
నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!

వృక్షము మొలచుటకు ముందు బీజరూపమున నిక్షిప్తమై ఉన్నట్టు,
ఈ విశ్వము కూడా తనయందు అటులనే
కలిగిన ఆయనకు, తన మాయచే,
యోగుల వంటి సంకల్పముచే విశ్వమును
అనేక రూపములలో సృష్టించిన,
శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి
నా నమస్కారములు.

3. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం
భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసాయో
బోధయత్యాశ్రితాన్ యస్సాక్షాత్కరణాద్భవేన్నపురనావృత్తిర్భవాంభోనిధ
తస్మై శ్రీగురు మూర్తయే
నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!

ఎవరి ప్రకాశముచే ఈ మాయా ప్రపంచము నిజముగా కనిపిస్తున్నదో,
ఆయన, ఆత్మ జ్ఞానము పొందగోరువారికి వేదముల సారము (తత్త్వమసి) ద్వారా పరబ్రహ్మ తత్త్వమును బోధిస్తున్నాడు.
ఈ సంసార సాగరాన్ని అంతము చేసే,
శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి
నా నమస్కారములు.

4. నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప
ప్రభాభాస్వరం
జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా
బహిస్పందతే
జానామీతి తమేవ
భాంతమనుభాత్యేతత్సమస్తంజగత్
తస్మై శ్రీ గురు మూర్తయే
నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!

ఎవరి ప్రకాశము ఇంద్రియముల ద్వారా
కుండలో ఉన్న వెలుగు దాని రంధ్రముల ద్వారా వెలువడినట్లు వెలువడునో,
ఎవరి జ్ఞానము వల్లనే నేనే బ్రహ్మ అను
జ్ఞానము కలుగునో,
ఎవరి ప్రకాశము వలన విశ్వమంతా ప్రకాశించునో,
శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి
నా నమస్కారములు.

5. దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం
బుద్ధించశూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహ మితి భ్రాంతాభృశం
వాదినః
మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ
సంహారిణే
తస్మైశ్రీ గురుమూర్తయే
నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!

కొంత మంది తత్త్వవేత్తలు శరీరము, ఇంద్రియములు, ప్రాణము, శ్వాస మరియు శూన్యమును
ఆత్మగా వాదిస్తున్నారు.
అది జ్ఞానము లేని స్త్రీలు, పిల్లలు, గుడ్డివారు, బలహీనుల వాదన కన్నా లోకువైనది.
మాయ వలన కలిగే భ్రాంతిని తొలగించి సత్యమును తెలియచేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.

6. రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా
సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః
పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః
ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే
నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!

రాహువు వలన గ్రహణ సమయమున కాంతి తగ్గినట్టు కనిపించినా,
సూర్య తేజము ఎల్లప్పుడూ అంతే ప్రకాశముగా యుండును.
అటులనే, బుద్ధి యొక్క పూర్ణ శక్తి తన శక్తిని కోల్పోకుండా,
కేవలము నిద్రావస్థ యందు నిద్రాణమై యుండును. ఇదే విధముగా, ఆత్మ ప్రకాశము కేవలం మాయచే కప్పబడి యుండును.
ఎలాగైతే నిద్రనుండి మేల్కొనిన వ్యక్తి తాను అంతకుముందు నిద్రలోయున్నాను,
మరియు ఆ నిద్రలోని స్వప్నములు నిజము కావని గ్రహిస్తాడో, అలాగే,
ఆత్మ ప్రకాశము పొందిన వ్యక్తి తన అంతకు మునుపటి అజ్ఞాన స్థితిని అసత్యముగా గ్రహిస్తాడు. ఎవరి అనుగ్రహము వలన ఈ ఆత్మ ప్రకాశము కలుగునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.

7. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథాసర్వా
స్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమి
త్యంతస్స్ఫురంతం సదా స్వాత్మానం
ప్రకటికరోతిభజతాం యోముద్రయా భద్రయా
తస్మైశ్రీగురుమూర్తయే
నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!

ఎవరి ఉనికి అయితే దేహము, బుద్ధి యొక్క
వివిధ అవస్థల (దేహమునకు బాల్యం, యౌవనం, వృద్ధాప్యం; బుద్ధికి జాగ్రత్, చేతన, సుషుప్తా మొదలగునవి) వచ్చే మార్పులకు అతీతంగా ఉండునో,
జ్ఞాన ముద్ర (అభయ హస్తమున బొటన వేలు, చూపుడు వేలు కలిపిన ముద్రను జ్ఞాన ముద్ర అంటారు) ద్వారా ఆత్మ జ్ఞానమును కలుగ జేసే,
శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి
నా నమస్కారములు.

8. విశ్వం పశ్యతి కార్యకారణతయా
స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పిత్ర పుత్రాద్యాత్మనా
భేదతాః
స్వస్నే జాగ్రతి వాయు ఏష పురుషో మయా
పరిభ్రామితః
తస్మైశ్రీ గురుమూర్తయే
నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!

ఎవరి మాయ వలన ఈ ప్రపంచమున చేతన, స్వప్నావస్థల యందు అనేక రూపముల
అనుభూతి కలుగుతున్నదో (గురువు, శిష్యుడు, తండ్రి కొడుకు మొదలగునవి),
శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి
నా నమస్కారములు.

9. భూరంభాం స్యనలోనిలోబర
మహర్నాధోపిమాంశుః పుమాన్
నిత్యభాతి చరాచరాత్మక మిదం యస్మైచ
మూర్త్యష్టకం
.నాన్యత్కించ నవిద్యతే విమృశతాంయస్మాతత్పర
స్వాదిభో
తస్మై గిరి మూర్తయే
నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!

ఎవరి సూక్ష్మ, అష్ట పరిణామములు (రూపాంతరములు) ఈ చరాచారమును సృష్టించుచున్నవో,
ఎవరి అనుగ్రహము వలన ఈ సృష్టులు అన్ని అంతర్ధానమై ఆత్మయే బ్రహ్మము అను సత్యమును తెలుపబడుతున్నదో,
శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి
నా నమస్కారములు.

10. సర్వాత్వమితి స్ఫుటీకృత మిదం
యస్మాదముష్మిన్ స్తవే తేనాస్వ శ్రవణాత్త దర్థ
మననా ద్ధ్యానా చ్ఛ సంకీర్తనాత్
సర్వాత్మత్వ మహావిభూతి సహితం
స్వాదీశ్వత్వం స్వతః
సిద్ధేత్తత్పురష్టధా పరిణతం చైశ్వర్య
మవ్యాహతమ్!!

ఈ స్తోత్రము ఆత్మ యొక్క
సర్వ వ్యాపకా తత్త్వమును తెలుపుచున్నది.
దీని మననము, పఠనం, ధ్యానము వలన
శిష్యుడు ఆత్మ సంయోగం చెంది,
ఈ విశ్వము, ఆత్మ యొక్క ఏకత్వమును తెలుసుకొని ఎనిమిది పరిణామముల సారమగును.
సంసార బంధములు, జనన మరణ ఋణములు తొలగించే, వట వృక్షము కింద ఆసీనుడై యోగులకు, మునులకు జ్ఞానోపదేశము చేసే వానిగా
ధ్యానించ బడే, త్రిలోక వంద్యుడైన
శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.
స్వస్తి

ఓం నమః శివాయ 

Saturday, 9 May 2020

శివ_ప్రదోష_స్తోత్రమ్

శివ_ప్రదోష_స్తోత్రమ్

జయ దేవ జగన్నాథ జయ శఙ్కర శాశ్వత |
జయ సర్వసురాధ్యక్ష జయ సర్వసురార్చిత ||1||

జయ సర్వగుణాతీత జయ సర్వవరప్రద ||
జయ నిత్య నిరాధార జయ విశ్వమ్భరావ్యయ ||2||

జయ విశ్వైకవన్ద్యేశ జయ నాగేన్ద్రభూషణ |
జయ గౌరీపతే శమ్భో జయ చన్ద్రార్ధశేఖర ||౩||

జయ కోఠ్యర్కసఙ్కాశ జయానన్తగుణాశ్రయ |
జయ భద్ర విరూపాక్ష జయాచిన్త్య నిరఞ్జన ||4||

జయ నాథ కృపాసిన్ధో జయ భక్తార్తిభఞ్జన |
జయ దుస్తరసంసారసాగరోత్తారణ ప్రభో ||5||

ప్రసీద మే మహాదేవ సంసారార్తస్య ఖిద్యతః |
సర్వపాపక్షయం కృత్వా రక్ష మాం పరమేశ్వర ||6||

మహాదారిద్ర్యమగ్నస్య మహాపాపహతస్య చ ||
మహాశోకనివిష్టస్య మహారోగాతురస్య చ ||7||

ఋణభారపరీతస్య దహ్యమానస్య కర్మభిః ||
గ్రహైఃప్రపీడ్యమానస్య ప్రసీద మమ శఙ్కర ||8||

దరిద్రః ప్రార్థయేద్దేవం ప్రదోషే గిరిజాపతిమ్ ||
అర్థాఢ్యో వాఽథ రాజా వా ప్రార్థయేద్దేవమీశ్వరమ్ ||9||

దీర్ఘమాయుః సదారోగ్యం కోశవృద్ధిర్బలోన్నతిః ||
మమాస్తు నిత్యమానన్దః ప్రసాదాత్తవ శఙ్కర ||10||

శత్రవః సంక్షయం యాన్తు ప్రసీదన్తు మమ ప్రజాః ||
నశ్యన్తు దస్యవో రాష్ట్రే జనాః సన్తు నిరాపదః ||11||

దుర్భిక్షమారిసన్తాపాః శమం యాన్తు మహీతలే ||
సర్వసస్యసమృద్ధిశ్చ భూయాత్సుఖమయా దిశః ||12||

ఏవమారాధయేద్దేవం పూజాన్తే గిరిజాపతిమ్ ||
బ్రాహ్మణాన్భోజయేత్ పశ్చాద్దక్షిణాభిశ్చ పూజయేత్ ||1౩||

సర్వపాపక్షయకరీ సర్వరోగనివారణీ |
శివపూజా మయాఽఽఖ్యాతా సర్వాభీష్టఫలప్రదా ||14||

ఇతి ప్రదోషస్తోత్రం సమ్పూర్ణమ్ ||

శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రం

శ్రీ నృసింహ స్వామి వారి ద్వాదశ నామ స్తోత్రం

 మహా మహిమాన్వితం శక్తివంతం,
ఈస్తోత్రాన్ని భక్తిగా పఠిస్తే
స్వామివారు మనకు రక్షా కవచంలా ఉండి కాపాడతారు.
అతి భయంకర వ్యాధులు రుగ్మతులు నశిస్తాయి,భయంతొలగుతుంది.

 శ్రీ నృసింహ ద్వాదశ నామ స్తోత్రం

ప్రథమంతు మహాజ్వాలో ద్వితీయం తు ఉగ్రకేసరీ ।

తృతీయం తు వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః ॥

పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః ।

సప్తమో యాతుహంతా చ అష్టమో దేవవల్లభః ॥

నవమం ప్రహ్లాద వరదో దశమోऽనంత హస్తకః ।

ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తదా ॥

ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః ।

మంత్రరాజ ఇతి జ్ఞాతం సర్వపాప వినాశనమ్ ॥

క్షయాపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం ।

రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే ॥

గిరిగహ్వర అరణ్యే వ్యాఘ్ర చోరామయాదిషు ।

రణేచ మరణేచైవ శమదం పరమం శుభమ్ ॥

శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధి బంధనాత్ ।

ఆవర్తయత్ సహస్రం తు లభతే వాంఛితం ఫలమ్ ॥

 
ఓం శ్రీ లక్ష్మి నృసింహాయ నమః.

సేకరణ...

Thursday, 7 May 2020

దేవుని ప్రసాదములు రకాలు

దేవుని ప్రసాదములు రకాలు

మనం చేసే పూజలు రెండు రకాలుగా చేసుకుంటాం.
ఇంట్లో దేవునికి పూజ దేవాలయాల్లోనూ పూజలు చేస్తూ ఉంటాం.
ఇంట్లో చేసే పూజలు దేవతా కార్యాలు కిందకు వస్తాయి.
ఇంటి యజమాని పెద్దల సహకారంతో ఇక్కడ పూజలు చేస్తాం.
దేవాలయాలలో పూజల విషయానికి వస్తే కుటుంబ సభ్యులు మిత్రులు బంధువులతో వెళ్లి దేవుని పూజ చేస్తాము.
పూజలు చేసిన తర్వాత దేవాలయ అర్చకులు భక్తులకు ప్రసాదాలు అందజేస్తారు.
దైవ ప్రసాదం పేరుతో తీర్థాలు, భక్ష్య ప్రసాదాలు , పుష్ప ప్రసాదాలు, ఫల, అన్న, రక్ష ,లేపన, మృత్తిక ,ఇన్ని రకాల రూపాలలో ప్రసాదాలు ఇస్తారు..
ఫల ,అన్న, భక్ష ప్రసాదాలను వెంటనే అక్కడి తినొచ్చు..
కుంకుమ అయితే ప్రతిరోజు నుదుటిన ధరించవచ్చు అయితే శివుని గుడి లో ఇచ్చే బిల్వ పత్ర ప్రసాదాన్ని ప్రతిరోజూ ఉపయోగించలేము.
ధరించడం పై నిషేధం ఉంది..

ఇటువంటి సందర్భాల్లో ఏం చేయాలి? ప్రసాదాలు లో ఎన్ని రకాలు ఉంటాయి? ఈ ప్రసాదాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించాలి ?ఈ ప్రసాదాలతో ఎటువంటి ఫలితం లభిస్తుంది? ప్రసాదాలు స్వీకరించే విషయంలో చేయవలసిన అంశాలు కొన్ని

ప్రసాదాలలో రెండు రకాల ప్రసాదాలు

1. భక్ష్య ప్రసాదం
2. తీర్థ ప్రసాదం

తీర్థప్రసాదాలలో నాలుగు రకాలు ఉంటాయి..

1. జల తీర్ధం.
2. కాషాయ తీర్థం.
3. పంచామృత అభిషేక తీర్థం.
4. పానక తీర్థం.

జల తీర్ధం

ఈ తీర్థం సేవించడం ద్వారా అకాల మృత్యువు సర్వరోగాలు నివారించబడతాయి అన్ని కష్టాలు దుఖాలు తొలగిపోతాయి.. బుద్ధి అధర్మం వైపు పయనించకుండా అడ్డు పడుతుంది..

కషాయ తీర్థం

ఈ తీర్థాన్ని కొల్హాపురం లోని శ్రీ మహాలక్ష్మి దేవాలయం, కొల్లూరు మూకాంబిక దేవాలయం, హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాల మాలిని దేవాలయం, అస్సాంలోని కామాఖ్య దేవాలయములో ఇస్తారు రాత్రి పూజ తర్వాత తీర్థాన్ని కషాయం రూపంలో పంచుతారు ..
వీటిని సేవించడం ద్వారా కనిపించే కనిపించని రోగాలు త్వరగా నయం అవుతాయి

పంచామృత అభిషేక తీర్థం

పంచామృత అభిషేకం ని స్వీకరించడం ద్వారా చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి కావడం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది..

పానక తీర్థం

శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి అహోబిలం నరసింహస్వామి దేవునికి పానకం నైవేద్యంగా పెట్టడం తో పానకాల స్వామి పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినార్జించారు..కారణం స్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్థంగా పంచుతారు..
పానక తీర్థాన్ని సేవిస్తే
దేహంలో ఉత్సాహం ఎక్కువవుతుంది కొత్త చైతన్యం వస్తుంది..
దేహంలో ఉండే ఉష్ణం సమస్థితికి వచ్చే విధంగా చేస్తుంది.
రక్తపోటు ఉన్న వారికి తల తిరగడం నోరు ఎండిపోయినట్లు ఉండటం జరగదు
ఎముకలకు సంబంధించిన వ్యాధులు నయం అవుతాయి..
నీరసం దరిచేరదు ఆకలి బాగా వేస్తుంది ..
హార్మోన్లు వృద్ధి చెందుతాయి..
జీవితంలో శత్రువుల బాధ కలుగదు..
బుద్ధి చురుకుగా పనిచేస్తుంది ..
జ్ఞాపక శక్తి పెరుగుతుంది..

భక్ష్య ప్రసాదం

దేవునికి భక్తులు ప్రసాదం రూపంలో భక్ష్యాలను అందిస్తారు .
వీటిలో లడ్డు , వడల హారం, దోసెల నైవేద్యం ,బెల్లం దోస నైవేద్యం ,చేగోడీ ల నైవేద్యం, జంతికల నైవేద్యం ,బొబ్బట్లు నైవేద్యం ,అరిసెల నైవేద్యం, రవ్వ లడ్డు నైవేద్యం మొదలైన నైవేద్యాలు ఉన్నాయి.‌

వీటిని నైవేద్యంగా దేవుడికి ఇవ్వడం ద్వారా ఎటువంటి శుభాలు కలుగుతాయి అంటే

దేవునికి
1. లడ్డులను నైవేద్యంగా ఉంచితే ఇంట్లో శుభకార్యాలు జరిగి అంతా శుభమే జరుగుతుంది..
2. వడల హారాన్ని లేదా గారెలను నైవేద్యంగా పెడితే ఇంట్లో అన్ని రకాల కలహాలు నివారణ అవుతాయి. మనసు కూడా స్థిరంగా ఉంటుంది..
3. దోసెను నైవేద్యంగా పెడితే ఇంట్లో
శాంతి ఉంటుంది.
శాంతియుత వాతావరణం నెలకొంటుంది .
ఇంట్లో ఎవరికైనా నిద్ర రాకుంటే చక్కగా నిద్రపడుతుంది..
4. బెల్లం దోసెను నైవేద్యంగా ఉంచడం
ద్వారా చక్కెర వ్యాధి ఉన్నవారు త్వరగా కోలుకుంటారు. చదువుకునే వారికి విద్య చక్కగా అబ్బుతుంది. మంచి జ్ఞాపకశక్తి వస్తుంది..
5. శనగపిండి లడ్డు నైవేద్యంగా ఉంచితే మరుపు దరిచేరదు..
6. జంతికలను నైవేద్యంగా పెట్టడం ద్వారా బరువైన లోహాలు ఇనుప వ్యాపారం చేసేవారికి వ్యాపారం వృద్ధి చెందుతుంది..
7. చేగోడీలు నైవేద్యంగా ఉంచితే ఇంట్లో చాలా రోజులుగా నిలిచి ఉన్న పనులు వేగంగా జరుగుతాయి..
8. దేవునికి బొబ్బట్లు నైవేద్యంగా ఉంచితే ఇంట్లో కుజ దోషాలు నివారణ కలిగి త్వరగా వివాహాలు జరుగుతాయి..
9. అప్పాలు లేదా అరిసెలను నైవేద్యంగా ఉంచితే పెద్దలు పాపాలు తొలగిపోతాయి..
10. రవ్వలడ్డు నైవేద్యంగా ఉంచితే ఆలోచనల వల్ల కలిగే తలనొప్పి,కంటికి సంబంధించిన నొప్పి, అధిక రక్తపోటు సాధారణ స్థితికి వస్తాయి..

సేకరణ....

దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి

దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి

దత్తపరమైన జ్ఞానం చెప్పుకోవడం,
వినడం అనే క్రియవల్ల అన్ని అమంగళములు నశించి పోతాయి అంటూ దత్తుడి మహిమ చెప్పుకోవడం వల్ల వచ్చే ఫలితం చెప్తూ వేదధర్ముడు దీపకునికి ఒక 108 అద్భుత దత్తనామములు చెప్తాడు. ఆ దత్తనామాలు నిత్యానుష్టానం చేసేవాడిని కవచంలా స్వామి కాపాడతాడు.

దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి

ఓం శ్రీ దత్తాయ నమః
ఓం దేవదత్తాయ నమః
ఓం బ్రహ్మదత్తాయ నమః
ఓం శివదత్తాయ నమః
ఓం విష్ణుదత్తాయ నమః
ఓం అత్రిదత్తాయ నమః
ఓం ఆత్రేయాయ నమః
ఓం అత్రివరదాయ నమః
ఓం అనసూయాయ నమః
ఓం అనసూయాసూనవే నమః 10
ఓం అవధూతాయ నమః
ఓం ధర్మాయ నమః
ఓం ధర్మపరాయణాయ నమః
ఓం ధర్మపతయే నమః
ఓం సిద్ధాయ నమః
ఓం సిద్ధిదాయ నమః
ఓం సిద్ధిపతయే నమః
ఓం సిధ్ధసేవితాయ నమః
ఓం గురవే నమః
ఓం గురుగమ్యాయ నమః 20
ఓం గురోర్గురుతరాయ నమః
ఓం గరిష్ఠాయ నమః
ఓం వరిష్ఠాయ నమః
ఓం మహిష్ఠాయ నమః
ఓం మహాత్మనే నమః
ఓం యోగాయ నమః
ఓం యోగగమ్యాయ నమః
ఓం యోగాదేశకరాయ నమః
ఓం యోగపతయే నమః
ఓం యోగీశాయ నమః 30
ఓం యోగాధీశాయ నమః
ఓం యోగపరాయణాయ నమః
ఓం యోగిధ్యేయాంఘ్రి పంకజాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం దివ్యాంబరాయ నమః
ఓం పీతాంబరాయ నమః
ఓం శ్వేతాంబరాయ నమః
ఓం చిత్రాంబరాయ నమః
ఓం బాలాయ నమః
ఓం బాలవీర్యాయ నమః 40
ఓం కుమారాయ నమః
ఓం కిశోరాయ నమః
ఓం కందర్ప మోహనాయ నమః
ఓం అర్ధాంగాలింగితాంగనాయ నమః
ఓం సురాగాయ నమః
ఓం వీరాగాయ నమః
ఓం వీతరాగాయ నమః
ఓం అమృతవర్షిణే నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం అనుగ్రహరూపాయ నమః 50
ఓం స్ధవిరాయ నమః
ఓం స్ధవీయసే నమః
ఓం శాంతాయ నమః
ఓం అఘోరాయ నమః
ఓం మూఢాయ నమః
ఓం ఊర్ధ్వరేతసే నమః
ఓం ఏకవక్త్రాయ నమః
ఓం అనేకవక్త్రాయ నమః
ఓం ద్వినేత్రాయ నమః
ఓం త్రినేత్రాయ నమః 60
ఓం ద్విభుజాయ నమః
ఓం షడ్భుజాయ నమః
ఓం అక్షమాలినే నమః
ఓం కమండలధారిణే నమః
ఓం శూలినే నమః
ఓం శంఖినే నమః
ఓం గదినే నమః
ఓం ఢమరుధారిణే నమః
ఓం మునయే నమః
ఓం మౌనినే నమః 70
ఓం శ్రీ విరూపాయ నమః
ఓం సర్వరూపాయ నమః
ఓం సహస్రశిరసే నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రబాహవే నమః
ఓం సహస్రాయుధాయ నమః
ఓం సహస్రపాదాయ నమః
ఓం సహస్రపద్మార్చితాయ నమః
ఓం పద్మహస్తాయ నమః
ఓం పద్మపాదాయ నమః 80
ఓం పద్మనాభాయ నమః
ఓం పద్మమాలినే నమః
ఓం పద్మగర్భారుణాక్షాయ నమః
ఓం పద్మకింజల్కవర్చసే నమః
ఓం జ్ఞానినే నమః
ఓం జ్ఞానగమ్యాయ నమః
ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః
ఓం ధ్యానినే నమః
ఓం ధ్యాననిష్ఠాయ నమః
ఓం ధ్యానస్ధిమితమూర్తయే నమః 90
ఓం ధూళిదూసరితాంగాయ నమః
ఓం చందనలిప్తమూర్తయే నమః
ఓం భస్మోద్ధూళితదేహాయ నమః
ఓం దివ్యగంధానులేపినే నమః
ఓం ప్రసన్నాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ప్రకృష్టార్ధ ప్రదాయ నమః
ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః
ఓం వరదాయ నమః
ఓం వరీయసే నమః 100
ఓం బ్రహ్మణే నమః
ఓం బ్రహ్మరూపాయ నమః
ఓం విశ్వరూపిణే నమః
ఓం శంకరాయ నమః
ఓం ఆత్మనే నమః
ఓం అంతరాత్మనే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం శ్రీ దత్తాత్రేయాయ పరబ్రహ్మణే
నమో నమః 108

ఓం శ్రీ దత్తాయనమః ఓం దేవదత్తాయనమః తో ప్రారంభమయ్యే ఈ దివ్య నామములు దివ్యదృష్టితో దత్తాత్రేయ స్వామి ని దర్శించి వేద ధర్ముడు దీపాకునికి చెప్పాడు.

శ్రీ దత్త నామ కవచం


ఓం శ్రీ దత్తాయనమః ఓం దేవదత్తాయనమః తో ప్రారంభమయ్యే ఈ దివ్య నామములు దివ్యదృష్టితో దత్తాత్రేయ స్వామి ని దర్శించి వేద ధర్ముడు దీపాకునికి చెప్పాడు.
తరువాత ఈ నామములను కవచముగా ఎలా చేసుకొనవలెనో వివరించాడు. ఈ కవచమును ఉదయము, సాయంత్రం శ్రద్ధగా చదివిన పాపములనుంచి విముక్తి కలుగును అని శిష్యునకు కూడా చెప్పెను. ఈ నామములు ఆచార్య భరద్వాజ మాష్టరు గారు వ్రాసిన దత్తమహత్యం లో చివరలో కలవు.

శ్రీ దత్త నామ కవచం

1. ఓం కారాది నమోంతానం! నామ్నామష్టోత్తరం శతమ్!
శ్రద్ధయా యః పఠేన్నిత్యం! త్రిసంధ్యం నియతః సుధీః॥

భావము:: వేదధర్ముడు ఇలా చెప్పారు - ఓం కారంతో మొదలు పెట్టి నమః శబ్దమును చివర చేర్చి నూట ఎనిమిది నామములను విద్వాంసుడు ఏకాగ్రతతో మూడు సంధ్యా కాలములలో శ్రద్ధగా చదవాలి.

2. సర్వపాప విముక్తాత్మా! జాయతే విమలాంతరః !
భుక్త్యా యథేప్సితాన్భోగాన్! ప్రేత్య బ్రహ్మణి లీయతే ॥

భావము:: ఈ నామములు పఠించిన చో పాపచింతనలనుండి విడివడి స్వచ్ఛమైన మనస్సు కలవాడై. కోరిన కోర్కెలు తీరి సమస్త సుఖములను అనుభవించును . పరలోకమున శ్రీ దత్తునియందు ఐక్యము చెందును.

3. భక్తరక్షాక్షణో దేవః!స్మృతః సేవా స్వవేశ్మని!
స్వభోజ్యస్యార్పణం దానం! ఫలమింద్రాది దుర్లభమ్ ॥

భావము:: భక్తరక్షణ కొరకు ఎల్లప్పుడూ దత్తుడు సిద్ధంగా వుండును. భక్తులను రక్షించుటయే ఆయనకు ఆనందం. మన ఇంట్లోనే వుండి ఆయనను తలచినా, భోజనమునకు ముందు ఆ స్వామికి భోజనం అర్పించి తినినా, మనకు దానఫలము లభింస్తుంది. ఇంద్రాది దేవతలకు కూడా దుర్లభమైన ఐశ్వర్యమును ఇచ్చును.

4. య ఏతైర్నామభిర్దివ్యైః! కవచం ధారయేత్కృతీ!
రాజవేశ్మని కాంతారే! దుర్గాదిషు మహాభయే ॥

భావము:: ఈ అష్టోత్తర శతనామములు ఎవరు కవచముగా ధరించెదరో వారు కృతార్థులు అగుదురు. రాజభవనమునందు,అరణ్య ములందు,మహాభయములందు ఈ నామములతో కవచముగా ధరించిన విజయము పొందుతారు.

5. శత్రుచోరభయాకీర్ణే! శ్మశానే ప్రేతదూషితే!
న భయం విద్యతే తస్య! దృష్ట్వా తం విద్రువేద్భయమ్॥

భావము:: శత్రువులు, దొంగలు, శ్మశానములయందు,భయములువుండు చోట ఈ నామములు కవచముగా కలిగిన వానిని చూసి భయపడి అన్ని పారిపోవును.

6. శిరో లలాటం నేత్రేచ! భ్రూమధ్యం చ భ్రువౌ తథా!
నాసే కర్ణౌ తథోష్ఠౌ చ! హనుః కంఠం కకుత్తథా ॥

భావము:: శిరస్సు, నుదురు, నేత్రములు, కనుబొమల మధ్యభాగం,కనుబొమలు, ముక్కు, చెవులు, పెదవులు, దవడలు, కంఠము, ఈ నామములు చెప్పుచూ తాకవలెను. అక్కడ వున్న రోగములు పోతాయి.

7 . దౌతాంఘ్రిహస్త ఆచమ్య! స్మృత్యా దత్తం న్యసేత్సుధీః!
కరాంగన్యాసౌ విన్యస్య!షడ్భిః ష్షడ్భిః తతః క్రమాత్ ॥

భావము:: చేతులు, కాళ్ళు కడుగుకొని కేశవాది నామాలతో ఆచమనం చేసి దత్తాత్రేయుని స్మరించి ఈ అష్టోత్తర శతనామ కవచమును చదువుకొనవలెను. అంగన్యాస, కరన్యాసములు ఆరేసి నామములతో చేయవలెను.

8. జత్రుస్తనౌ చ చక్షుశ్చ! హృదయం నాభిరేవచ!
మూలాధార స్ఫిచావూరూ! జానుజంగాశ్చ గుల్ఫయౌః ॥

భావము:: మూపు సంధులు, వక్షస్థలము, నేత్రములు, నాభి, మూలాధార ము, పిరుదులు, కటిప్రదేశము,తొడలు, మోకాళ్ళు, పిక్కలు, గిలకలు.

9. ప్రపదౌ పాదమూలాభ్యం ! తథా పాదతలే ఉభే!
పాదాగ్రాంగుష్ఠయో శ్చైవ ! హస్తాగ్రాభ్యాం తథైవ చ ॥

భావము: మోకాళ్ళు, పాదమూలములు , పాదప్రదేశములు,బొటనవేళ్ళు,చేతుల యొక్క అగ్రభాగములకు,నామములతో కవచము చేసుకొనవలెను.నామ ప్రభావముతో ఆయా అవయము ల రోగములు పోవును మరియు కవచము వలె రక్షణ ఇచ్చును.

10. స్కంధయోర్బుజమూలాభ్యాం ! సంధిభ్యాం కరయోః పృథక్!
అంగుల్యం గుష్ఠయోశ్చైవ! హస్తాగ్రాభ్యాం తథైవ చ ॥

భావము: భుజస్కంధముల యందు,భుజముల మూలలయందు,హస్తముల సందులయందు,వ్రేళ్ళయందు, హస్తాగ్రములయందు .

11.హృదయాద్దస్త పాదాగ్ర! పర్యంతవ్యాపకం న్యసేత్!
దశేంద్రియాంతః కరణ! చతుష్టయధృతంన్యసేత్ ॥

భావము:: హృదయము నుంచి హస్తాది పాదాగ్రముల వరకు ఈ నామకవచమును కప్పవలెను. పది ఇంద్రియాలందు, మనో,బుద్ధి, చిత్త, అహంకారముల యందు ఈ కవచమును ఉంచవలెను.

12. రోమస్వేకం చ హృదయం! స్పృష్ట్వా నామాని పంచ చ !
జేద్భక్త్యా స్మరన్దేవం! కృతకృత్యో భవేన్నరః ॥

భావము: రోమమలయందు,హృదయము నందు స్పృశించి అయిదు నామములను చెప్పవలెను. ఇట్లు భక్తి తో తన అవయముల అన్నిటి అందును ఆ దేవదేవుని స్మరించుచూ ఆ స్వామి నామములను జపించవలెను.

జపమునకు ముందు చేయవలసిన ధ్యాన శ్లోకం:::
పీతాంబరాలంకృత పృష్టభాగం! భస్మావగుంఠామలరుక్మ దేహమ్!
విద్యుత్సదాపింగ జటాభిరామం! శ్రీ దత్తయోగీశమహంనతోస్మి ॥

భావము:: పట్టు వస్త్రాలు కట్టుకొన్న, విభుతితో పూయబడిన బంగారపు శరీరము కలవాడు, మెరుపు తీగ వలె పచ్చనైన జడలతో మనోహరమైన శ్రీ దత్తయోగీశ్వరునికి అన్నివేళలా వంగి వంగి నమస్కరిస్తాను.

పితృ దేవతల ఆశీర్వచనం కోసం

పితృ దేవతల ఆశీర్వచనం కోసం

ఏ నక్షత్రం నాడు
అమ్మానాన్నలను/కాలం చేసిన పెద్దలను పూజిస్తే ఏ ఫలం దక్కుతుందో కూడా ఈ విధంగా మహాభారతం, కూర్మపురాణం చెబుతున్నాయి.

1)అశ్విని: వాహనాలు కావాలనుకున్న వారు అశ్వినీ నక్షత్రం ఉన్నప్పుడు తల్లి తండ్రుల సేవ చేయాలి.

2)భరణి: ఆయువు కావలసిన వారు భరణిలో అమ్మానాన్నలను అర్చించాలి.

3)కృత్తిక: అగ్నిసహితంగా కుమారునితో కలసి పితరులను కృత్తిక ఉన్నప్పుడు అర్చిస్తే రోగశోకాలు లేనివాడవుతాడు.

4)రోహిణి: సంతానం కావాలనుకున్నవారు తమ పితరులను రోహిణీ నక్షత్రం ఉన్నప్పుడు ప్రార్థించాలి.

5)మృగశిర: బ్రహ్మతేజస్సు కలుగుతుంది.

6)ఆర్ద్ర: శౌర్యం కావాలనుకున్నవారు ఆరుద్రా నక్షత్రం ఉన్నప్పుడు అమ్మానాన్నలను పార్వతీపరమేశ్వరులుగా అర్చించాలి. అంటే పోలీసులు, సైన్యం, అగ్నిమాపకదళం, భద్రతాదళాలు, అంగరక్షకులు వంటి వృత్తులలోని వారు ఈ రోజు తమ తల్లితండ్రులను పూజించాలి. దీని వల్ల శూరత్వం కలిగి తమ శౌర్యవృత్తుల్లో రాణిస్తారు.

7)పునర్వసు: ధనం, భూమి కావాలనుకున్న వారు పునర్వసులో పెద్దలను సేవించాలి.

8)పుష్యమి: తాతముత్తాలను పుష్యమి నాడు సేవిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, పుష్టికలుగుతుంది.

9)ఆశ్రేష: ఈ నక్షత్రం ఉన్నప్పుడు అమ్మానాన్నలను ప్రసన్నం చేసుకుంటే ధీరులైన పుత్రసంతానం, సర్వ కోరికలూ తీర్చే కుమారులు కలుగుతారు.

10)మఖ: తన దాయాదులలో మేటి కావాలను

కున్న వారు మఖనాడు పితరుల అర్చన చేయాలి.

11)పుబ్బ: పాపనాశనం, సౌభాగ్యం పుబ్బ వల్ల కలుగుతాయి.

12)ఉత్తర: సంతానధనాలు ఉత్తరానక్షత్రం వల్ల కలుగుతాయి.

13)హస్త:తన కులంలో శ్రేష్ఠత్వం హస్తా నక్షత్రం ద్వారా పొందుతారు.

14)చిత్త: అందమైన కొడుకులు కావాలనుకున్న వారు చిత్తా నక్షత్రంలో పెద్దలను సేవిస్తే సౌందర్యంకల పుత్రులు అనేకం కలుగుతారు.

15)స్వాతి: వ్యాపారాల వృద్ధిని స్వాతి కలిగిస్తుంది. (ఉద్యోగాలలో వృద్ధి కూడా కలుగుతుంది.)

16)విశాఖ: స్వర్ణరజతాలు పొందవచ్చు. అలాగే అనేక మంది పుత్రులు విశాఖ నక్షత్రం నాడు అమ్మానాన్నలను సేవిస్తే కలుగుతాయి.

17)అనూరాధ: రాజ్యాధికారం, మంచి మిత్రులను అనూరాధ ద్వారా పొందవచ్చు.

18)జ్యేష్ఠ: సర్వసమృద్ధి, కోరుకున్న రంగంలో అధిపతి కావాలంటే జ్యేష్ఠా నక్షత్రంలో పితరుల అర్చన చేయాలి.

19)మూల: ఆరోగ్యం, చేసే కృషి ఫలించాలంటే మూలా నక్షత్రంలో అమ్మానాన్నలకు మ్రొక్కాలి.

20)పూర్వాషాఢ: సమృద్దీ కీర్తిప్రతిష్ఠలు కలుగడానికి పూర్వాషాఢలోని పితృదేవతార్చన తోడుపడుతుంది.

21)ఉత్తరాషాఢ: నిశ్శోకవంతుడు, శుభగృహం (మంచి ఇల్లు) పొందాలి అంటే ఉత్తరాషాఢలో తాతముత్తాల ఆశీర్వచనాలు పొందాలి.

22)శ్రవణం: బ్రతికినన్నాళ్ళూ శ్రేష్ఠత్వం అనంతరం స్వర్గప్రాప్తి శ్రవణం నాటి మాతాపితరుల సేవ కలిగిస్తుంది.

23)ధనిష్ఠ: రాజ్యప్రాప్తి. నేడు రాజకీయాల్లో రాణించాలనుకున్న వారు ధనిష్ఠ నక్షత్రం ఉన్నప్పుడు అమ్మానాన్నలను సేవించాలి. వారికి పదవీయోగం కలుగుతుంది.

24)శతభిషం:వైద్యులు హస్తవాసి కోసం అమ్మానాన్నలను శతభిష నక్షత్రం ఉన్న సమయంలో అర్చించాలి. మహాబలవంతులు అవుతారు.

25)పూర్వాభాద్ర: మేకలు గొర్రెలు వంటివి పొందవచ్చు. అంటే యానిమల్ హజ్బెండరీస్ కు చెందిన వారు పూర్వాభాద్రలో పితరులను అర్చించాలి. అలా అర్చిస్తే వారి అనుగ్రహంతో పశువుల మందలు వృద్ధిపొందుతాయి. అంటే ఇవి వ్యవసాయప్రధానులైన శూద్రవైశ్యులకు కూడా ఇవి చెప్పారని తెలుసుకోవాలి.

26)ఉత్తరాభాద్ర: గోసంపద వృద్ధి అవుతుంది.

27)రేవతి: వెండి బంగారం తప్ప ఇతర వజ్రవైఢూర్యాదులు పొందాలంటే రేవతిలో అమ్మానాన్నల ఆశీర్వాదాలు పొందాలి.

సేకరణ

దత్తాత్రేయ స్తోత్రము

దత్తాత్రేయ స్తోత్రము

జటాధరం పాండురంగం, శూలహస్తం కృపానిధిమ్‌
సర్వరోగహరం దేవం, దత్తాత్రేయ మహం భజే
జగదుత్పత్తికర్త్రే చ, స్థితి సంహారహేతవే
భవనాశ విముక్తాయ దత్తాత్రేయ! నమోస్తుతే
జరాజన్మవినాశాయ, దేహశుద్ధికరాయ చ
దిగంబర! దయామూర్తే ! దత్తాత్రేయ! నమోస్తుతే
కర్పూరకాంతిదేహాయ, బ్రహ్మమూర్తిధరాయ చ
వేదశాస్త్ర పరిజ్ఞాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
హ్రస్వదీర్ఘకృత స్థూల నామగోత్రవివర్జిత !
పంచభూతైకదీప్తాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
యజ్ఞభోక్త్రే చ యజ్ఞాయ, యజ్ఞరూపధరాయ చ
యజ్ఞప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ ! నమోస్తుతే
ఆదౌ బ్రహ్మా హరిర్మధ్యే హ్యంతే దేవ స్సదాశివ:
మూర్తిత్రయస్వరూపాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
భోగాలయాయ భోగాయ, యోగయోగ్యాయ ధారిణి
జితేంద్రియ జితజ్ఞాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
దిగంబరాయ దివ్యాయ, దివ్యరూప ధరాయ చ
సదోదిత పరంబ్రహ్మ దత్తాత్రేయ ! నమోస్తుతే
జంబూద్వీపే మహాక్షేత్రే, మాతా పురనివాసినే
జయమానసతాం దేవ ! దత్తాత్రేయ ! నమోస్తుతే
భిక్షాటనం గృహే గ్రామే, పాత్రం హేమమయం కరే
నానా స్వాద్యమయీ భిక్షా, దత్తాత్రేయ ! నమోస్తుతే
బ్రహ్మజ్ఞానమయీముద్రా, వస్త్రేచమాకాశభూతలే
ప్రజ్ఞానఘనబోధాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
అవథూత సదానంద, పరబ్రహ్మ స్వరూపిణి
విదేహదేహరూపాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
సత్యరూప! సదాచార! సత్యధర్మపరాయణ !
సత్యాశ్రయ ! పరోక్షాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
శూలహస్త ! గదాపాణ ! వనమాలాసుకంధర !
యజ్ఞసూత్రధర ! బ్రహ్మన్‌ ! దత్తాత్రేయ ! నమోస్తుతే
క్షరక్షరస్వరూపాయ, పరాత్పరతరాయ చ
దత్తముక్తి పరస్తోత్ర, దత్తాత్రేయ ! నమోస్తుతే
దత్తవిద్యా(ఢ్య)య లక్ష్మీశ ! దత్తస్యాత్మస్వరూపిణి
గుణనిర్గుణరూపాయ, దత్తాత్రేయ ! నమోస్తుతే
శత్రునాశకరం స్తోత్రం, జ్ఞానవిజ్ఞానదాయకమ్‌
సర్వపా పప్రశమం, దత్తాత్రేయ ! నమోస్తుతే
ఇదం స్తోత్రం మహద్దివ్యం, దత్త ప్రత్యక్షకారకమ్‌
దత్తాత్రేయ ప్రసాదాచ్ఛ, నారదేన ప్రకీర్తితమ్‌

ఇతి నారదపురాణే నారద విరచితం దత్తాత్రేయ స్తోత్రమ్

గణేశ ఋణ విమోచక స్తోత్రం

గణేశ ఋణ విమోచక స్తోత్రం

ఎవరికీ అయితే ఋణ ( అప్పులు ) భాధలు వుంటాయో వారు .. ఈ గణేశ ఋణ విమోచక స్తోత్రముని ప్రతి రోజు ఉదయము 6 గంటల లోపు వినాయక పటము ముందుకొబ్బరి నూనె తో దీపము పెట్టి చదివాలి .... లేకపోతే వినాయక దేవాలయము లో అయిన కొబ్బరి నూనె తో దీపము పెట్టి , ఋణ విమోచక స్తోత్రం చదవాలి

ధ్యానం
సిందూరవర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదళే నివిష్టం
బ్రహ్మాదిదేవైః పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం ||

స్తోత్రం

సృష్ట్యాదౌ బ్రహ్మణా సమ్యక్పూజితః ఫలసిద్ధయే
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౧ ||

త్రిపురస్యవధాత్పూర్వం శంభునా సమ్యగర్చితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౨ ||

హిరణ్యకశ్యపాదీనాం వదార్థే విష్ణునార్చితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౩ ||

మహిషస్యవధే దేవ్యా గణనాథః ప్రపూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౪ ||

తారకస్య వధాత్పూర్వం కుమారేణ ప్రపూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౫ ||

భాస్కరేణ గణేశోహి పూజితశ్చ సుశిద్ధయే
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౬ ||

శశినా కాంతివృద్ధ్యర్థం పూజితో గణనాయకః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౭ ||

పాలనయ చ తపసాం విశ్వామిత్రేణ పూజితః
సదైవ పార్వతీపుత్రః ఋణనాశం కరోతుమే || ౮ ||

ఇదం ఋణహరం స్తోత్రం తీవ్ర దారిద్ర్య నాశనం
ఏకవారం పఠేన్నిత్యం వర్షమేకం సమాహితః || ౯ ||

దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేర సమతాం వ్రజేత్
పఠంతోఽయం మహామంత్రః సార్థ పంచదశాక్షరః || ౧౦ ||

శ్రీ గణేశం ఋణం ఛింది వరేణ్యం హుం నమః ఫట్
ఇమం మంత్రం పఠేదంతే తతశ్చ శుచిభావనః || ౧౧ ||

ఏకవింశతి సంఖ్యాభిః పురశ్చరణ మీరితం
సహస్రవర్తన సమ్యక్ షణ్మాసం ప్రియతాం వ్రజేత్ || ౧౨ ||

బృహస్పతి సమో జ్ఞానే ధనే ధనపతిర్భవేత్
అస్యైవాయుత సంఖ్యాభిః పురశ్చరణ మీరితః || ౧౩ ||

లక్షమావర్తనాత్ సమ్యగ్వాంఛితం ఫలమాప్నుయాత్
భూత ప్రేత పిశాచానాం నాశనం స్మృతిమాత్రతః || ౧౪ ||

ఇతి శ్రీకృష్ణయామల తంత్రే ఉమా మహేశ్వర సంవాదే ఋణహర్తృ గణేశ స్తోత్రం సమాప్తం.

సేకరణ

ఋణ విమోచన నృసింహ స్తోత్రం

ఋణ విమోచన నృసింహ స్తోత్రం

దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౧ ||

లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౨ ||

ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౩ ||

స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౪ ||

సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౫ ||

ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౬ ||

క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౭ ||

వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది వందితమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౮ ||

య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితమ్ |
అనృణే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్