Sunday, 2 September 2018

వారానికి 7 రోజులు ఎందుకు ?

వారానికి 7 రోజులు ఎందుకు ?
రోజుకు 24 hours కదా hour అనే పదం ఎక్కడిది
ఆదివారం_తర్వాత_సోమవారం_ఎందుకు? మంగళ వారం రావొచ్చుగా ?

మన వాడుకలో ప్రతి రోజుకి ఒక పేరు ఉంది . ఆది వారము, సోమ వారము, మంగళ వారము,బుదవారము, గురువారము, శుక్రవారము, శని వారము . ఇవి ఏడు . ఇలా ఈ ఏడు రోజులకు ఏడు పేర్లు ఎందుకు పెట్టారు

ఆ పేర్ల నిర్ణయానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి వుంది . నిర్ధిష్టమైన పద్ధతిలో పూర్వ కాలంలో భారత మహర్షులు ఆ పేర్లను నిర్ణయించారు . ఆ పేర్ల నిర్ణయానికి శాస్త్రీయమైన కారణాలున్నందునే ఆ పేర్లే ప్రపంచ వ్యాప్తంగా ఆచరణలో నేటికి ఉన్నాయి .

భారత కాలమానంలో #హోరా అనగా ఒక గంట అని అర్థం .దీని నుండి పుట్టినదే ఇంగ్లీషు #HOUR . ఒక రోజుకు 24 గంటలుంటాయి, అంటే 24 హోరాలు .
 ఒక రోజులో ఉన్న 24 గంటలు (24 హోరాలు) కూడా ఏడు హోరాల చక్రం లో తిరుగుతాయి .
ఆ 7 హోరాలకి ఏడు పేర్లున్నాయి .అవి వరుసగా  ..
 (ఈ వరుసలోనే) శని, గురుడు, కుజుడు, రవి, శుక్ర, బుద, చంద్ర హోరాలు ప్రతి రోజు వుంటాయి .

ఈ 7 హోరాలే ప్రతి రోజు 24 గంటల్లో ఉంటాయి .
7 గంటల కొకసారి ఈ 7 హోరాలు పూర్తీ అయ్యాక మల్లి మొదటి హోరాకి వస్తుంది . అంటే శని హోరా నుండి చంద్ర హోరాకి మల్లి శని హోరాకి .

ఉదాహరణకు ఆది వారము రవి హోరాతో ప్రారంభం అయి మూడు సార్లు  పూర్తికాగా (3 సార్లు 7 హోరాలు 3x7 = 21 హోరాలు) 22 వ హోరాపేరు మళ్ళీ రవి హోరా వస్తుంది .  23 వ హోరా పేరు ఆ వరుసలో శుక్ర హోరా అవుతుంది . 24 వ హోరా బుద హోర అవుతుంది. దాంతో ఒక రోజు పూర్తవుతుంది .

ఆతర్వాత హోరా 25వ హోరా,  అనగా తరువాతి రోజు మొదటి హోరా దాని పేరు చంద్ర హోరా .
అనగా సోమవారము, అనగా చంద్ర హోరాతొ ప్రారంభ మౌతుంది . ఏరోజు ఏ హోరాతో ప్రారంభ మవుతుందో ఆ రోజుకు ఆ హోరా పేరున దానికి ఆ పేరు వుంటుంది .

చంద్ర హోరాతో ప్రారంభమైనది గాన అది సోమ వారము . ఈ విధంగానే మిగిలిన దినములు కూడా ఆయా హోరాల పేరన పేర్లు ఏర్పడతాయి .

రవి (సూర్యుడు) హోరాతో ప్రారంభం = రవివారం, ఆదిత్య అన్న కూడా సూర్యుడు పేరే ...సో ఆదివారం, భానుడు అన్న కూడా సూర్యుడే భానువారం (కర్ణాటక, తమిళనాడు లో భానువారం వాడుతారు) ఇలా ఆయా హోరాలు బట్టి రోజుల పేర్లు వచ్చాయి .

ఆదివారం తరవాత సోమవారం ఎందుకు రావాలి ?  మంగళ వారమ్ రాకూడదా ? రాదు .
ఏందుకంటే ఆదివారం రవి హోరా ప్రారంభం అయ్యింది, తరువాత రోజు అంటే సోమవారం చంద్ర హోరా తో ప్రారంభం అయ్యింది కాబట్టి ...
ప్రపంచం లో దేశమయినా మన పద్దతి ఫాలో అవ్వాల్సిందే.

గణపతి తాళం (Ganapthi Thalam) ganapathy Thalam

గణపతి తాళం (Ganapthi Thalam)
ganapathy Thalam

అగణిత ఫణి ఫణ మణి గణ కిరణై |
రరు నిత నిజ తను రవి థథ వధన, థట థట లుట ధలి కుల కళ వినధో
గణపతి రభ మత మీహ దిశ తనుః
లంభోధర వర కుంజా వస్తిత కుంకుమ వర్ణ ధరం
శ్వేత శృంగం బీనసుహస్తం ప్రీతిత సఫల ఫలం
నాగత్రయ యుత నాగ విభూషణ నా నా గణపతి తం
త తం నా నా గణపతి తం
త తం నా నా గణపతి తం

తత్ పురుషాయ విద్మహే వక్రాతుండాయ ధీమహి తనో దంతి ప్రచొదయాథ్

వికటోత్కట సుందర దంతి ముఖం | భుజగేంద్రసుసర్ప గదాభరణం ||
గజ నీల గజేంద్ర గణాధిపతిమ్ | ప్రణతోస్మి వినాయక హస్తి ముఖం ||
సుర సుర గణపతి సుందర కేశమ్ | ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానమ్ ||
భవ భవ గణపతి పద్మ శరీరమ్ | జయ జయ గణపతి దివ్య నమస్తే ||
గజ ముఖ వక్త్రమ్ గిరిజా పుత్రమ్ | గణ గుణ మిత్రం గణపతిమీశప్రియమ్ ||

కరద్రుత పరశుమ్ కంకణ పాణిం కబలిత పద్మ రుచిం | సురపతి వంద్యం సుందర వక్త్రం సుందరచిత మణి మకుటమ్ ||
ప్రణమత దేహం ప్రకటిత కాలం షడ్గిరి తాళమిదం, తత్ తత్ షడ్గిరి తాళమిదం తత్ తత్ షడ్గిరి తాళమిదమ్ |
లంబోదర వర కుంజా సురకృత కుంకుమ వర్ణ ధరమ్ | శ్వేతసశృంగం మోదక హస్తం ప్రీతి సపనసఫలమ్||
నయనత్రయ వర నాగ విభూషిత నానా గణపతిదం, తత్తం నయన త్రయ వర నాగ విభూషిత నానా గణపతితం తత్తం నా నా గణపతిదం, తత్తం నా నా గణపతిదం, తత్తం నా నా గణపతిదమ్ ||

ధవలిత జల ధర ధవలిత చంద్రం ఫణి మణి కిరణ విభూషిత ఖడ్గం | తను తను విషహర శూల కపాలం హర హర శివశివ గణపతి మభయం, ధవలిత జల ధర ధవలిత చంద్రం ఫణి మణి కిరణ విభూషిత ఖడ్గం | తను తను విషహర శూల కపాలం హర హర శివశివ గణపతి మభయమ్||

కట తట విగలిత మద జల జలధిత గణపతి వాద్యమిదమ్ | కట తట విగలిత మద జల జలధిత గణపతి వాద్యమిదం తత్ తత్ గణపతి వాద్యమ్ ఇదమ్, తత్ తత్ గణపతి వాద్యమిదమ్||

తక తకిట తక తకిట తక తకిట తతోం, శశి కలిత శశి కలిత మౌళినం శూలినమ్ |
తక తకిట తక తకిట తక తకిట తత్తోం, విమల శుభ కమల జల పాదుకం పాణినమ్ |
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట తత్తోం, ప్రమథ గణ గుణ ఖచిత శోభనం శోభితమ్|
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట త తోం, మృదుల భుజ సరసి జభి షానకం పోషణం |
థక తకిట థక తకిట థక తకిట తతోం, పనస ఫల కదలి ఫల మోదనం మోదకం |
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట తతోం, ప్రమథగురు శివ తనయ గణపతి తాళనం |
గణపతి తాళనం ! గణపతి తాళనం !!

Thursday, 16 August 2018

వరలక్ష్మి వ్రతం /// పూజా విధానం


వరలక్ష్మి వ్రతం

(పూజా విధానం )

శ్రీ వర లక్ష్మి పూజ సామగ్రి :-
పసుపు ................. 100 grms
కుంకుమ ................100 grms
గంధం .................... 1box
విడిపూలు................ 1/2 kg
పూల మాలలు ........... 6
తమలపాకులు............ 30
వక్కలు..................... 100 grms
ఖర్జూరములు..............50 grms
అగర్బత్తి ....................1 pack
కర్పూరము.................50 grms
చిల్లర పైసలు .............. Rs. 30/- ( 1Rs coins )
తెల్ల టవల్ .................1
బ్లౌస్ పీసులు .............. 2
మామిడి ఆకులు............
అరటిపండ్లు ................ 1 dazans
ఇతర రకాల పండ్లు ........ ఐదు రకాలు
అమ్మవారి ఫోటో.....................
కలశము .................... 1
కొబ్బరి కాయలు ............ 3
తెల్ల దారము లేదా నోము దారము లేదా పసుపు రాసిన కంకణం 2............
స్వీట్లు ..............................
బియ్యం 2 kg
కొద్దిగా పంచామృతం లేదా పాలు 100 ML

పూజా సామాగ్రి :-

దీపాలు ....
గంట
హారతి ప్లేటు
స్పూన్స్
ట్రేలు
నూనె
వత్తులు
అగ్గిపెట్టె
గ్లాసులు
బౌల్స్

శ్రావణమాసంలో పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్నిఆచరించాలి. ఆ రోజున వీలుకాకపోతే తరువాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈవ్రతాన్ని చేయవచ్చు.వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రిసమయంలోచారుమతికి కలలో సాక్షాత్కరించింది. సువాసినులందరూ చేసే ప్రాభవ వ్రతం. “శ్రీ వరలక్ష్మీ నమస్తు వసుప్రదే, సుప్రదే” శుక్రవారం రోజున జరుపుకునే వరలక్ష్మీవ్రతంతో ధన, కనక, వస్తు,వాహనాది సమృద్ధులకు మూలం. శ్రావణ శుక్రవార వ్రతాలు పాపాలు పోవడంతోపాటు,
లక్ష్మీ ప్రసన్నత కలుగుతాయి.

వ్రత విధానం :-
వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటినిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చు కోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకునిఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచు కోవాలి.

కావలసినవి :-
పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములు కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపుకుందులు, ఐదువత్తులతో, హారతి ఇవ్వడానికి, అవసరమైన పంచహారతి, దీపారాధనకునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు మొదలైనవి.

తోరం ఎలా తయారుచేసుకోవాలి :-
తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటేఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలనుతయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.

గణపతి పూజ:-
అదౌ నిర్విఘ్నేన వ్రత పరిసమాప్త్యర్థం గణపతి పూజాం కరష్యే
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవో సర్వ కార్యేషు సర్వదా॥
ఆగచ్చ వరసిద్ధ వినాయక, అంబికా ప్రియనందన
పూజాగృహాణ సుముఖ, నమస్తే గణనాయక॥
గణపతిపై అక్షతలు చల్లాలి. యధాశక్తి షోడశోపచార పూజ చేయాలి.
ఓం సుముఖాయ నమః,
ఓం ఏకదంతాయ నమః,
ఓం కపిలాయ నమః,
ఓం గజకర్ణికాయ నమః,
ఓంలంబోదరాయ నమః,
ఓం వికటాయ నమః,
ఓం విఘ్నరాజాయ నమః,
ఓం గణాధిపాయ నమః,
ఓంధూమకేతవే నమః,
ఓం వక్రతుండాయ నమః,
ఓం గణాధ్యక్షాయ నమః,
ఓం ఫాలచంద్రాయ నమః,
ఓం గజాననాయ నమః,
ఓం శూర్పకర్ణాయ నమః,
ఓం హేరంబాయ నమః,
ఓం స్కందపూర్వజాయనమః,
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః
నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి.
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి
ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.
స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి.

ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం,
భర్గోదేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్!!

నీటిని నివేదన చుట్టూ జల్లుతూ … సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి… ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహాగుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటినివదలాలి). ఓం శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి, తాంబూలానంతరం అచమనంసమర్పయామి. (కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి)ఓం శ్రీ మహాగణాధిపతయే నమః కర్పూర నీరాజనం సమర్పయామినీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి!అనేన మాయా చరిత గణపతి అర్చనేన భగవతః సర్వాత్మకః శ్రీ గణపతిర్దేవతా సుప్రీతసుప్రసన్న వరదాభవతు! మమ యిష్టకామ్యార్థ సిద్ధిరస్తు!!

వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షతలు తలమీద వేసుకోవాలి. ఈ విధంగామహాగణపతి పూజను ముగించిన అనంతరం వరలక్ష్మీ వ్రతాన్ని ప్రారంభించాలి.

కలశపూజ :-
కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితాః
మూలేతత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ ఃస్థితాః
కుక్షౌతుస్సాగరస్సర్వే సప్తద్వీపా వసుంధరా
ఋగ్వేదోధ యజుర్వేదో స్సామవేదో అధర్వణః
అంగైశ్చ స్సహితా స్సర్వే కలశాంబు సమాశ్రితాః

ఆయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాఃగంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధూ కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు॥

అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పంతో ముంచి భగవంతుడిపైన, పూజాద్రవ్యాలపైన, పూజ చేస్తున్నవారు తలపైన చల్లుకోవాలి.

అధాంగపూజ:-
పువ్వులు లేదా అక్షతలతో కలశానికి పూజ చేయాలి.

చంచలాయై నమః – పాదౌ పూజయామి, చపలాయై నమః – జానునీ పూజయామి, పీతాంబరాయైనమః – ఉరుం పూజయామి, కమలవాసిన్యైనమః – కటిం పూజయామి, పద్మాలయాయైనమః -నాభిం పూజయామి, మదనమాత్రేనమః – స్తనౌ పూజయామి, కంబుకంఠ్యై నమః- కంఠంపూజయామి, సుముఖాయైనమః – ముఖంపూజయామి, సునేత్రాయైనమః – నేత్రౌపూజయామి, రమాయైనమః – కర్ణౌ పూజయామి, కమలాయైనమః – శిరః పూజయామి, శ్రీవరలక్ష్య్మైనమః – సర్వాణ్యంగాని పూజయామి.

(ఆ తరువాత పుష్పాలతో అమ్మవారిని ఈ అష్టోత్తర శతనామాలతో పూజించాలి)

శ్రీ వరలక్ష్మీ అష్టోత్తర శతనామావళి :-
ఓం ప్రకృత్యై నమః
ఓం వికృతై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూత హితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓంపరమాత్మికాయై నమః
ఓం వాచ్యై నమః
ఓం పద్మాలయాయై నమః
ఓం శుచయే నమః
ఓంస్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓంహిరణ్మయై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యైనమః
ఓం ఆదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం రమాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓంకామాక్ష్యై నమః
ఓం క్రోధ సంభవాయై నమః
ఓం అనుగ్రహ ప్రదాయై నమః
ఓంబుద్ధ్యె నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓంఅమృతాయై నమః
ఓం దీపాయై నమః
ఓం తుష్టయే నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓంలోకశోకవినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓంలోకమాత్రే నమః
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓంపద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓంపద్మముఖియై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓంపద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మ గంధిన్యైనమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖీయైనమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓంచంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః
ఓం చంద్ర రూపాయై నమః
ఓంఇందిరాయై నమః
ఓం ఇందుశీతలాయై నమః
ఓం ఆహ్లాదజనన్యై నమః
ఓం పుష్ట్యెనమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః
ఓం దారిద్ర నాశిన్యై నమః
ఓం ప్రీతా పుష్కరిణ్యైనమః
ఓం శాంత్యై నమః
ఓం శుక్లమాలాంబరాయై నమః
ఓం శ్రీయై నమః
ఓంభాస్కర్యై నమః
ఓం బిల్వ నిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యైనమః
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓంహేమమాలిన్యై నమః
ఓం ధనధాన్యకర్యై నమః
ఓం సిద్ధ్యై నమః
ఓం త్రైణసౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశగతానందాయై నమః
ఓంవరలక్ష్మ్యై నమః
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓంహిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్రతనయాయై నమః
ఓం జయాయై నమః
ఓంమంగళాదేవ్యై నమః
ఓం విష్ణువక్షస్థల స్థితాయై నమః
ఓం ప్రసన్నాక్ష్యైనమః
ఓం నారాయణసీమాశ్రితాయై నమః
ఓం దారిద్ర ధ్వంసిన్యై నమః
ఓంసర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓంబ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
ఓంభువనేశ్వర్యై నమః

తోరపూజ :-
తోరాన్ని అమ్మవారి వద్ద ఉంచి అక్షతలతో ఈ క్రింది విధంగా పూజ చేయాలి.

కమలాయైనమః – ప్రథమగ్రంథిం పూజయామి,
రమాయైనమః – ద్వితీయ గ్రంథింపూజయామి,
లోకమాత్రేనమః – తృతీయ గ్రంథింపూజయామి,
విశ్వజనన్యైనమః – చతుర్థగ్రంథింపూజయామి,
మహాలక్ష్మ్యై నమః – పంచమగ్రంథిం పూజయామి,
క్షీరాబ్ది తనయాయై నమః – షష్ఠమ గ్రంథిం పూజయామి,
విశ్వసాక్షిణ్యై నమః – సప్తమగ్రంథిం పూజయామి,
చంద్రసోదర్యైనమః – అష్టమగ్రంథిం పూజయామి,
శ్రీ వరలక్ష్మీయై నమః – నవమగ్రంథిం పూజయామి.
ఈ కింది శ్లోకాలు చదువుతూ తోరం కట్టుకోవాలి
బద్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రపౌత్రాభివృద్ధించ మమ సౌభాగ్యం దేహిమే రమే

వ్రత కథా ప్రారంభం :-
శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా!స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికిచెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను.శ్రద్ధగా వినండి.

పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి.ఇంద్రాది దిక్పాలకులు స్తుతిస్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తు న్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలుసర్వసౌఖ్యములు పొంది, పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరినవిధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మీవ్రతం. దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు.అప్పుడు పార్వతీదేవి…దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు?ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.కాత్యాయనీ…పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒకబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించు కునిప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామలను సేవించు కుని మితంగాసంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.

వరలక్ష్మీ సాక్షాత్కారం :-
వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలోచారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ…ఈ శ్రావణపౌర్ణమి నాటికిముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలనుఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. “హే జననీ!నీకృపా కటాక్షములు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగామన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకుకలిగింది’’ అని పరిపరివిధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది.

అంతలోనే చారుమతి మేల్కొని, అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు, అత్తమామలకు తెలిజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించివిని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురుచూచూడసాగారు.శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారాస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతితన గృహంలో మండపం ఏర్పాటుచేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచపల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవినిసంకల్ప విధులతో

సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే
శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే !! అంటూ ఆహ్వానించిప్రతిష్టించింది.

అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల తోరాన్ని చేతికి కట్టుకున్నారు.ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలుఘల్లుఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్నఖచితకంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణభూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు, ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి.ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతరగరథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకుతీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేనోళ్ళ పొగుడుతూ ఆమెకువరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతోతమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు.

వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీవ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలుకలిగి, సుఖజీవనం గడిపి ముక్తిని పొందారు. మునులారా… శివుడుపార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవిస్తరంగా మీకువివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడాసకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు సిద్ధిస్తాయనిసూతమహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరసుపైవేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీతీర్థప్రసాదాలు ఇచ్చి, పూజ చేసినవారు కూడా తీర్థప్రసాదాలు తీసుకోవాలి.అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి.రాత్రి ఉపవాసం ఉండాలి.
వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది.
ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలుకలుగుతాయి.

Monday, 30 July 2018

ఏలకులు ఆరోగ్య ప్రయోజనాలు

ఏలకులు  ఆరోగ్య ప్రయోజనాలు

1. సుగంధ ద్రవ్యాల్లో యాలుకులు ప్రధానమైనవి..
అవి ఆరోగ్యానికి, అందానికి, ఆనందానికి, రుచికి,  ప్రయోజనాలెన్నో ఉన్నాయి.
2. ప్రతిరోజూ యాలుక్కాయను తిని గోరు వెచ్చని నీళ్ళను తాగడం వల్ల మన శరీరానికి ఎలాంటి మెడిసిన్ తో అవసరం ఉండదు.
 3. బరువును తగ్గించాలనుకునే వారు రోజూ రాత్రి ఒక యాలుక్కాయను తిని, ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగడం వల్ల శరీరం లో ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఫలితంగా అధిక బరువును, చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.
4. నిత్యం ఒక యాలుక్కాయను తిని వేడి నీళ్ళు తాగడం వల్ల శరీరం లో హానికరమైన మలినాలు, చెడు పదార్దాలు తొలగిపోతాయి.
5.  రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
6. అన్ని అవయవాలాను శుద్ధి చేసి ఆరోగ్యం కాపాడుతుంది.
7. తిన్న ఆహారం కూడా బాగా జీర్ణమవుతుంది.
8.  రాత్రి పడుకోబోయే ముందు ఒక యాలుక్కాయను తిని ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగి తే
ఇలా కొన్ని రోజుల పాటు చేస్తూ ఉంటే నిద్రలేమీ సమస్య తొలగిపోతుంది.
9.  నిద్రలో గురక శబ్ధం చేసేవారు కూడా ప్రతిరోజూ రాత్రి ఒక యలక్కయను తిని వేడి నీళ్ళు తాగడం వల్ల ఒక మెడిసిన్ లా పని చేసి నిధానంగా నిద్రలో గురక తగ్గుతుంది.
10.  రోజూ ఇలా చేస్తే ఎముకలను బలంగా మార్చుతుంది.
11. ఇది చర్మాన్ని ఎలాంటి ఇన్ఫెక్షన్ భారిన పడకుండా ఆరోగ్యంగా కాపాడుతుంది.
12. జుట్టు రాలడాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఒత్తుగా పెంచేందుకు సహాయపడుతుంది.

Saturday, 21 July 2018

ఆలూ రోల్స్



కావాలసిన పదార్థాలు 

1. బంగాళదుంపలు(ఆలూ) - 2
2. బ్రెడ్ పౌడర్ - 1 కప్పు 
3. ఉడికించిన పచ్చిబఠాణీ -  1 కప్పు 
4. సేమియా - 1/4 కప్పు 
5. పచ్చిమిర్చి - 3
6. ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు 
7. అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 స్పూన్ 
8. గరం మసాలా - 1 స్పూన్ 
9. నెయ్యి - 1 స్పూన్ 
10. కొత్తిమీర తరుగు - 1/2 కప్పు 
11. మైదా (లేకపోతె వరిపిండి) - 1/2 కప్పు 
12. మొక్కజొన్న పిండి - 1/2 కప్పు 
13. ఉప్పు - రుచికి సరిపడినంత 
14. పసుపు - చిటికెడు 
15. కారం - 1/2 స్పూన్ 

తయారుచేయు విధానం 

ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి , అందులో బంగాళదుంపల్నివేసి ఉడికించి ,
పక్కన ఉంచుకోవాలి. చల్లారిన తరవాత పై తొక్కుతీసి ,
మెత్తగా ముద్దగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. 
ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి కొద్దిగా నూనె పోసి ,
ఉడికించిన పచ్చిబఠాణీని వేయించాలి, 
వేగిన తరవాత అల్లంవెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, 
మెత్తగా చేసుకున్న బంగాళాదుంప ముద్ద, బ్రెడ్ పౌడర్ వేసి బాగా కలపాలి.
 కొద్దిసేపు అయ్యాక కొత్తిమీర, నెయ్యిని కూడా వేసి
బాగా అన్నీ కలిసేటట్టుగా చేసి 
కిందకి దింపి పక్కన ఉంచుకోవాలి. 
ఈ మిశ్రమం చల్లారిన తరవాత 
కోలగా రోల్స్ చేసి పక్కన ఉంచుకోవాలి.

ఇప్పుడు ఒక బౌల్ లో మైదా, మొక్కజొన్నపిండిని వేసి ,
అందులో కొద్దిగా ఉప్పుని వేసి ,
ఇడ్లీ పిండిలాగా చిక్కగా కలుపుకోవాలి. 
పక్కనే ఒక ప్లేట్ లో సేమియాని వేసి ఉంచుకోవాలి. 
ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి ,
అందులో రోల్స్ మునిగేటట్టుగా Deep Fry కి సరిపడినంత నూనెను పోసి,
 ఆ నూనె బాగా కాగిన తరవాత,
పక్కన ఉంచుకున్న రోల్స్ ని మైదా మిశ్రమంలో ముంచి ,
పక్కనే ఉన్న సేమియాలో అద్ది , నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి.
అంతే కరకరలాడే వేడివేడి కమ్మని ఆలూ రోల్స్ 
రెడీ. వీటిని టమాటా సాస్ తో తింటే చాలా బావుంటాయి.     

Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer's
Achanta Subbalakshmi
Achanta Subhadevi

Monday, 30 April 2018

అక్షర క్రమంలో హిందూ ఋషుల పేర్లు

హిందూ ఋషులు జాబితా
అక్షర క్రమంలో హిందూ ఋషుల పేర్లు
అ - ఆ - ఇ - ఈ - ఉ - ఊ - ఋ - ఎ - ఏ - ఐ - ఒ - ఓ - ఔ - అం - క - ఖ - గ - ఘ - చ - ఛ - జ - ఝ - ట - ఠ - డ - ఢ - త - థ - ద - ధ - న
ప - ఫ - బ - భ - మ -య - ర - ల - వ - శ - ష - స - హ - ళ - క్ష

దేవర్షి : దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు.
బ్రహ్మర్షి : ఉత్తమ శ్రేణికి చెందిన మహర్షులను బ్రహ్మర్షులు అంటారు.
మహర్షి : సామాన్య ఋషి స్థాయిని దాటిని గొప్ప ఋషులను మహర్షి అంటారు.
రాజర్షి : రాజుగా ఉంటూనే ఋషిత్వం పొందినవాడు రాజర్షి.

అగ్ని మహర్షి
అగస్త్య మహర్షి
అంగీరస మహర్షి
అంగిరో మహర్షి
అత్రి మహర్షి
అర్వరీవత మహర్షి
అభినామన మహర్షి
అగ్నివేశ మహర్షి
అరుణి మహర్షి
అష్టావక్ర మహర్షి
అష్టిక మహర్షి
అథర్వణ మహర్షి
ఆత్రేయ మహర్షి
అథర్వాకృతి‎
అమహీయుడు
అజామిళ్హుడు‎
అప్రతిరథుడు‎
అయాస్యుడు‎
అవస్యుడు
అంబరీషుడు

ఇరింబిఠి‎


ఉపమన్యు మహర్షి
ఉత్తమ మహర్షి
ఉన్మోచన
ఉపరిబభ్రవుడు
ఉద్దాలకుడు‎
ఉశనసుడు
ఉత్కీలుడు

ఊర్ఝ మహర్షి
ఊర్ద్వబాహు మహర్షి

ఋచీక మహర్షి
ఋషభ మహర్షి
ఋష్యశృంగ మహర్షి
ఋషి


ఔపమన్యవ మహర్షి
ఔరవ మహర్షి

కపిల మహర్షి
కశ్యప మహర్షి
క్రతు మహర్షి
కౌకుండి మహర్షి
కురుండి మహర్షి
కావ్య మహర్షి
కాంభోజ మహర్షి
కంబ స్వాయంభువ మహర్షి
కాండ్వ మహర్షి
కణ్వ మహర్షి
కాణ్వ మహర్షి
కిందమ మహర్షి
కుత్స మహర్షి
కౌరుపథి‎
కౌశికుడు‎
కురువు
కాణుడు‎
కలి
కాంకాయనుడు
కపింజలుడు‎
కుసీదుడు

గౌతమ మహర్షి
గర్గ మహర్షి
గృత్సమద మహర్షి
గృత్సదుడు‎
గోపథుడు‎
గోతముడు
గౌరీవీతి
గోపవనుడు
గయుడు

చ్యవన మహర్షి
చైత్ర మహర్షి
చాతనుడు‎

జమదగ్ని మహర్షి
జైమిని మహర్షి
జ్యోతిర్ధామ మహర్షి
జాహ్న మహర్షి
జగద్బీజ
జాటికాయనుడు‎

తండి మహర్షి
తిత్తిరి మహర్షి
త్రితుడు
తృణపాణి

దధీచి మహర్షి
దుర్వాస మహర్షి
దేవల మహర్షి
దత్తోలి మహర్షి
దాలయ మహర్షి
దీర్ఘతమ మహర్షి
ద్రవిణోదస్సు‎

నచికేత మహర్షి
నారద మహర్షి
నిశ్ఛర మహర్షి
సుమేధా మహర్షి
నోధా
నృమేధుడు

పరశురాముడు
పరాశర మహర్షి
పరిజన్య మహర్షి
పులస్త్య మహర్షి
ప్రాచేతస మహర్షి
పులహ మహర్షి
ప్రాణ మహర్షి
ప్రవహిత మహర్షి
పృథు మహర్షి
పివర మహర్షి
పిప్పలాద మహర్షి
ప్రత్య్సంగిరసుడు
పతివేదనుడు
ప్రమోచన‎
ప్రశోచనుడు‎
ప్రియమేథుడు
పార్వతుడు
పురుహన్మ‎
ప్రస్కణ్వుడు
ప్రాగాథుడు
ప్రాచీనబర్హి
ప్రయోగుడు
పూరుడు
పాయు

భరద్వాజ మహర్షి
భృగు మహర్షి
భృంగి మహర్షి
బ్రహ్మర్షి మహర్షి
బభ్రుపింగళుడు
భార్గవవైదర్భి‎
భాగలి
భృగ్వంగిరాబ్రహ్మ
బ్రహ్మస్కందుడు‎
భగుడు‎
బ్రహ్మర్షి
బృహత్కీర్తి‎
బృహజ్జ్యోతి‎
భర్గుడు

మరీచి మహర్షి
మార్కండేయ మహర్షి
మిత మహర్షి
మృకండు మహర్షి
మహాముని మహర్షి
మధు మహర్షి
మాండవ్య మహర్షి
మాయు
మృగారుడు‎
మాతృనామ‎
మయోభువు‎
మేధాతిథి
మధుచ్ఛందుడు
మనువు
మారీచుడు

యాజ్ఞవల్క మహర్షి
యయాతి‎

రురు మహర్షి
రాజర్షి మహర్షి
రేభుడు

వశిష్ట మహర్షి
వాలఖిల్యులు
వాల్మీకి మహర్షి
విశ్వామిత్ర మహర్షి
వ్యాస మహర్షి
విభాండక ఋషి
వాదుల మహర్షి
వాణక మహర్షి
వేదశ్రీ మహర్షి
వేదబాహు మహర్షి
విరాజా మహర్షి
వైశేషిక మహర్షి
వైశంపాయన మహర్షి
వర్తంతు మహర్షి
వృషాకపి
విరూపుడు‎
వత్సుడు‎
వేనుడు
వామదేవుడు‎
వత్సప్రి
విందుడు

శంఖ మహర్షి
శంకృతి మహర్షి
శతానంద మహర్షి
శుక మహర్షి
శుక్ర మహర్షి
శృంగి ఋషి
శశికర్ణుడు
శంభు‎
శౌనకుడు
శంయువు‎
శ్రుతకక్షుడు

సమ్మిత మహర్షి
సనత్కుమారులు
సప్తర్షులు
స్థంభ మహర్షి
సుధామ మహర్షి
సహిష్ణు మహర్షి
సాంఖ్య మహర్షి
సాందీపణి మహర్షి
సావిత్రీసూర్య
సుశబ్దుడు‎
సుతకక్షుడు‎
సుకక్షుడు‎
సౌభరి
సుకీర్తి‎
సవితామహర్షి సామావేదానికి మూలము.
సింధుద్వీపుడు
శునఃశేపుడు
సుదీతి

హవిష్మంత మహర్షి
హిరణ్యరోమ మహర్షి

తెలుగు భాష గొప్పదనం// స్త్రీ అను పదమునకు పర్యాయ పదములివి.

తెలుగు భాష గొప్పదనం

స్త్రీ అను పదమునకు పర్యాయ పదములివి. దాదాపుగా 300 పదములకు కొన్ని తక్కువగా ఉన్నటువంటి ఘనత . ఇన్ని ఆర్యాయ పదములు మరే భాషలో ఉండవేమో ...!!!
1. అంగన
2. అంచయాన
3. అంబుజాలోచన
4. అంబుజవదన
5. అంబుజాక్షి
6. అంబుజనయన
7. అంబురుహాక్షి
8. అక్క
9. అతివ
10. అన్ను
11. అన్నువ
12. అన్నువు
13. అబల
14. అబ్జనయన
15. అబ్జముఖి
16. అలరుబోడి
17. అలివేణి
18. అవ్వ
19. ఆటది
20. ఆడది
21. ఆడగూతూరు
22. ఆడుబుట్టువు
23. ఇంచుబోడి
24. ఇంతి
25. ఇదీవరాక్షి
26. ఇందునిభాష్య
27. ఇందుముఖి
28. ఇందువదన
29. ఇగురాకుబోణి
30. ఇగురాకుబోడి
31. ఇభయాన
32. ఉగ్మలి
33. ఉజ్జ్వలాంగి
34. ఉవిధ
35. ఎలతీగబోడి
36. ఎలనాగ
37. ఏతుల
38. కంజముఖి
39. కంబుకంఠ
40. కంబుగ్రీవ
41. కనకాంగి
42. కన్నులకలికి
43. కప్పురగంధి
44. కమలాక్షి
45. కరబోరువు
46. కర్పూరగంది
47. కలకంఠి
48. కలశస్తిని
49. కలికి
50. కలువకంటి
51. కళింగ
52. కాంత
53. కించిద్విలగ్న
54. కిన్నెరకంఠి
55. కురంగానయన
56. కురంగాక్షి
57. కువలయాక్షి
58. కూచి
59. కృషమధ్యమ
60. కేశిని
61. కొమ
62. కొమరాలు
63. కొమిరె
64. కొమ్మ
65. కోమ
66. కోమలాంగి
67. కొమలి
68. క్రాలుగంటి
69. గజయాన
70. గరిత
71. గర్త
72. గుబ్బలాడి
73. గుబ్బెత
74. గుమ్మ
75. గోతి
76. గోల
77. చంచరీకచికుర
78. చంచలాక్షి
79. చంద్రముఖి
80. చంద్రవదన
81. చక్కనమ్మ
82. చక్కెరబొమ్మ
83. చక్కెర
84. ముద్దుగుమ్మ
85. చాన
86. చామ
87. చారులోన
88. చిగురుంటాకుబోడి
89. చిగురుబోడి
90. చిలుకలకొలోకి
91. చెలి
92. చెలియ
93. చెలువ
94. చేడి(డియ)
95. చోఱుబుడత
96. జక్కవచంటి
97. జని
98. జలజనేత్ర
99. జోటి
100. ఝషలోచన
101. తనుమధ్య
102. తన్వంగి
103. తన్వి
104. తమ్మికింటి
105. తరళలోచన
106. తరళేక్షణ
107. తరుణి
108. తలిరుబోడి
109. తలోదరి
110. తాటంకావతి
111. తాటంకిని
112. తామరకంటి
113. తామరసనేత్ర
114. తియ్యబోడి
115. తీగ(వ)బోడి
116. తెఱువ
117. తెలిగంటి
118. తొగవకంటి
119. తొయ్యలి
120. తోయజలోచన
121. తోయజాక్షి
122. తోయలి
123. దుండి
124. ధవలాక్షి
125. ననబోడి
126. నళినలోచన
127. నళినాక్షి
128. నవల(లా)
129. నాంచారు
130. నాచారు
131. నాచి
132. నాతి
133. నాతుక
134. నారి
135. నితంబవతి
136. నితంబిని
137. నీరజాక్షి
138. నీలవేణి
139. నెచ్చెలి
140. నెలత
141. నెలతుక
142. పంకజాక్షి
143. పడతి
144. పడతుక
145. పద్మముఖి
146. పద్మాక్షి
147. పర్వందుముఖి
148. పల్లవాధర
149. పల్లవోష్ఠి
150. పాటలగంధి
151. పుచ్చడిక
152. పుత్తడిబొమ్మ
153. పువు(వ్వు)బోడి
154. పువ్వారుబోడి
155. పుష్కరాక్షి
156. పూబోడి
157. పైదలి
158. పొల్తి(లతి)
159. పొల్తు(లతు)క
160. త్రీదర్శిని
161. ప్రమద
162. ప్రియ
163. ప్రోడ
164. ప్రోయాలు
165. బంగారుకోడి
166. బాగరి
167. బాగులాడి
168. బింబాధర
169. బింబోష్ఠి
170. బోటి
171. భగిని
172. భామ
173. భామిని
174. భావిని
175. భీరువు
176. మండయంతి
177. మగువ
178. మచ్చెకంటి
179. మడతి
180. మడతుక
181. మత్తకాశిని
182. మదిరనయన
183. మదిరాక్షి
184. మసలాడి
185. మహిళ
186. మానవతి
187. మానిని
188. మించుగంటి
189. మించుబోడి
190.మీనసేత్రి
191. మీనాక్షి
192. ముగుద
193. ముదిత
194. ముదిర
195. ముద్దరాలు
196. ముద్దియ
197. ముద్దుగుమ్మ
198. ముద్దులగుమ్మ
199. ముద్దులాడి
200. ముష్ఠిమధ్య
201. మృగలోచన
202. మృగాక్షి
203. మృగీవిలోకన
204. మెచ్చులాడి
205. మెఱుగారుబోడి
206. మెఱుగుబోడి(ణి)
207. మెలుత
208. మెళ్త(లత)మెల్లు(లతు)
209. యోష
210. యోషిత
211. యోషిత్తు
212. రమణి
213. రామ
214. రుచిరాంగి
215. రూపరి
216. రూపసి
217. రోచన
218. లతకూన
219.లతాంగి
220. లతాతన్వి

Monday, 23 April 2018

వాకింగ్ రెగ్యుల‌ర్‌గా చేయ‌డం వ‌ల్ల .......

1.  వాకింగ్ రెగ్యుల‌ర్‌గా చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎండార్ఫిన్లు అన‌బ‌డే హార్మోన్లు విడుద‌ల‌వుతాయి. ఇవి మాన‌సిక ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి. ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్‌, కంగారు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.
అలాగే వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వచ్చే దెమెంతియా, అల్జీమ‌ర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి
2 . నిత్యం వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం మెరుగుప‌డుతుంద‌ని అధ్య‌య‌నాలు చెబుతున్నాయి.
కంటికి సంబంధించిన ప‌లు నాడులు
కాళ్ల‌లో ఉంటాయి. అందుక‌నే
 వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగు ప‌డుతుంద‌ట‌. నిత్యం వాకింగ్ చేస్తే క‌ళ్ల‌పై అధిక ఒత్తిడి త‌గ్గ‌డంతోపాటు గ్ల‌కోమా వంటి కంటి వ్యాధులు రాకుండా ఉంటాయట‌.
3. నిత్యం ర‌న్నింగ్ చేస్తే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో అదేలాంటి బెనిఫిట్స్ వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కూడా క‌లుగుతాయ‌ని అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్ చెబుతోంది. 4. నిత్యం వాకింగ్ చేస్తే గుండె స‌మ‌స్య‌లు, హార్ట్ ఎటాక్‌లు రావ‌ట‌. అలాగే హైబీపీ, కొలెస్ట్రాల్ త‌గ్గుతాయ‌ట‌. దీంతోపాటు శ‌రీరంలో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంద‌ట‌.
5. వాకింగ్  చేయ‌డం వ‌ల్ల శ‌రీరం ఆక్సిజ‌న్‌ను ఎక్కువ‌గా గ్ర‌హిస్తుంది.  ఊపిరితిత్తుల స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి.
6. డ‌యాబెటిస్ ఉన్న‌వారు నిత్యం ర‌న్నింగ్ క‌న్నా వాకింగ్ చేస్తేనే ఎంతో ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ట‌.
 6 నెల‌ల పాటు వాకింగ్‌, ర‌న్నింగ్ చేసిన కొంద‌రు డ‌యాబెటిస్ పేషెంట్ల‌ను సైంటిస్టులు ప‌రిశీలించ‌గా ఈ విష‌యం వెల్ల‌డైంది. వాకింగ్ చేసిన వారిలో ర‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా అదుపులోకి వ‌చ్చాయ‌ని సైంటిస్టులు గుర్తించారు. అందువ‌ల్ల రోజూ వాకింగ్ చేస్తే డ‌యాబెటిస్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు.
 7. నిత్యం క‌నీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే పెద్ద పేగు క్యాన్స‌ర్ వ‌చ్చే ముప్పు చాలా వ‌ర‌కు త‌గ్గుతుంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. అలాగే జీర్ణ‌ప్ర‌క్రియ మెరుగు ప‌డుతుంది.
8. నిత్యం  10వేల స్టెప్స్ (100 నిమిషాలు) పాటు వాకింగ్ చేస్తే అధిక బ‌రువు త్వ‌ర‌గా త‌గ్గుతార‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. దీంతోపాటు కండ‌రాలు దృఢంగా మారుతాయ‌ట‌.
9. నిత్యం  వాకింగ్ చేయ‌డం వ‌ల్ల కీళ్లు బాగా ప‌నిచేస్తాయి. అవి అంత త్వ‌ర‌గా అరిగిపోవు. అలాగే ఎముక‌ల్లో సాంద్ర‌త పెరుగుతుంది. దీంతో ఫ్రాక్చ‌ర్లు, కీళ్ల నొప్పులు వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. ఇందుకు రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాలి. ఇలా చేస్తే కీళ్ల నొప్పులు, వాపులు కూడా త‌గ్గుతాయి.
10.బ్యాక్ పెయిన్‌తో  స‌త‌మ‌త‌మ‌య్యేవారికి వాకింగ్ చ‌క్క‌ని ఔష‌ధం అనే చెప్ప‌వ‌చ్చు. లో ఇంపాక్ట్ వ్యాయామం కింద‌కు వాకింగ్ వ‌స్తుంది. క‌నుక న‌డుంపై పెద్ద‌గా ఒత్తిడి ప‌డ‌దు. దీనికి తోడు ఆ భాగంలో ఉండే ఒత్తిడి, నొప్పి కూడా పోతాయి. ర‌క్త స‌ర‌ఫ‌రా పెరిగి నొప్పి త‌గ్గుతుంది. క‌నుక వెన్ను నొప్పి ఉన్న‌వారు నిత్యం వాకింగ్ చేయ‌డం మంచిది.

Thursday, 12 April 2018

అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం

అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే… ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే ‘బ్రహ్మముహూర్తం’ అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది.
నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.

పురాణగాథ
బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.

ఏం చేయాలి..
ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.

ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు… హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.

చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.

బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.

బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము.

Wednesday, 11 April 2018

ఆహార సూత్రాలు //రుజిత దివేకర్ భారత దేశం లో ఎక్కువ వేతనం ఇవ్వబడుతున్న డైటీషియన్ .

రుజిత  దివేకర్
భారత  దేశం లో  ఎక్కువ  వేతనం  ఇవ్వబడుతున్న  డైటీషియన్.

జూనియర్  అంబానీ  108  కిలోల  బరువు  తగ్గేలా   చేసిన  వ్యక్తి .
ఆమె చెప్పిన కొన్ని ఆహార  సూత్రాలు        

1. స్థానికంగా  దొరికే  పండ్లను  తినండి

అరటిపళ్ళు ,  ద్రాక్ష , సపోటా ,  మామిడి , ఏదైనా  సరే
పళ్ళు  అన్నిటిలోనూ  ఫ్రక్టోజు   ఉంటుంది . మామిడి  తినడం  ఆపిల్  తినడం  కంటే  హానికరం  కాదు .  ఎందుకూ  అంటే  మామిడి  మీకు  లోకల్ ,  ఆపిల్  మీకు  లోకల్  కాదు ,
(  ఆపిల్  కాశ్మీరు  నుండి  వస్తుంది ,   మామిడి  మీకు  లోకల్  గా  దొరుకుతుంది )
ఫ్రక్టోజు   మీ  గ్లూకోజును  నియంత్రణలో ఉంచుతుంది  కనుక  మీరు  పళ్ళను నిరభ్యంతరంగా   తినండి.

 2. మీరు  గింజలనుండి  వచ్చిన  నూనెలను   వాడండి
.( వేరుశనగ నూనె , నువ్వులనూనె , కొబ్బరినూనె , ఆవనూనె ) పేకింగ్ లో  వచ్చే vegetable   నూనేలకన్నా ( ఆలివ్, రైస్  బ్రాన్ , refined ఆయిల్స్ )  మీరు  ఆడించుకున్న  ఆయిల్స్  మంచివి .

 3.  రుజిత  ఎక్కువగా  నెయ్యి  గురించి  చెబుతారు . ప్రతిరోజూ  నెయ్యి  ఎక్కువగా  తినండి 
    అంటారు  ఆమె   ఏ  ఆహారపదార్ధం  లో  నెయ్యి  ఎక్కువగా  తినవచ్చో దానిలో  ఎక్కువగానూ 
    దేనిలో     తక్కువ  తినాలో  దానిలో  తక్కువగానూ  తినమంటారు  ఆమె .
    నెయ్యి  వాడడం  వలన   కొలెస్టరాల్   తగ్గుతుంది .
4. మీ  ఆహారం  లో  కొబ్బరి  ఎక్కవగా  వాడండి . 
     అటుకుల  పులిహార ( పోహా ) లో  ఇడ్లీ  ,  దోశల  చట్నీ ,   అన్నం  లో  చట్నీ గా తినమని  చెప్తారు
   ! కొబ్బరిలో  కొలెస్టరాల్  అస్సలు  ఉండదు .  మీ  నడుము  సన్నబదడేలా  చేస్తుంది  కొబ్బరి

 5. మీరు   ఓట్స్  గానీ,  ధాన్యాలు గానీ  టిఫిన్  గా  తినవద్దు ,అవి   పేకేజ్డ్  ఆహారం  .
    అవి  మనకు  అవుసరం  లేదు .  వాటికి  రుచీ  పచీ  ఉండదు ,  బోరు  కొడుతూ  ఉంటాయి ,
    మనం  మొదటి  ఆహారం  బోరు  కొట్టకూడదు  అంటారు  రుజిత.
    అల్పాహారం  గా   పోహా ,  ఉప్మా ,  ఇడ్లీ ,  దోశ ,  పరోటా  తినమని  ఆమె  సలహా
    బిస్కట్  యాడ్   లో   కొరికిన   ప్రతి   ముక్కలోనూ  పీచు  ఉంది  అంటారు .పీచుకోసం 
    ఓట్స్    తినక్కరలేదు . ఓట్స్  బదులు పోహా ,  ఉప్మా ,  ఇడ్లీ ,  దోశ ,
6. మీ   నోట్లో  పళ్ళు  ఉన్నంత  కాలం  జ్యూసులు  త్రాగకండి . 
    మీకు  పళ్ళు  ఉన్నది  కూరలూ  పళ్ళూ  తినడానికే
7.  చెరుకు రసం  మిమ్మల్ని  డీ  టాక్సిఫై  చేస్తుంది .  అది ఫ్రెష్  జ్యూస్  రూపం  లో తాగినా
     చెరుకు  ముక్కలు  తిన్నా సరే !
8.   pcos, thyroid -  ఉన్నవారు  శక్తి  కారకాలూ ,  బరువు  తగ్గేవీ  అయిన  వ్యాయామాలు 
       చెయ్యండి   పేకేజీ  ఆహారం  వదిలిపెట్టండి
9.  RICE -  మామూలు  తెల్లని  అన్నం  తినండి .  బ్రౌన్  రైస్   తినవలసిన  అవుసరం  లేదు . 
     అది  ఉడికేటపుడు  మీ  కుక్కర్  కీ  ,  ఉడికాక  మీ  పొట్ట  కీ  శ్రమను  కలిగిస్తుంది . 
     ఎందుకు  ఆ  శ్రమ ?
    రైస్  యొక్క GI INDEX   చాలా  తక్కువ  . 
    అది  పప్పు ,  పులుసు ,  పెరుగు  వంటి  వాటితో  కలిస్తే  దాని GI index మరింత్ తగ్గుతుంది
   వీటికి తోడు  నెయ్యిని  కూడా  చేరిస్తే  అది  మరింత  తగ్గుతుంది .
   రైస్  లో   మినరేల్స్   ఉన్నాయి  .  కాబట్టి  మీరు  రోజుకు  మూడుసార్లు  కూడా  తినవచ్చు .
   ఎంత  తినాలి ?
  ఆకలిగా  ఉంటె  ఎక్కువ  తినండి .   మీ  పొట్ట  ఏమి చెప్తుందో  దాన్ని  బట్టి  చెయ్యండి
  మీరు  రైస్ ,  చపాతీ  రెండూ  తినవచ్చు , లేదా  ఒక్క  రైస్  మాత్రమె  తినవచ్చు . 
 మూడుపూట్లా మీ  ఇష్టం  వచ్చినట్టు  ఏమీ  భయపడకుండా  తినండి .  మీ  ఆకలిని  బట్టి  తినండి
మీరు  తినే  ఆహారం  మిమ్మల్ని  భయపెట్టకూడదు .
( నెయ్యి  ,  రైస్  తినకూడదు  అంటూ  భయం  వద్దు )
మీరు  తినే  ఆహారం  మిమ్మల్ని  మంచిగా ఫీల్  అయ్యేలా  ఉండాలి
అయ్యబాబోయ్  ఎన్ని  కేలరీలు  తిన్నానో  అని  భయపడకండి ,  ఎంత  పోషకాహారం  తీసుకున్నానో  అనేది  చూడండి
10. పిజ్జా , పాస్తా ,  బ్రెడ్ ,  బిస్కట్ ,  కేకులు  అస్సలు  తినవద్దు
11. మిమ్మల్ని  మీరు  ప్రశ్నిచుకోండి
      ఈ ఫుడ్  మా  అమ్మమ్మ  తినేదా ?  మీ జవాబు  ఎస్   అయితే  భయం  లేకుండా  తినండి .
 12. రుతువును  బట్టి  తినండి .
      వర్షాకాలం  లో  పకోడీలు, జిలేబీలు లాంటివి తినండి .  ఎందుకంటే  ఆకలి  రుతువును 
       బట్టి      ఉంటుంది . ఒక్కొక్క  సీజన  లో  వేపుళ్ళు తినాలి  .  తినండి
13.  ఉదయాన్నే   టీ  మీ  మొదటి  ఆహారం  గా  తీసుకోకండి .
      అలాగే  బాగా  ఆకలిగా  ఉన్నప్పుడు  కూడా  టీ  త్రాగకండి .
      రోజులో  రెండు  మూడు  సార్లు   పంచదార  వేసుకుని  టీ  త్రాగండి
       గ్రీన్ టీ  త్రాగకండి  .  ఎల్లో  టీ , గులాబీ  టీ , నీలం  టీ   ఏమీ  వద్దు .
14.  మీ   సాంప్రదాయ  ఆహారం  తీసుకోండి
       నిలవచేసిన  పేకేజీ  ఫుడ్ /  డ్రింక్స్ ఏమీ  వద్దు
15.  వ్యాయామం   చెయ్యండి .  వాకింగ్  చెయ్యండి .  అరగడానికీ ,  ఆరోగ్యంగా  ఉండడానికీ.